335

శ్ర శ్రీ భగవద్గీత

అథ చతుర్భోఇ_ధ్యాయః

నాల్దవ అధ్యాయము

జ్ఞానయోగః జ్రానయోగము అధ్యాయముయొక్క పేరు :- “జ్ఞానయోగము” - అధ్యాయమునందు జ్ఞానసంబంధమైన విచారణయుండుట చేతను, జ్ఞానతపస్సు, జ్ఞానయజ్ఞము, జ్ఞాననౌక, జ్ఞానాగ్ని జ్ఞానఖడ్గము - మున్నగు వానిని గూర్చి

ప్రస్తావింపబడుటచేతను, అధ్యాత్మజ్ఞానముయొక్క మహిమ వోేషముగ చెప్పబడుటచేతను, అట్టి జ్ఞాన మెవరికి ఎట్లు లభించునో చక్కగ విశదీకరింపబడుటచేతను ప్రకారముగ జ్ఞానమునకు సంబంధించిన విషయములే యెక్కువగా వర్ణింప బడియుండుటవలనను దీనికి జ్ఞానయోగమని పేరు పెట్టబడినది.

అధ్యాయమందలి ప్రధాన విషయములు :-

(1) భగవానుని ప్రభావము, నిష్కామకర్మయోగ ప్రస్తావన (1వ శ్లో॥ నుండి 18 శ్లో॥ వఅకు). (2) జ్ఞానియొక్క పవిత్ర ఆచరణము (19వ శ్లో॥ నుండి 23వ శ్లో॥ వఅకు). (3) వివిధములగు యజ్ఞముల వర్ణన- జ్ఞానయజ్ఞముయొక్క ఆధిక్యత (24వ శ్లో॥ నుండి 32 శ్లో॥ వలకు). (4) జ్ఞానముయొక్క మహిమ (33వ శ్లో॥ నుండి 42వ శ్లో॥ వఅకు).

పూర్వాధ్యాయముతో అధ్యాయమునకు గల సంబంధము :-

నిష్కామకర్మాచరణముచే చిత్తము శుద్ధము కాగా, అట్టి నిర్మలచిత్తమున జ్ఞాన ముదయించుననుట పరమసత్యము. క్రిందటి అధ్యాయమగు “కర్మయోగమున " అట్టి చిత్తశుద్ధికి వలసిన కర్మాచరణపద్ధతు లన్నియు చక్కగ తెలుపబడనవి.. కావున ఇక జ్ఞానావలంబమునకు క్షేత్రము సిద్ధిపడినట్లే అయినది. ఇక్కారణమున వెనువెంటనే అర్జునునకు జ్ఞానయోగమును భగవాను డీయధ్యాయమున ప్రసాదించుచున్నారు. అట్టి జ్ఞానమే అధ్యాయముయొక్క విషయము. అధ్యాయమున జ్ఞానసంబంధ వార్తలే యెక్కువగనున్నను, మధ్య యొకింత కర్మయోగప్రస్తావనయుకలదు. వెనుకటి అధ్యాయములందు వివరింపబడిన నిష్కామకర్మయోగాదిరూప అధ్యాత్మవిద్య అతి ప్రాచీనమైనదనియు, మొట్టమొదట భగవానుడే దానిని సూర్యున కుపదేశింప, సూర్యునిద్వారా క్రమముగ మన్వాది మహర్షులు దాని నవలంబించిరనియు అధ్యాయ ప్రారంభమున తెలుపబడినది. ప్రకారముగ నిష్కామకర్మయోగము యొక్క ప్రశంసతో

336 గీతామకరందము [4వ అధ్యాయము

జ్ఞాన యోగము

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కుతామ్‌ ధర్మ సంస్థాపనార్ణాయ సంభవామి యుగేయుగే. (4-8)

సాధు, సజ్జనులను సంరక్షించుటకొ అకును, దుర్మార్గులను వినాశ మొనర్చుట కొఅకును, ధర్మమును లెస్సగ స్థాపించుటకొ టికును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 337

అధ్యాయము ప్రారంభింపబడుచున్నది - మూడు శ్లోకములద్వారా శ్రీకృష్ణమూర్తి తత్సందర్భమును వివరించుచున్నాడు -

శ్రీ భగవానువాచ :-

1. ఇమం వివస్వతే యోగం ప్రోక్షవానహమవ్యయమ్‌ వివస్వాన్‌ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఇ_బ్రవీత్‌. శ్రీ భగవానువాచ = శ్రీ భగవంతుడు పలికెను.

టీక;- అవ్యయమ్‌ = నాశరహితమైనట్టి, ఇమంయోగమ్‌ = నిష్కామకర్మయోగ మును, (తద్ద్వారా పొందబడు జ్ఞాననిష్టను), అవామ్‌ = నేను, (వురా = సృష్ట్యాదికాలమున) వివస్వుతే = సూర్యునికొటకు, ట్రోక్టవాన్‌ = చెప్పియుంటివి, వివస్వాన్‌ = సూర్యుడు, మనవే = (తన పుత్రుడగు వైవస్వత) మనువుకొటకు, ప్రాహ = చెప్పెను, మనుః = మనువు, ఇక్ష్వాకనే = (తనపుత్రుడగు) ఇక్ష్వాకునికొజికు, అ(బవీల్‌ = చెప్పెను.

తౌ:- శ్రీభగవానుడు చెప్పెను - నాశరహితమగు నిష్కామకర్మయోగమును (తద్ద్వారా పొందబడు జ్ఞాననిష్టను) పూర్వము నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువున కుపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బొధించెను.

వ్యాఖ్య:- నిష్కామకర్మయోగమును (తద్ద్వారా పొందబడు జ్ఞాననిష్టను) పూర్వము భగవానుడు సూర్యున కుపదేశింప, ఆతనిద్వారా క్రమముగ తక్కిన రాజర్జులును తెలిసికొనగల్లిర. మహత్తరయోగము జీవుని చిత్తమును శుద్ధపరచి _ స్వస్వరూపానుభూతిద్వారా సంసారబంధవిచ్చిత్తిని. మోక్షమును కలుగజేయునదియగుటచే దీనిని సాధించినవారందజు బుషిసత్తములై ముక్తులైరి. వారు సంఘమున అంతస్తునందున్నప్పటికిని, (బ్రాహ్మణులైనను, రాజులైనను, తదితరులైనను సర్వులును పరమ గ్రేయమును బొందిరి.

“అవ్యయమ్‌” - చిత్తశుద్ధిద్వారా నాశరపితమగు మోక్షమను ఫలమొసంగుట వలన నిష్మామకర్మయోగాదిరూప అధ్యాత్మవిద్య అవ్యయమని చెప్పబడినది. మజియు సత్యము కాలమందును నశింపదు కనుక, సత్యమును పొందింపజేయ మార్గమునకును కాలమందును నాశముండదు. కావున అది అవ్యయమైనది. ఒకవేళ దాని ప్రచారము దేశకాలపరిస్థితులచే హెచ్చుతగ్గులు గల్గియున్నను అది మాత్రము పూర్తిగ అంతరించదు. భగవానుడే అవతారమెత్తి దాని నుద్ధరించుచుందురు.

ప్రా నిష్కామ కర్మయోగ మెట్టిది? 'ఊ:- నాశరహితమైనది. శాశ్వత మోక్షఫలంబొసంగునది. ప్ర:- అది లోకమున నెట్లు వ్యాపించెను?

ఉ- మొట్టమొదట భగవానుడు సూర్యున కుపదేశింప, సూర్యుడు మనువునకును, మనువు ఇక్ష్వాకువునకును దానిని బోధింప, క్రమముగ లోకమున వ్యాపించెను.

338 గీతామకరందము [4వ అధ్యాయము 2. ఏవం పరవ్పురాప్రాప్తమిమం రాజర్షయో విదుః

కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప.

టీకః- వర్త్హవ = అర్జునా! ఏవమ్‌ = ప్రకారముగ, వరమ్బురాప్రావ్హమ్‌ = పరంపరగ వచ్చిన,

ఇమమ్‌ = యోగమును, రాజర్హయ: = రాజర్షులు, విదుః = తెలిసికొనిరి, మహతాకాలోన = చాలాకాలము గడచినందున, సయోగః = యోగము, ఇహ = లోకమున, నష్టః = అదృశ్యమైనది.

తా:- అర్జునా! ప్రకారముగ పరంపరంగా వచ్చిన నిష్కామకర్మ యోగమును రాజర్షులు తెలిసికొనిరి. చాలాకాలము గడచినందున యోగ మిపుడి లోకమున అదృశ్యమైనది (ప్రచారములో లేకున్నది).

వ్యాఖ్య:- “రాజర్షయఃో - రాజు అధ్యాత్మవిద్యయొక్క అనుభూతి గలిగి యుండి నపుడు రాజర్షి యగును. అనగా రాజత్వము, బుషిత్వము రెండునుగలవాడు రాజర్షి యనబడును. పూర్వ మనేకమంది రాజులు పరమార్థవిద్యను గ్రహించి రాజర్షులుగా మారిరి. “బుషి అనునది ఒక బిరుదు. దాని నెవరైనను పొందవచ్చును. అధ్యాత్మ జ్ఞానమును చక్కగ సాధించినచో సామాన్యమానవుడు మహర్షిగా మారిపోగలడు. నిష్కామకర్మయోగము నవలంబించి, ఇంద్రియములను జయించి, మనస్సును స్వాధీనపజచుకొని, కామాదులను నిర్జించి ఆత్మానుభవము నొందగల్సువాడే బుషిత్వమును బడసినట్లగును. పూర్వ మెందరో రాజు లాప్రకార మాచరించి రాజర్షులు కాగల్లిరని యిట వచింపబడినది. ఎన్నియో కార్యకలాపములు, విక్షేపములు, వ్యవహారములుగల రాజులే ఇట్టి విద్యను సాధింపగల్గినపుడు, ఇక తక్కినవారి విషయము చెప్పనేల? కొందజు గృహస్థులు తమకు అనేక కుటుంబ వ్యవహారములు, ఉద్యోగపుపనులు, వ్యవసాయకార్యములు ఉండుననియు, ఆధ్యాత్మికసాధనల నానర్చుటకు మాత్రము తీరకలేదనియు, అన్నియు వదలిన సన్న్యాసులకే అది సాధ్యపడుననియు వచించుచుందురు. వాక్యము సత్యదూరమైనదని శ్లోకము బుజువుచేయుచున్నది. రాజునకులేని వ్యవహారములా గృహస్థులకుండునవి? కావున పూర్వకాలపు రాజులవలె సర్వులును నిష్కామకర్మ యోగాది పరమార్థసాధనల ననుష్టించి తరింపవచ్చును. శ్లోకమున రాజర్షులు తెలిసికొనిరి అని చెప్పబడినందున, తక్కిన వారు తెలిసికొనలేదని యర్ధముకాదు. అఆ కాలమున దాని నాచరించువారిలో రాజులు ప్రధానులై యుండిరి. మజియు అర్జునుడు రాజై యుండినందువలన పూర్విక రాజుల యొక్క యా మార్గము ననుసరించుటలో నాతనికి కష్టతరమైనదేదియు నుండదని తెలుపుట కొఅకును అట్లు చెప్పియుండవచ్చును.

“నష్టకి - అను పదమునకు పూర్తిగ నశించిపోయినది అను అర్థముకాదు. కాలగర్భమున (పరశురాముడు రాజులను వధించుట మొదలగు అవాంతర పరిస్థితులచే) రాజర్షులెజిగిన బ్రహ్మవిద్యయొక్క, నిష్కామకర్మయోగముయొక్క ప్రచారము లోకమున సన్నగిలినదనియే అర్ధము. కానిచో పైక్లోకమునందే ఈయోగము ' అవ్యయమ్‌”, (నాశరహితమైనది) అని చెప్పినదానికి వ్యాఘాతము కలుగును. పరమాత్మ యెట్లు శాశ్వతుడో, ఆతనిచే సృజింపబడిన ధర్మమున్ను శాశ్వతమైనదే యగును.

3. ఏవాయం మయా తేఇ_ద్య యోగః ప్రోక్తః పురాతనః భక్షోజ_సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్‌.

22

4వ అధ్యాయము] టైరు రాచ 339

టీకః- మే= నా యొక్క, భక్షః= భక్తుడవును, సఖాభ = స్నేహితుడవును, అసి ఇతి = అయితివని, వురాతనః = ప్రాచీనమైన, సః ఏవ అయం యోగః = యీ నిష్కామకర్మ యోగమే, అద్య = ఇప్పుడు, తే = నీ కొటికు, మయా = నాచేత, ్రోక్టు = చెప్పబడినది, ఉత్తమమ్‌ = శ్రేష్టమైన, ఏతత్‌ = యోగము, రహస్యమ్‌ వా = అతిరహస్యమైనది కదా!

తా:-- నీవు నాభక్తుడుగను, మిత్రుడుగను నున్నావు కావున పురాతనమైన నిష్కామకర్మయోగమునే యిపుడు తిరిగి నీకు జెప్పితిని. అది మిగుల శ్రేష్టమైనదనియు, రహస్యమైనదనియు నెటుంగుము.

వ్యాఖ్య:- భగవాను డర్జునునకు బోధించిన (ఈ నిష్కామకర్మయోగాది) పరమార్థవిద్య క్రొత్తగా ఆవిర్భవించినదికాదు. అనాదికాలమునుండియు కలదు. కనుకనే అది “పురాతనము అని చెప్పబడినది. అయితే దేశకా లపరిస్థితు లను బట్టి కాలగర్భమున అది ఒకింత మరుగైనపుడు సాక్షాత్‌ దైవముకాని లేక దైవాంశసంభూతులగు మహనీయులుగాని యవతరించి అద్దానిని సముద్ధరించుదురు. ఇట్టి ప్రాచీనమగు ఉత్తమవిద్యనే శ్రీకృష్ణమూర్తి అర్జునున కిపుడు బోధించిరి.

యోగమును అర్జునునకే యేల బోధింపవలెను? ఇందులకు కారణము కలదు. కారణ మీ శ్లోకమున స్పష్టముగ తెలుపబడినది. అర్జునుడు పరమభక్తుడు, పరమమిత్రుడు. కనుకనే భగవానుడు అతిరహస్యమైనప్పటికిని దాని' నతనికి ఉపదేశించివైచిరి. అర్జునునివలెనే ఎవైనను సరియే నిర్మలభక్తి పరమ(ప్రేమ సంపాదించుకొనగల్లుచో వారికిని భగవానుడు తప్పక అధ్యాత్మజ్ఞానమును ప్రసాదించగలరు. (దదామి బుద్దియోగమ్‌ 10-10). కాబట్టి అర్జునునివలె అర్హతను ముందు సంపాదించుకొనవలెను. తదుపరి జ్ఞానము దానియంతట నదియే భగవత్మృపవలన లభించగలదు.

“రహస్యం హ్యేతదుత్తమమ్‌” - భగవానుడు బోధించిన పరమార్థవిద్య, నిష్కామకర్మతత్త్వము పరమరహస్యమైనదనియు, మహోత్కృష్టమైనదనియు తెలుప బడినది. సామాన్యముగ రహస్యమును ఎవరును ఒకరికి తెలుపరు. కాని అర్జునుని యందు తగిన యోగ్యతలు (భక్తి, ప్రేమ) ఉన్నందున శ్రీకృష్ణు డాతనికి రహస్యమును బట్టబయలుచేసివైచిరి. మజియు, “ఉత్తమమ్‌” అని చెప్పినందువలన ప్రపంచములో గల సమస్త పదార్థములందును శ్రేష్టమైనది. అధ్యాత్మవిద్యయేయని భగవానుడు స్పష్టముచేసినట్లెనది.

ప్ర:- భగవాను డర్జునునకు బోధించిన పరమార్ధవిద్య, నిష్కామకర్మతత్త్వము ఎట్టిది? ఉ:- (1) పురాతనమైనది (2) ఉత్తమమైనది (3) రహస్యమైనది.

ప్ర:- ఇట్టి విద్యను అర్జునునికే ఏల ఉపదేశింపవలెను?

ఊ:-- భగవానున కాతడు (1) పరమభక్తుడు (2) పరమమిత్రుడు కాబట్టి.

అ॥ శ్రీకృష్ణమూర్తి పూర్వము సూర్యభగవానున కీపరమార్ధవిద్య నుపదేశించిరను వాక్యమును వినుటతోడనే, మొన్న మొన్న (ద్వాపరయుగాంతమున) దేవకీగర్భమున పుట్టిన శ్రీకృష్ణుడు సృష్ట్యాదియందు సూర్యున కెట్లు బోధింపగల్గిరను సంశయ మర్జ్హునునకు కలుగగా, వెంటనే తన్నివృత్తికొణ కాతడు భగవానుని యిట్లు ప్రల్నించెను -

340 గీతామకరందము [4వ అధ్యాయము

అర్జున ఉవాచ :-

4. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున ఉవాచ = అర్జునుడు చెప్పెను -

టీకః- భవతః = నీ యొక్క, జన్మ = జన్మము, అవరమ్‌ = తరువాతిది, వివన్వితః = సూర్యునియొక్క, జన్మ = జన్మము, పరమ్‌ = వెనుకటిది, ఆదౌ = సృష్ట్యారంభమున, త్వమ్‌ = నీవు, ట్రోక్టవాన్‌ ఇతి (యత్‌) = చెప్పితివనుట యేదికలదో, ఏతత్‌ = దీనిని కథమ్‌ = ఎట్టు, విజానీయామ్‌ = తెలిసికొందును!

తౌ:- అర్జునుడు చెప్పెను - (ఓ కృష్ణా) మీ జన్మము ఇటీవలది. సూర్యుని జన్మము బహుపురాతనమైనది. అట్టిచో మీరు సూర్యున కుపదేశించితిరను విషయమును నేనెట్లు గ్రహించగలను?

వ్యాఖ్య:- పూర్వము రాజసూయయాగసందర్భమున అర్జునుడు భీష్మునివంటి మహనీయుని ముఖతః శ్రీకృష్ణునియొక్క నిజతత్త్వమును, వారు సాక్షాత్‌ పరమాత్మ యేయను సత్యమును వినియుండెను. అయినను ఇపుడు శ్రీకృష్ణుని దేవకీసుతునిగనే వీక్షించి 'మీరు మొన్న మొన్ననే పుట్టితిరిగదా!” అని పలుకుటకు కారణమేమి? ఇందులకీ క్రింది హేతువులను చెప్పవచ్చును. (1) సాక్షాత్‌ శ్రీకృష్ణుని ముఖతః ఆతని అవ్యయస్వరూపవర్ణనమును అర్జునుడు స్వయముగ వినగోరియుండవచ్చును. (2) ప్రశ్న ద్వారా సామాన్యజనులయొక్క మనస్సునందుండు సంశయమును నివారింపజేయదలంచి యుండవచ్చును.

శ్రీకృష్ణమూర్తి కేవలము పాంచభౌతికరూపముకాదు. వారు త్రికాలాబాధ్యులగు విశ్వవ్యాపకులైన పరమాత్మ, సత్యమును భగవానుడే మటుక్లోకమునందు జెప్పబోవుదురు. దేహదృష్టి మనోదృష్టి ఆత్మదృష్టి యని మూడుదృష్టులు కలవు. ఒకవ్యక్తిని జూడగనే ఆతనిశరీరము, చర్మము, దాని అందచందములు, దాని పుట్టుక, జాతి రంగు, ఆకారము మాత్రమే స్ఫురణకువచ్చుట దేహదృష్టి ఆతని పాండిత్యము, గుణగణములు, శీలము మున్నగువానిని తలంచుట మనోదృష్టి. ఆతని నిర్మల ఆత్మరూపమునే వీక్షించుట అఆత్మదృష్టి. ఇందు మూడవదియగు ఆకత్మదృష్టినే మహనీయులు గలిగియుందురు. సామాన్యజనులు మొదటి రెండుదృష్టులను అవలంబింతురు. దేహము, మనస్సు ప్రకృతి జన్యములు, నశ్వరములు. దృష్టులు సరికావు. కావున ఆత్మదృష్టినే ప్రతివారును అభ్యసించవలయును. దానినే భగవాను డిపుడు ప్రతిపాదింపబోవుచున్నాడు.

అ॥ అర్జునుని యా ప్రశ్న విని శ్రీకృష్ణమూర్తి తన నిజతత్త్వమును ప్రకటించుచున్నాడు - శ్రీ భగవానువాచ :- 5. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున

తాన్యహం వేద సర్వాణి త్వం వేత్స పరన్తప. శ్రీ భగవానువాచ : శ్రీభగవంతుడు చెప్పెను.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 341

టీకః- అర్జున = అర్జునా!, మే = నాకును, తవచ = నీకును, జన్మాని = జన్మలు, బవూని = అనేకములు, వ్యతీతాని = గడచిపోయినవి, తాని సర్వాణి = వానినన్నిటిని, అహమ్‌ = నేను, వేద = ఎజుంగుదును, పరన్హన = అర్భునా!, త్వమ్‌ = నీవు, వేళ్ల = ఎజుగవు.

తౌ:- శ్రీ భగవానుడు చెప్పెను - శత్రువులను తపింపజేయు అర్జునా! నీకును, నాకును ఇంతవజ కనేక జన్మలు గడచినవి. వాని నన్నిటిని నే నెజుంగుదును. నీ వెజుంగవు.

వ్యాఖ్య:- ఈశ్వరుడు, జీవుడు - ఇరువురును వాస్తవముగ ఒకే ఆత్మ స్వరూపులు. కాని ఈశ్వరుడు మాయను జయించినవాడు; జీవుడు మాయాధీనుడు. ఇదియే వారిరువురకును గల భేదము, ఈశ్వరుడు మాయను స్వాధీనముచేసికొని లోకసంరక్షణార్థము పెక్కు జన్మలు (అవతారములు) ఎత్తుచుండును. జీవుడు మాయకు లోబడి, కర్మబద్దుడై అనేక జన్మ లెత్తుచుండును. ఈశ్వరుడు సర్వజ్ఞాడుకావున తానెత్తిన యా జన్మలన్నిటిని ఎజీంగియేయుండును. జీవుడు కించిజ్ఞాడు కావున అట్టి స్మృతి వానికి లేదు. సత్యమునే భగవాను డీశ్లోకమున వివరించుచున్నాడు.

అజ్ఞానవశమున జీవునిదృష్టి వర్తమానజన్మకే పరిమితమైయుండును. వాస్తవముగ ప్రతిజీవికి కోట్లకొలది జన్మలు గడచినవి. ఇప్పటికి ఎందజో తండ్రులు, ఎందజో తల్లులు అతనికి గడచిపోయిరి. ఆకత్మజ్ఞానముచే కర్మబంధము నశింపనిచో ఆతడింకను ఎన్నియో జన్మలెత్తవలసియుండును. పుణ్యవశాత్తు ఇపుడు సర్వోత్తమమగు మానవజన్మ లభించినది. మోక్షమునకు సోహనమువంటి మానవజన్మను బొందియు తన యాత్మనెజింగి తరించుట్లై యత్నింపక జన్మల నంతముచేయజూడక్క పై పెచ్చు విషయభోగములందు మునింగి తతృ్ఫలితముగ ఇంకను అనేకజన్మలందు యాతనల ననుభవించువాడు నిక్కముగ _ దౌర్భాగ్యుడేయగును. కాబట్టి భగవాను డీక్లోకమున _ దెలిపినట్లు _ ప్రతివాడును తనపూర్వజన్మలన్నింటిని ఒకపర్యాయము స్మృతిపథమునకు దెచ్చుకొనిి యమయాతనలను, గర్భనరకములను, _ శ్లేశములను _ సంస్కరించి, ఇకమీదట అట్టి జన్మలకు _ స్వస్తిచెప్పులాగున కృతనిశ్చయుడుకావలెను. తల్లిగర్భమున నున్నపుడు జీవునకు దాదాపు 7వ మాసమున క్షణకాలము దివ్యదృష్టిగలుగగా నపుడాతడు తనపూర్వపు జన్మలన్నిటిని జూచి భీతిల్లి భగవానుని శరణుబొంది జన్మరాహిత్యమున్లై ఈజీవితమున సర్వయత్నములు చేసెదనని వాగ్జానముచేయును. కాని గర్భమునుండి వెలువడగనే అంతయు మటచిపోవును. అట్టుచేయక, జీవుడు భగవానుని ఆశ్రయించి ఈజన్మయందే కడతేరులాగున చూడవలయును. పురోభివృద్ధిని గోరువాడు పూర్వవృత్తాంతమును మజువగూడదు. భగవాను డర్జునునకు పూర్వజన్మలనుగూర్చి జ్ఞాపకము చేసెను. అర్జునునకువలె ప్రతిమానవునకును అట్టిజన్మలు సంభవించియున్నవి. గనుక, వానిని సంస్కరించి జన్మయందు భక్తి జ్ఞానవైరాగ్యాది సాధనములచే ఆత్మానుభూతిని సముపార్టించుటద్వారా సంసారబంధవిచ్చిత్తిని, జన్మరాహిత్యమును గలుగజేసికొనుట జీవుని కర్తవ్యము.

అ॥ తన జన్మకున్ను, తక్కిన జీవరాసుల జన్మలకున్ను గల భేదమును తెలుపుట, తన జన్మరహస్యమును భగవాను డెటింగించుచున్నాడు-

6. అజో2_పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో2_పి సన్‌ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా.

342 గీతామకరందము [4వ అధ్యాయము

టీక:- (అహమ్‌ = నేను), అజు అసిసన్‌ = పుట్టుకలేనివాడనైనను, అవ్యయాత్మా (అపిసన్‌) = నాశరహితస్వరూపముకలవాడనైనను, భూతానామ్‌ = ప్రాణులకు, ఈశ్వరః అపిసన్‌ = ఈశ్వరుడను (నియామకుడను) అయియున్నను, స్వామ్‌ = స్వకీయమైన, (వకృతిమ్‌ = ప్రకృతిని అధిష్టాయ = స్వాధీనపఅచుకొని, ఆత్మమాయయా = నాయొక్క మాయాశక్తిచేత, సంభవామి = పుట్టుచున్నాను.

తౌ:- నేను పుట్టుకలేనివాడను, నాశరహితస్వరూపముకలవాడను, సమస్తప్రాణులకు ఈశ్వరుడను అయియున్నప్పటికి స్వకీయవమగు ప్రకృతిని వశపబిచుకొని నా మాయాశక్తిచేత పుట్టుచున్నాను (అవతరించుచున్నాను).

వ్యాఖ్య:- “నాకును అనేక జన్మలు గడచినవి అని శ్రీకృష్ణమూర్తి క్రిందటి ళ్లోకమునందు చెప్పియుండిరి. కావున భగవంతుడును సర్వజీవులవలె జన్మకర్మలకులోనైయున్నారా? అను సంశయ మిచట నుదయింపవచ్చును గనుక అందులకు సమాధానము వెనువెంటనే శ్లోకమునందు చెప్పబడుచున్నది. భగవంతునియొక్క జన్మమువేటు, తదితరులయొక్క జన్మమువేటు. జీవులు ప్రకృతికి వశులై (మాయకులో బడి) కర్మవశమున జన్మలెత్తుచున్నారు. ఈశ్వరు డట్టుకాదు. వారు 'ప్రకృతికిలో బడక, మాయను స్వాధీనమొనర్చుకొని లోకోపకారార్థము, ధర్మసముద్ధరణము కొాజికు తమ యిచ్చచేతనే జన్మలెత్తుచున్నారు. ఇచట భగవంతునకు మూడులక్షణములు చెప్పబడినవి - (1) జన్మలేనివాడు (2) నాశరహితుడు (3) ప్రాణికోట్లయొక్క నియామకుడు - అని. ప్రకారముగ వాస్తవముగ జన్మరహితుడైనను స్వకీయశక్తిచే లోకసంగ్రహార్థము అవతారము లెత్తుచున్నాడు. ప్రాణికోట్లపై భగవానున కెంత కరుణగల్గియున్నదో, ధర్మసముద్ధరణమందు వారికి ఎంత ఉత్కంఠతగలదో _అవతారతత్త్వముద్వారా మనము గ్రహించుకొనవచ్చును. వాక్యము లవలన శ్రీ కృష్ణమూర్తి కేవలము వసుదేవుని సుతుడుమా త్రమే కాదనియు, అవ్యయపరమాత్మయే యనియు, జగన్నియామకుడగు ఈశ్వరుడే యనియు స్పష్టమగుచున్నది.

ప్ర:- భగవంతు డెట్టివాడు? ఉ:-- (1) జన్మరహితుడు (2) నాశవర్ణితుడు (3) జగన్నియామకుడు (ఈశ్వరుడు) ప్రః- అట్టి జన్మరహితుడు మరల యేల జన్మలెత్తుచున్నాడు?

ఊ- ప్రకృతిని స్వాధీనపబిచుకొని లోకోద్ధరణముకొజుకు మాత్రము జన్మించుచున్నాడే కాని అజ్ఞానులవలె కర్మకు వశుడై కాదు.

అ॥ తాను జన్మించుటకు కారణములను రెండుక్లోకములద్వారా భగవానుడు చెప్పుచున్నాడు-

7. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్లానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌. టీక:- భారత = అర్జునా, యదా యదా = ఎప్పుడెప్పుడు, ధర్మస్య = ధర్మమునకు, గ్లానిః =

హానియు, అధర్మస్య = అధర్మమునకు, అభ్యుత్ధానమ్‌ = అభివృద్ధియును, భవతి = కలుగుచున్నదో, తదా = అప్పుడు, అత్మానమ్‌ = నన్ను, అహమ్‌ = నేను, నృజామి = సృష్టించుకొనుచున్నాను.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 343

తౌ:- అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధియగుచుండునో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును (నేను అవతరించుచుందును).

వ్యాఖ్య:- ధర్మము ఎంతశ్రేష్టమైనదో భగవానుని ఈవాక్యమువలన సుస్పష్ట మగుచున్నది “ధర్మోరక్షతిరక్షితః అనునట్లు ధర్మాచరణమే మనుజుని రక్షించగలదు. జీవునకు శాంతిని, శాశ్వతసౌఖ్యమును ఒసంగగల్గునది అదియే. కనుకనే భగవాను డద్దాని రక్షణమునకై బద్ధకంకణులైరి. ధర్మముయొక్క రక్షణకై సాక్షాత్‌ పరమాత్మయే పూనుకొనునని చెప్పినపుడు ఇక నద్దాని మహాత్మ్యమును వేజుగ వర్ణించవలెనా? అట్లే అధర్మముయొక్క అభివృద్ధిని తాను సహింపలేనని భగవానుడు తెలుపుటవలన దానియొక్క నికృష్ణత్వమున్ను స్పష్టముగ గోచరించుచున్నది. కాబట్టి శ్రేయమును కాంక్షించువారందజును ధర్మము నభివృద్ధిపజచుచు, అధర్మమును రూపుమాపుచునుండవలెను. అపుడే వారు ఈశ్వరనియమమున కనుగుణ్యముగ నడచువారై జన్మసార్థక్య మొందగలరు.

ప్ర:- భగవంతు డెపుడవతరించును? ఉల ధర్మము క్షయించునపుడు, అధర్మము వృద్ధినొందునపుడు.

8. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతామ్‌ ధర్మసంస్థాపనార్గాయ సంభవామి యుగే యుగే.

టీక:- సాధూనాం. = సజ్జనులయొక్క (సన్మార్గప్రవర్తకులయొక్క), పరిత్రాణాయ = సంరక్షణముకొజుకును, దుష్కృతామ్‌ = దుర్మార్గులయొక్క, వినాశాయ = వినాశము కొటుకును, భర్మనంస్థావనార్థాయ = ధర్మమును లెస్సగ స్థాపించుటకొఅకును, యుగే యుగే = ప్రతియుగమునందును

(ప్రతి సమయమునందును అనగా, అపుడుపుడు), సంభవామి = అవతరించుచున్నాను.

తౌ:- సాధు, సజ్జనులను సంరక్షించుటకొ జకును, దుర్మార్గులను వినాశమొనర్చుట కొజకును ధర్మమును లెస్సగ స్థాపించుట కొజకును నేను ప్రతియుగము నందును అవతరించుచుందును.

వ్యాఖ్య:- సన్మార్గమున జనువారికి, సత్రవర్తనగలిగియుండువారికి, సాధుశీలురకు మాత్రమే భగవానుని రక్షణ లభించును. సర్వేశ్వరుని సంరక్షణ నభిలషించువారికి తగిన అర్హతయుండవలెను. అర్హత ఒకానొక జాతికాదు, మతముకాదు, కులముకాదు, సాధుత్వము. అనగా సత్రవర్తన, ధర్మానుష్థానము. అట్లు సన్మార్గమున, సత్యపథమున నడచువారందటును భగవానునిచే సంరక్షింపబడుదురు. వారు భగవంతుని అభయహస్తము క్రింద నుండుటచే వారికి ఏకొజతయు నుండదు. వారచిరకాలములోనే భవసాగరమును దాటిపోవుదురు. అట్టివారి సముద్ధరణముకొటికు, పరిరక్షణముకొఅకు తానపుడపుడు అవతరించుచుందునని భగవాను డిచట వాడ్రుచ్చిరి.

అట్లే దుష్టులను శిక్షించుటకు గూడ తాను జన్మించుచుందునని వచించిరి. కావున దుష్కార్యములయొక్క ఘోరపరిణామములను ముందుగనే ఊహించుకొని, వానినుండి విముఖులై, పాపభీతిగల్గి దైవసంస్థాపనము. ధర్మము నుద్ధరించుట్లకై భగవానుడు బద్ధకంకణులైరి. కావున భగవానున కేది అతి ప్రీతికరమైయున్నదో, అట్టి ధర్మమునే ఆశ్రయించి జీవులు సర్వేశ్వరునికృపకు పాత్రులు కావలసియున్నారు.

344 గీతామకరందము [4వ అధ్యాయము

ఈశ్ట్లోకమునందు తెలుపబడిన (1) సాధుసంరక్షణము (2) దుష్టశిక్షణము (3) ధర్మసంస్థాపనము - అను మూడు ఉద్దేశ్యములలో ఏయొకదానికొజకుగాని, లేక రెండిటికొఅకుగాని, లేక మూడింటికొఅకుగాని, భగవాను డవతరించుచుందురు.

ఇచట సాధువులనగా సన్న్యాసులనిగాని, బైరాగులనిగాని అర్థముకాదు. “సాధు - అనగా “మంచి” అని యర్థము. మంచి ప్రవర్తనగలవారందజును సాధువులే. వారు గృహస్ఫులైనను, (బ్రహ్మచారులైననుసరియే.

“యుగేయుగే *' - అనగా యుగమునకు ఒకసారి అవతరించునను భావము కాదు, “అపుడపుడు” అని దాని అర్థము. పైనదెలిపిన యవసరము లెపుడేర్పడునో అపుడు - అని తాత్పర్యము.

శోకమునందు 'త్రాణాయ'” అనిచెప్పక “పరిత్రాణాయ అని చెప్పుటయు, “నాశాయ” అనిచెప్పక “వినాశాయి అనిచెప్పుటయు, “స్థాపనార్ధాయ” అనిచెప్పక “సంస్థాపనార్థాయ అని చెప్పుటయు గమనించదగినవి. ఆయా క్రియలయొక్క అధికమాత్రనవి సూచించును.

భగవంతుడు దయాగ్రహృదయుడుకదా! మటి దుష్టుల నెందులకు శిక్తించునని కొందటు ప్రశ్నించవచ్చును. నిజముగా శిక్షణ వారిపై చూపిన యనుగ్రహమే యగును. భగవానుని శిక్షణచే వారిపాపములు క్షాళితములై పోగలవు. మటియు అట్టు శిక్షించనిచో లోకమున అధర్మము, దుర్మార్గము ప్రబలి సంఘమునకంతకును గొప్పప్రమాదము వాటిల్లగలదు. శరీరముపై పుండు లేచినచో దానిని “ఆపరేషన్‌ ద్వారా నిర్మూలించిననే, లేక కొంతభాగము ఛేదించిననే శరీర మారోగ్యవంతముగ నుండును గదా! పుండుమానిపోవునుగదా! అట్లే దుష్టశిక్షణయునని గ్రహించుకొనవలయును.

అ॥ ప్రకారము భగవంతునియొక్క జన్మకర్మలను తెలిసికొను వారికి కలుగుఫలితమును వివరించుచున్నాడు -

9. జన్మ కర్మ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఇ_ర్హున.

టీకః- అర్జున = అర్జునా!, యః = ఎవ్వడు, ఏవమ్‌ = రీతిగా, మే = నా యొక్క, దివ్యమ్‌ = దివ్యమైన, జన్మ =జన్మమును, కర్మ = కర్మమును, తత్త్వతః = యథార్థముగ, వేత్తి = తెలిసికొనుచున్నాడో, సః= అతడు, దేవామ్‌ = శరీరమును, త్యక్త్వా = విడిచి, పునః = తిరిగి, జన్మ = జన్మను, ఏతి = పొందడు, మామ్‌ = నన్ను, ఏతి = పొందును.

తౌ:- అర్జునా! ఎవడీ ప్రకారముగ నా యొక్క దివ్యమైన జన్మమును, కర్మమును గూర్చి యధార్థముగ తెలిసికొనుచున్నాడో, అట్టివాడు మరణానంతరము మజల జన్మమునొందక నన్నే పొందుచున్నాడు (మోక్షమును బడయుచున్నాడు).

వ్యాఖ్య:- “బ్రహ్మవిద్రహ్మైవభవతి' - (బ్రహ్మమును తెలిసికొనువాడు (బ్రహ్మమే యగుచున్నాడను ఉపనిషద్వాక్యముయొక్క సారాంశమే శ్లోకమున తెలుపబడినది. భగవంతునియొక్క దివ్యములగు జన్మ, కర్మలను (లీలలను) యధథార్థముగ నెజుంగువాడు, భక్తిపారవశ్యముచేత వారియందే దత్తచిత్తుడై భగవద్ధ్యాననిరతుడై యుండును. గావున ఆతడా పరమాత్మనే పొందుచున్నాడు. భగవత్స్వరూపమును చక్కగ

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 345

తెలిసికొనుట “సాధన. భగవదైక్యమునొందుట “సాధ్యము”. ప్రకారముగ సాధన, సాధ్యము - రెండును శ్లోకమునందు తెలుపబడినవి. అయితే “తత్త్వతః అని చెప్పినందువలన, భగవద్విషయమును స్వానుభవముద్వారా యథార్థముగ నెజుంగ వలెనేకాని, “వాచా” జ్ఞానముచేగాని, అశాస్త్రీయజ్ఞానముచేగాని, అపాతజ్ఞానముచేగాని సంతుష్టినొందరాదు.

“దివ్యమ్‌' అని చెప్పినందువలన భగవానుని లీలలు, జన్మ, కర్మలు అప్రాకృతములని తేలుచున్నది. భగవానుడు ప్రకృతిని స్వాధీనపజిచుకొనినవాడు గనుక వారి చర్యలు సామాన్యప్రాణులయొక్క చర్యలవలె నుండవు. భగవత్తత్వము నెజుగువాడు “పునర్జన్మను పొందడు" అని చెప్పి, వెనువెంటనే “నన్నే పొందును” అని తెలుపుటవలన జన్మరాహిత్యపదవి శూన్యము కాదనియు కేవలము సచ్చిదానందఘన ఆత్మస్వరూపస్థితియే అది యనియు సుస్పష్టమగుచున్నది.

“దేహమును విడిచి నన్నే పొందును” - అను వాక్యము యొక్క అర్థము దేహమును విడిచిన పిదపయే మోక్షమును పొందునని కాదు. వాస్తవముగ, క్షణమున మనుజుడు భగవత్తత్వమును లెస్సగ నెజుంగునో, క్షణముననే (దేహమున్నపుడే) అతడు మోక్షమునొందుచున్నాడు. దేహమును విడిచిన పిదప మరల దేహమును పొందడని తెలుపుటకొటికే దేహాన్తరప్రస్తావన ఇచట గొనిరాబడినది.

ప్ర;- భగవత్సాయుజ్యమునెవరు పొందగలరు?

ఉం భగవంతునియొక్క అప్రాకృత జన్మ, కర్మలను, తత్త్వమును వాస్తవముగ నెజుంగువారు.

అ॥ పూర్వమెందజో మహనీయు లాప్రకారము దైవతత్త్వము నెటీంగి తరించి యుండిరని వచించుచున్నాడు. 10. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః

బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః.

టీక:.- వీతరాగభయ(్రోధాః = అనురాగము (కోరిక), భయము, కోపము విడచినవారును, మన్మయాః = నాయందే లగ్నమైన చిత్తముగలవారును (నాయందే తన్మయులును), మామ్‌ = నన్ను,

ఉపాశ్రితాః = ఆశ్రయించినవారును (అగు), బహవః = అనేకులు, జ్ఞానతవసా = (ఇట్టి) జ్ఞానతపస్సుచేత, వూతాః = పవిత్రులై, మద్భావమ్‌ = నా స్వరూపమును (మోక్షమును), ఆగతాః = పొందిరి.

తౌ:- అనురాగము, భయము, (క్రోధము విడిచినవారును, నాయందే లగ్నమైన చిత్తముగలవారును, నన్నే ఆశ్రయించినవారు నగు అనేకులు ఇట్టి జ్ఞానతపస్సుచే పవిత్రులై నా స్వరూపమును (మోక్షమును) బొందియుండిరి.

వ్యాఖ్య:- “జ్ఞానయోగ” మను అధ్యాయమునందు గీతాచార్యులు జ్ఞానమును తపస్సు, యజ్ఞము, అగ్ని, నౌక, ఖడ్గము మున్నగు వివిధరూపముల వర్ణించిచెప్పుదురు. ఇచ్చోట జ్ఞానమును తపస్సుగా వర్ణించిరి. ప్రపంచములో అనేక తపస్సులున్నప్పటికిని, జ్ఞానతపస్సు సర్వోత్కృష్టమైనది. ఏలయనిన శరీరముపై గల మాలిన్యమును జలము కడిగివైచి శుద్ధి చేయునట్లు, బహుజన్మార్థిత పాపపంకిలమును జ్ఞానతపస్సు కడిగివైచి చిత్తమును శుద్ధమొనర్చును (కనుకనే “పూతా? (పవిత్రులై) అను పదము ప్రయోగింపబడినది).

346 గీతామకరందము [4వ అధ్యాయము

మోక్షమున కిట్టి చిత్తనైర్మల్య మత్యంతావశ్యకమై యున్నది. అయితే జ్ఞానతపస్సనగానేమి? (1) రాగభయ క్రోధములు లేకుండుట (2) భగవన్మయుడైయుండుట (3) భగవంతుని ఆశ్రయించుట. అట్టి జ్ఞానతపస్సు యొక్క ఫలితమేమి? (1) చిత్తశుద్ధి (2) పరమాత్మస్వరూపప్రాప్తి - అని యీక్లోకమున చెప్పబడినది.

“వీతరాగభయ(్రోధా౯ - జ్ఞానతపస్సునందలి మొదటిసాధన కామ(క్రోధభయములను త్యజించుట. ఈదుష్టత్రయము సాధకునకు మహాప్రమాదకరమైనది. కాబట్టి ప్రయత్నపూర్వకముగ దుర్గుణముల మూడింటిని తొలగించుకొనవలెను. అయితే అవి యెట్లు తొలగగలవు? దానికి ఉపాయమున్ను వెనువెంటనే చెప్పబడినది. “మన్మయాళి “మాముపాశ్రితా? - అనగా నిరంతర భగవచ్చింతన, భగవదాశ్రయము ఇవియే ఉపాయములు. రాగభయ క్రో ధరాహిత్యమను “వాసనాక్షయము” నిరంతర భగవన్మయత్వ, భగవదా శ్రయత్వములను “తత్త్వజ్ఞానము' యొక్క సహాయముచే లభ్యముకాగలదు. వాసనాక్షయ, తత్త్వజ్ఞానములు రెండును ఒకదానిచే మజియొకటి పరిపోషింపబడుటవలన రెండిటిని ఏకకాలమందే సమముగ నభ్యసించుచురావలెను.

“బహవః - ఇంతవజకెందటో ఇట్టి జ్ఞానతపస్సుచే పునీతులై (బ్రహ్మసాయుజ్య మొందగల్గిరని చెప్పుటవలన దానిమహిమను దెల్పుటకు ప్రత్యక్షసాక్ష్యము లభించినట్లెనది. పూర్వమెందటో దానిని సాధించి ముక్తిని బడసినందున, ఇపుడును, మున్ముందును గూడ “ఆ ప్రకారమే పడయగలరనుటలో సందేహములేదు. కాబట్టి ముముక్షువు లాయాసాధనలను తప్పక ఆచరించి శ్రేయము నొందవలయును.

క్లోకముద్వారా తెలుపబడిన ముఖ్యాంశములు-

(1) భగవత్స్వరూపమును బొందుటకు హృదయనిర్మలత్వము ఆవశ్యకము.

(2 హృదయనిర్మలత్వమునకు జ్ఞానతపస్సు అవసరము.

(3) జ్ఞానతపస్సనగా - (1) కామశ్రోధభయరాహిత్యము.

(2) భగవత్తన్మయత్వము.

(3) భగవదాశ్రయత్వము.

ప్ర;- హృదయశుద్ధి దేనివలన కలుగగలదు?

ఉ:- జ్ఞానతపస్సుచే. (దీనివివరములు పైన తెలుపబడినవి).

అ॥ తన్నేప్రకారముగ జనులు సేవించుదురో, ప్రకారమే వారి ననుగ్రహించుదునని భగవానుడు వచించుచున్నాడు -

11. యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథెవ భజామ్యహమ్‌

మమ వర్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః

టీకః- పార్ర= అర్జునా!, యే = ఎవరు, యథా = ఏప్రకారముగ, మామ్‌ = నన్ను, ్రసద్యన్లే = ఆశ్రయించుచున్నారో (సేవించుచున్నారో), తాన్‌ = వారలను, తథా ఏవ = ఆప్రకారమే, అవామ్‌ = నేను,

భజామి = అనుగ్రహించుచున్నాను, మనుష్యాః = మనుజులు, మమ = నాయొక్క, వర్ణ = మార్గమును, నర్వళః = అన్నివిధముల, అనువ్తర్షన్హే = అనుసరించుచున్నారు.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 347

తౌ:- అర్జునా! ఎవరేప్రకారముగ నన్ను సేవింతురో వారి నాప్రకారముగనే నేననుగ్రహింతును. మనుజులు సర్వవిధముల నా మార్గమునే అనుసరించుచున్నారు.

వ్యాఖ్య:- “చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ "| అనునట్లు ఎవరెవరు ఏయే విధముగ ఎంతెంత భక్తితో, ఏయే రూపముతో తన్ను అర్చించుదురో లేక సేవించుదురో, వారిని ఆయావిధముగనే అనుగ్రహించెదనని భగవానుడు పలుకుచున్నాడు. పరమాత్మ కల్పవృక్షమువంటివాడు. ఆయన చెంతకుపోయి ఏది వాంఛించిన దానినొసంగును. ప్రకారముకోరిన, ప్రకారముగ _ ఫలితమును గలుగజేయును. ఎవర్షికైన ఉత్తమఫలితములుగాని, మోక్షముగాని కలుగకపోయినచో అది వారిదోషమే కాని భగవంతునిది కాదు. తెఅచాపను పైకి ఎత్తనిచో పడవ కదలదు. భగవదనుగ్రహమనుగాలి సర్వత్రవీచుచున్నను జనులు తమ హృదయములను తెరచాపలను దైవోన్ముఖములుగ చేసిననేకాని జీవితనౌకలు పురో గమించవు. ఇనుమునకు _ త్రుప్పు ఉండినచో సూదంటురాయి దాని నాకర్షించదు. అట్లే మనస్సునందు విషయామాలిన్యము, దృశ్యదోషములు ఉన్నచో భగవంతుడు తనవైపునకు దాని నాకర్షించుకొనరు. కాబట్టి వారివారి ప్రయత్నములయొక్క తీవ్రతనుబట్టి యా పరమార్థసతృలములను భగవానుడు వారలకు కలుగజేయుచునుండును.

“మమ వర్త్మ్మానువర్తన్తే * _ ప్రకారముగ భగవంతుడు భక్తులయెడల ప్రేమ, దయ చూపుటవలన జనులున్ను పరస్పర మట్టి ప్రేమను, సద్భావమును లెస్సగ ప్రకటించుకొనుచున్నారు. జనులు భగవన్మార్గమునే సర్వవిధముల ననుసరించుచున్నారు. (లేక, దైవమార్గములగు కర్మ భక్తి, ధ్యాన, జ్ఞానమార్గములనే జనులాశ్రయించుచున్నారనియు చెప్పవచ్చును).

అ॥ కాందజు ఇతరదేవతల నేల యుపాసించుచున్నారో చెప్పబడుచున్నది- 12. కాజ్జన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా.

టీక:- కర్మణామ్‌ = కర్మములయొక్క, నీద్ధిమ్‌ = ఫల ప్రాప్తిని కాజ న్రః = అపేక్షించువారు, ఇవా = ఈలోకమున, దేవతాః = దేవతలను, యజన్లే = ఆరాధించుచున్నారు, పా = ఏలయనగా, కర్మజా = కర్మమువలనగలిగెడు, నిద్ధిః = ఫల ప్రాప్త, మానుషేలోకే = మనుష్యలోకమునందు, క్షిప్రమ్‌ = శీఘ్రముగ, భవతి = కలుగుచున్నది.

తౌ:- డకర్మములయొక్క _ ఫలప్రాప్తిని అపేక్షించు మానవు లీప్రపంచమున దేవతల నారాధించుచున్నారు. ఏలయనగా కర్మఫలసిద్ధి మనుష్యలోకమున శీఘ్రముగ గలుగుచున్నది.

వ్యాఖ్య:- తక్కినలోకములకంటె మనుష్యలోకమున కర్మములకు ఫలసిద్ధి శీఘ్రముగ గలుగునని యిట వచింపబడినది. కాబట్టి జనులు సత్కర్మానుష్థానపరులై యుండులాగున త్వరితముగ యత్నించవలెను. ఇది కర్మానుష్మానలో కము. తక్కిన లోకములు ఇంచుమించు కర్మఫలాను భవలో కములే, కావున అచట మోక్షసిద్ధికె యత్నించుట కంతగా వీలుపడదు. నరకమనువ్యాధికి (భవరోగమునకు) మనుష్యలోకమునందే ఉత్తమానుష్థానము ద్వారా చికిత్సచేసికొననిచో, కర్మానుష్మానమున కవకాశములేని తక్కినలోకములను (మజణానంతరము) పొంది భవరోగపీడితుడేమిచేయగలడని విష్ణుభగవానుడు

348 గీతామకరందము [4వ అధ్యాయము

పూర్వము గరుత్మంతుని ్రశ్చించెనే. కావున త్వరితముగ సత్కర్మముల నాచరించి చిత్తశుద్ధిని బడసి జ్ఞాన ప్రాప్తిద్వారా లోకమందే మోక్షధామము నలంకరించుట శ్రేయస్కరము.

ప్రః- కర్మముయొక్క ఫలితము లోకమున శీఘ్రముగ కలుగును? ఉం మనుష్యలోకమున.

అ॥ భగవంతుడు తాను చేయుజగత్సృష్టి మొదలగు కార్యములన్నియు కర్తత్వరహితములుగ నుండునని రెండుళ్లోకములద్వారా తెలుపుచున్నాడు -

13. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కరారమపి మాం విద్ధ్యకరార మవ్యయమ్‌.

టీకః- చాతుర్గ్వర్థ్యమ్‌ = నాలుగువర్ణములున్ను, గుణకర్మవిభాగళః = సత్త్వాది గుణములయొక్కయు, ఆగుణముల వలన చేయబడు కర్మలయొక్కయు, విభజనము ననుసరించి, మయా = నాచేత, నృష్టమ్‌ = సృష్టింపబడినవి, తస్య = దానికి, కర్తారమ్‌ అనీ = కర్షనైనను, మామ్‌ = నన్ను అకర్తారమ్‌ = కర్తకానివానినిగను, అవ్యయమ్‌ = నాశములేనివానినిగను, (లేకనిర్వికారునిగను) విద్ధి = ఎజుంగుము.

తౌ:- బ్రాహ్మణక్షత్రియాదులను నాలుగువర్ణములు సత్త్వాది గుణముల యొక్కయు, గుణములచే చేయబడు కర్మలయొక్కయు విభాగము ననుసరించి నాచే సృజింపబడినవి. వారికి నేను కర్షనైనప్పటికిని (ప్రకృతికి అతీతుడనగుటచే) వాస్తవముగ నన్ను అకర్తగను, నాశరహితునిగను (నిర్వికారునిగను) ఎటుంగుము.

వ్యాఖ్య:- గుణములను బట్టియు, యా గుణములకు సంబంధించిన కర్మలను బట్టియు జనులను నాలుగు వర్ణములుగ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులగ) భగవానుడు విభజించిరి,

గుణము కేవలము సత్త్వగుణము కలవారు సత్త్వగుణము స్వల్పముగను, రజోగుణము అధికముగను గలవారు.

కర్మ శమదమాదులు, తపస్సు.

శౌర్య, ధైర్య, గాంభీర్యాది సంయుక్షయుద్ధ రాజ్య పాలనాదులు.

స్వల్పముగ సత్త్వగుణముగలిగి రజోగుణ కృషి గోరక్షణ, తమోగుణములు గలవారు. వాణిజ్యాదులు.

తమోగుణము అధికముగను, రజోగుణము స్వల్పముగను గలవారు.

పరిచర్యాదులు.

*ఇహైవ నరకవ్యాధేశ్చికిత్సాం కరోతి యః గత్వా నిరౌషధం దేశం వ్యాధిస్థః కిం కరిష్యతి. (గరుడపురాణము)

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 349

ప్రకారముగ జనులను విభజించి భగవానుడు సృష్టిక్రియల నాచరించినప్పటికిని వారు కర్తృత్వరహితులై, నిర్వికారులుగనే చెన్నొందుచున్నారు. కర్తయైనను అకర్తగనే విలసిల్లుచున్నారు. మహనీయులు సంగరహితులై క్రియలాచరించుదురు. కావున కర్తృత్వరాహిత్యముపలన కర్మబంధమొకింతైనను వారికి లేకుండును.

14. మాం కర్మాణి లిమ్పన్తి మే కర్మఫలే స్పృహా ఇతి మాం యో౭_భిజానాతి కర్మభిర్న బధ్యతే.

టీక;- మామ్‌ = నన్ను, కర్మాణి = కర్మములు, నలిన్నున్లి = అంటవు, మే = నాకు, కర్మఫలో = కర్మఫలమునందు, సృహ = కోరిక, న= లేదు, ఇతి= ప్రకారముగ, మామ్‌ = నన్ను, యః = ఎవడు, అభిజానాతి = తెలిసికొనుచున్నాడో, సః = అతడు, కర్మభిః = కర్మములచేత, బధ్యతే = కట్టుపడడు.

తౌ:- నన్ను కర్మలంటవు. నాకు కర్మఫలమునం దపేక్షయు లేదు. ఈప్రకారముగ నన్నుగూర్చి యెవడు తెలిసికొనునో ఆతడు కర్మములచే బంధింపబడడు.

వ్యాఖ్య:- భగవానుడుకర్మఫలమునం దపేక్షలేక కర్మలనాచరించుచున్నారని యెజింగినపుడు జీవుడు తానున్ను ఫలాపేక్షలేక కర్మల నాచరింపదొడగును. తత్ళలితముగ నాతడు కర్మలచే నంటబడక, కర్మబంధవిముక్తుడు కాగల్లును.

అ॥ పూర్వమెందటతో ముముక్షువు లాప్రకారముగ నిష్కామముగ కర్మలాచరించి శ్రేయము నొందిరని వచించుచున్నాడు.

15. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వెరపి ముముక్షుభిః కురు క్షర్మెవ తస్మాత్త్వం పూర్వెః పూర్వతరం కృతమ్‌.

టీక;- ఏవమ్‌ = ఈప్రకారముగ, జ్ఞాత్వా = తెలిసికొని, ప్తూర్వైః = పూర్వులైన, ముముక్షుభిః అవి = ముముక్షువులచేగూడ, కర్మ = కర్మము, కృతమ్‌ = చేయబడినది, తస్మాత్‌ = అందువలన, త్వమ్‌ = నీవు పూర్వైః = పూర్వులచే, కృతమ్‌ = చేయబడిన, పూర్వతరమ = మిగుల పురాతనమైనట్టి, కర్మ ఏవ = (ఈ) కర్తత్వరహిత (నిష్కామ) కర్మమునే, కురు = చేయుము.

తౌః:- (తాను వాస్తవముగ కర్తకాదు. తనకు కర్మఫలమునం ఎపేక్షయుండరాదు - అని) ప్రకారముగ (భగవంతుని కర్మాచరణముద్వారా) తెలిసికొని పూర్వమెందజో ముముక్షువులు నిష్కామముగ కర్మలనాచరించియుండిరి. కావున (ఓ అర్జునా!) నీవున్ను పూర్వులచే అట్టి పురాతనమైన నిష్కామకర్మమునే చేయుము.

వ్యాఖ్య:- నిష్కామకర్మాచరణము, మోక్షమునకు పునాదియని చెప్పవచ్చును. మోక్షసౌధనిర్మాణ మచటినుండియే ప్రారంభమగును. కనుకనే “యెందరో ముముక్షువులు కర్మముయొక్క యా నిష్కామతత్త్వరహస్యమెటింగి తద్రీతి కర్మాచరణముచేసి పూర్వము తరించియుండిరి. కావున నీవున్ను ప్రకారమే ఫలాసక్తి రహితముగ కర్మల జేయుము అని భగవాను డర్జునుని అదేశించుచున్నాడు.

350 గీతామకరందము [4వ అధ్యాయము

“కురుకర్మైవ * - “కర్మమునే చేయుము అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగ పలికినందువలన అనాసక్తకర్మయొక్క ప్రాముఖ్యత వెల్లడియగుచున్నది. మటియు “పూర్వతరమ్‌” అని చెప్పినందువలన, నిష్కామకర్మమార్గము క్రొత్తగా ప్రాదుర్భవించినది కాదనియు, అనాదికాలమునుండియు నెందథీనో తరింపజేయుచున్నదనియు స్పష్టమగుచున్నది. పూర్వీకులకు మేలుచేయగలిగిన ఈభవరో గదివ్యౌషధము ఇప్పటివారికిగూడ తప్పక మేలుచేయగలదు. కాబట్టి దానిపై విశ్వాసముగల్లి ఆచరించి తరించవలసినదిగా భగవాను డుద్చోధించుచున్నాడు.

అ॥ జ్ఞానమునకు అత్యావశ్యకమైనది చిత్తశుద్ధి. అట్టి చిత్తశుద్ది నిష్కామకర్మాచరణముచే సిద్ధించును. కావున అట్టి అనాసక్తకర్మాచరణపద్ధతిని భగవానుడు పదునైదు శ్లోకములద్వారా (18ళ్లో. నుండి 32 శ్లో, వజకు) యిచట విశదీకరించుచున్నాడు. -

16. కిం కర్మ కిమకర్మేతి కవయో౭_ప్యత్ర మోహితాః

తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసేణ_శుభాత్‌.

టీక:- కర్మ =కర్మ కిమ్‌ = ఏది, అకర్మ = అకర్మ, కిమ్‌ = ఏది, ఇతి అ= అను ఈవిషయమున, కవయః అవీ = మేధావులు కూడ, మోపాతా: = మోహమును జెందిర్కి యల్‌ = దేనిని, జ్ఞాత్వా = తెలిసికొని,

అకుభాత్‌ = అశుభమునుండి (సంసారసంబంధమైన అనర్థమునుండి), మోక్ష్యసే = విముక్తుడవుకాగలవో, తత్కర్మ = కర్మను, తే = నీకు, ప్రవక్ష్యామి = లెస్సగ జెప్పెదను.

తా కర్మయెట్టిది, అకర్మయెట్టిది అను ఈవిషయమును పండితులుకూడ సరిగా తెలిసికొనజాలకున్నారు. దేనినెజింగినచో నీవు సంసారబంధమునుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకిపుడు తెలుపుచున్నాను.

వ్యాఖ్య:- కర్మరహస్యము చాల నిగూఢమైనది కనుక గొప్పగొప్ప పండితులు, శాస్త్రజ్జులుకూడ దాని అంతు కనుగొనజాలరైరి. కనుక భగవానుడే కరుణతో నిచట దానిని బోధింపదలచిరి. కర్మతత్త ఏమెటుంగుటవలన కలుగు ఫలితమేమి? మనుజుడు అశుభమగు సంసారదుఃఖమునుండి విడుదలను బొందగలడు. కాబట్టి సాంసారిక క్లేశములనుండి విముక్తులు కాదలంచువారందజున్ను భగవానుడు తెలుపబోవు కర్మపద్ధతిని చక్కగ తెలిసికొనియుండవలెను.

ప్ర:- అశుభమగు సంసారబంధమునుండి విడివడుట కుపాయమేమి?

ఊ:- కర్మయేదియో, అకర్మయేదియో బాగుగా తెలిసికొని తదనురీతి వ్యవహరించుటయే.

అ॥ కర్మ అకర్మ, వికర్మ అను మూడింటిని తెలిసికొనవలయునని బోధించుచున్నాడు- 17. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం వికర్మణః

అకర్మణశ్చ బోద్గవ్యం గహనా కర్మణో గతిః.

టీక:- కర్మణః అవి = శాస్త్రవిహితమగు కర్మయొక్కయు, (స్వరూపము) బోద్దవ్యం =

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 351

తెలిసికొనదగినది, వికర్మణః = శాస్త్రనిషిద్ధమగు కర్మయొక్కయు స్వరూపము, బోద్ధవ్యమ్‌ = తెలిసికొనదగినది, ఆకర్మణః = కర్మరహిత తూష్టీంభావముయొక్కయు స్వరూపము, బోద్ధవ్యమ్‌ = తెలిసికొనదగినది, పా = ఏలయనగా, కర్మణః = కర్మయొక్క, గతిః = తత్త్వము, గహనా = చాల లోతైనది (ఎజుగుటకు కష్టమైనది).

తౌ:- శాస్ర్రములచే విధింపబడిన కర్మలయొక్కయు, నిషేధింపబడిన వికర్మలయొక్కయు, ఏమియుచేయక నూరకుండుట యను అకర్మయొక్కయు స్వరూపమును బాగుగ తెలిసికొనవలసి యున్నది. ఏలయనగా కర్మయొక్క వాస్తవతత్త్వము చాల లోతైనది. (ఎటుంగుట మిగుల కష్టతరము).

వ్యాఖ్య:- కర్మ = చేయదగిన కర్మ (విహితకర్మ).

వికర్మ = చేయరాని కర్మ (నిషిద్ధకర్మ).

అకర్మ = ఊరకయుండు సోమరియొక్కస్థీతి.

కర్మాకర్మవికర్మలకు మజియొక అర్థమునుగూడ చెప్పవచ్చును,

కర్మ = సామాన్యమగు కర్మ,

వికర్మ = కర్మనే కామక్రోధాదిరహితముగ, నిష్కామముగ, దైవార్పణబుద్ధితో నాచరించుట.

అకర్మ = అట్లు కర్మను అనాసక్తముగ నాచరించుటచే చిత్తశుద్ధి వలన కలుగు నైష్కర్మ్యాత్మస్థితి, అనగా కర్మ, వికర్మలయొక్క సంయోగముచే కలుగు కర్తత్వరహిత నిప్రియ అత్మస్థితియే అకర్మ,

కర్మయోగమును. నిర్జుష్టముగ నాచరింపవలసియుండినచో కర్మ, అకర్మ, వికర్మల యొక్క స్వరూపమును బాగుగ తెలిసికొనియుండవలెను. కర్మతత్త్వము చాల నిగూఢమైనది. కనుక భగవానుడే దానిని విడదీసిచెప్పుటకు పూనుకొనిరి.

అ॥ కర్మనెట్లాచరింపవలయునో తెలుపుచున్నాడు - 18. కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణ్‌ కర్మ యః

బుద్ధిమాన్‌ మనుష్యేషు యుక్తః కృత్స్నకర్మకృత్‌.

టీక:- కరణ = కర్మయందు, అకర్మ = అకర్మను, యః = ఎవడు, పక్యేత్‌ = చూచునో, అకర్మణ్‌ చ= అకర్మయందును, కర్మ = కర్మను, యః = ఎవడు, (వశ్యేత్‌= చూచునో) సః = అతడు, మనుప్యేషు

= నునుజులందు, బుద్ధిమాన్‌ = వివేకవంతుడు, నః = అతడు, యుక్తః = యోగముతో గూడినవాడును, కృత్స కర్మక్ళత్‌ = సకలకర్మలనాచరించినవాడును, ( భవతి = అగుచున్నాడు).

తా:- ఎవడు కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను జూచునో ఆతడు మనుజులలో వివేకవంతుడును, యోగయుక్తుడును, సకలకర్మల నాచరించిన వాడును యగుచున్నాడు.

వ్యాఖ్య:- కర్మయందు _ అకర్మను జూచుట:- _ కర్శృత్వములేకుండగను, = ఫలమును

352 గీతామకరందము [4వ అధ్యాయము

వాంభింపకుండగను ఎంతకర్మచేసినప్పటికిని అది బంధమును గలుగజేయజాలదు. అత్తజి కర్మయు చేయనట్లేయగును. అనగా అది అకర్మయే యగును. అద్దము ్రతిబింబక్రియను రోజంతయు సలుపుచున్నను - ప్రతిబింబితవస్తువులు దానియందు అంటకనుండుటవలన అది యేమియు చేయనట్లే నిర్మలముగ, నిష్కియముగ నుండును. మహనీయులగువారు తమ జీవయాత్రకు సంబంధించిన కార్యములను చేసినను వానిని చేయనివారే యగుదురు. అనాసక్తచిత్తముతో కార్యమునాచరించినందువలన కర్మ అకర్మగా, నైష్కర్మ్యముగా- మారి బంధమును కలుగజేయకుండును. దీని నెజుంగుటయే కర్మయం దకర్మను జూచుటయగును. అహంకారముతోను, కర్తృత్వబుద్ధితోను, ఆసక్తి, సంగములతోను చేయబడు కర్మయే బంధమును కలుగజేయునుగాని, అసక్తబుద్ధితో చేయబడు కర్మకాదు. అట్టి అనాసక్తకర్మ అకర్మయేయగును. అనగా _ కర్మరాహిత్యముతో _సమానమగును. ఈప్రకారముగ _ కర్మయందు కర్మరాహిత్యమును, లేక అకర్మను ఎవడు చూడగల్లునో ఆతడు మనుజులలో వివేకవంతుడును, యోగయుక్తుడును నగును. ఆతడు క్రమముగ నిష్కామకర్మము నవలంబించుట ద్వారా చిత్తశుద్ధిని, ఆకత్మస్థితిని బడయుటవలన, జీవితలక్ష్యమును సాధించినవాడగుటచే సకలకర్మలయొక్క ఫలమును పొందినట్లెనది. కనుకనే ఆతడు “బుద్ధిమాన్‌, యుక్తః, కృత్స్నకర్మకృత్‌ * అనిమూడు వోశేషణములచే నిచట స్తుతింపబడియుండెను. అట్లుగాక కర్మ అసలే చెడ్డది, అది పనికిరాదు. రూపముననున్నను అది బంధమే యని తలంచువారు కర్మయందు అకర్మను చూడలేనివారు. వారు బుద్ధిమంతులుకారు. బుద్ధిమాంద్యము కలవారు.

అకర్మయందు కర్మనుజూచుట:- కొందటు వాసనాసహితులై, ప్రకృతిగుణములేవియు తొలగకనే దేహేంద్రియాదులచే కర్మలను పరిత్యజించి ఏపనియుచేయక సోమరులుగనుందురు. అట్టివారి “అకర్మ యందు మహాబంధకరమగు కర్మ యిమిడియున్నది. పైకి కర్మచేయకపోయినను మనస్సుతో వారు కర్మ చేయుచునేయున్నారు. ఇంద్రియములు చలింపకున్నను, మనస్సు, సంకల్పములు, వాసనలు చలించుచునే యున్నవి. శరీరము ఒకచోట నిశ్చలముగ, నిష్క్రియముగనున్నను మనస్సు ముల్లోకములను చుట్టివచ్చు చున్నది. అట్టివారి అకర్మయందు బంధభూతమగు కర్మ అంతర్భ్ఫూతమైయున్నది. ఇట్లెటుంగుటయే అకర్మయందు కర్మను జూచుటయగును. బంధమును, బంధరాహిత్యమును నిర్ణయించునది వాసనలు, అహంభావము, _ మనస్పేకాన్సి ఇంద్రియములు, _ దేహముకావని గుర్తెజుంగవలెను. ఒకవేళ కర్మేంద్రియములను బిగబెట్టి చిత్తముతో అన్నికర్మలు చేయుచున్నచో, అది మిథ్యాచారమేయగునని (క్రిందటి అధ్యాయములో భగవానుడు తెలిపియేయున్నారు. ఈప్రకారముగ అకర్మయందు కర్మను జూచువారు కూడ వివేకవంతులే. కావున వారున్ను (క్రమముగ ఉత్తమాచరణద్వారా ఆత్మస్థితియను జీవితలక్ష్యమును బొందగల్గుటచే సకలకర్మల నాచరించివారే యగుదురని యిచట తెలుపబడినది.

ప్రపంచమున మనుజులలో అనేక గొప్ప విద్వాంసులు, పండితులు, కవులు మొదలైన వారందటున్ను “బుద్ధిమంతులిని చెప్పుటకు వీలుపడదు. ఏలయనగా సత్యము నెటుంగగల్లువాడే బుద్ధిశాలి. పైనదెలిపిన కర్మరహస్యమెటీంగి వర్తించువాడే (తద్ద్వారా జీవిత లక్ష్యమగు అత్మసాక్షాత్కారమును బడయగల్లువాడే) బుద్ధిమంతుడని భగవానుడీళ్లోకమున తెలియచేసెను. కావున అట్టి వివేకమును బడసి ఉత్తమాచరణ గల్గియుండుట శ్రేయస్కరము.

ప్రః- మనుజులలో బుద్ధిమంతుడెవడు?

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 353

ఉ:- కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను జూడగలుగువాడు. ప్రా అట్టివా డేఫలితమును బొందును?

ఉ:-- క్రమముగ ఆత్మసాక్షాత్కారమును బడయుటచే నతడు సమస్తకర్మలను ఆచరించిన ఫలితమును బొందును.

అ॥ అట్టి అసంగకర్మాచరణశీలురనుగూర్చి, వారి మహిమనుగూర్చి ఐదు శ్లోకముల ద్వారా తెలుపుచున్నాడు -

19. యస్య సర్వే సమారమ్ఫాః కామసంకల్పవర్ష్ణితాః జ్ఞానాగ్ని దగ్గకర్మాణం తమాహుః పణ్బ్జితం బుధాః.

టీక:- యస్య = ఎవనియొక్క, నర్వే = సమస్తములైన, నమారమ్భాః = కర్మలు, కామునంకల్పవర్ణితాః = కోరిక, సంకల్పము అనునవి లేకయుండునో, జ్ఞానాగ్సీ దగ్ధకర్మాణమ్‌ = జ్ఞానమనెడి అగ్నిచేత దహింపబడిన కర్మలుగల, తమ్‌ = అతనిని వణ్ణితమ్‌ = పండితునిగ, బుధాః = విజ్ఞులు, అవాుః = చెప్పుదురు.

తౌ:- ఎవనియొక్క సమస్తకర్మలు కోరిక సంకల్పము అనునవి లేకయుండునో, జ్ఞానమను అగ్నిచేత దహింపబడినకర్మలుగల అట్టివానిని పండితుడని విజ్ఞులు పేర్కొందురు.

వ్యాఖ్య:- పండితుడనగా నెవరో శ్లోకమునందు చెప్పబడినది. భగవంతుని దృష్టిలో పాండిత్యమనగా కేవలము ప్రాపంచిక విద్యలయం దారితేరుటకాదు. హృదయశుద్ధిగల్లి, కామ సంకల్పములు లేక, ఆత్మజ్ఞానముతో గూడియుండుటయే పాండిత్యము. ఎవని యొక్క సమస్తకార్యములు కోరికతోగాని, సంకల్పముతోగాని కూడియుండవో, ఎవనియొక్క కర్మలన్నియు జ్ఞానాగ్నిచే దగ్ధములైపోవునో అతడే పండితుడని యిచట చెప్పబడినది.

“ఆరమ్ఫా? (క్రియలు) అని చెప్పక “సమారమ్ఫా? అని చెప్పుటచే మహనీయులు ఉత్తమకార్యములనే చేయుదురని సూచింపబడినది. “కామము” అనగా భోగసంబంధమైన వాంఛ. దారాపుత్రగృహారామక్షే త్రాదులందలి ఆశ యని భావము. ఇచట సంకల్పమనగా అంహంభావముతో గూడిన సంకల్పమనియే అర్థము. ఏలయనిన, సంకల్పవర్దితస్థితియందు కార్యములు (సమారమ్ఫాః) అనునవియే అసలు సంభవింపనేరవు గదా! ఎవరు తాము చేయు సమస్తకార్యములందును కోరిక (ఆశ) లేక యుందురో, మజీయు యా కార్యములనుగూర్చిన సంకల్పము గాని, కర్తృత్వము గాని, అహంభావముగాని కల్గియుండరో, అనగా నిష్కామబుద్ధితో నెవరు కర్మల జేయుదురో వారు చిత్తశుద్ధిని బడసి ఆత్మజ్ఞానమును తప్పక బొందుదురు. అట్టి జ్ఞానాగ్నిచే వారల సమస్తకర్మలున్ను దగ్ధములైపోవును. వారే జీవన్ముక్తులు. వారే పండితులు. కర్మలనునవి పెద్దదూదికుప్పవంటివి కోట్లకొలది జన్మలందు చేయబడిన కర్మయంతయు గూడ ఆత్మజ్ఞానమను ఒక్కనిప్పురవ్వచే భస్మ్రీభూతము గాగలదు, కాబట్టి ఇట్టి జ్ఞానసముత్పాదనకు హేతువైన చిత్తశుద్ధి దానికి కారణభూతమైన నిష్కామకర్మాచరణము ఎంతటి మహత్తుకలవియో యోచించుకొనవచ్చును.

354 గీతామకరందము [4వ అధ్యాయము

“సర్వే సమారమ్మాళి - అని చెప్పినందువలన ఒకటి రెండు కార్యములోకాదు. సమస్తకార్యములున్ను కామసంకల్పవర్షితములై యుండవలెనని స్పష్టమగుచున్నది.

మజీయు, ఇంతకు పూర్వము తెలియకచేయబడిన కర్మమునుగూర్చి మనుజుడు దిగులుపడిన లాభములేదు. అది యెట్టికర్మఅయియున్నప్పటికిని ప్రయత్నపూర్వకముగ నిపుడు నిష్కామకర్మాచరణాదుల ద్వారా జ్ఞానమును సంపాదించుకొనిన చాలును. అది యంతయు నశించిపోగలదను సత్య మీళ్లోకముద్వారా తెలియుచున్నది. మనుజుడు తాను చేయు కర్మలు కామసంకల్పవర్ణితములై యుండునట్లు చూడవలెను. అహంభావ యుక్తమగు సంకల్పమే బంధము. కర్తృత్వమే బంధము. ఆసక్తియే బంధము. సంకల్ప రాహిత్యమే మోక్షము. అట్లు కామసంకల్పరహితముగ కార్యములనొనర్చువాడే పండుతుడు. అని విజ్ఞులు (బుధాః) పలుకుచున్నారు. సామాన్యులుకాదు. అట్టివాడెన్ని కర్మలనుజేసినను శాంతినే పడయును. అట్లుకాక కామసంకల్పములతో గూడియుండు వాడు కార్యమును జేయక ఊరకనున్నప్పటికిని అశాంతినే పొందును. ఇదియే కర్మరహస్యము.

పండితుని లక్షణ మీళ్లోకమున తెలియజేయబడినది. కావున భగవానునిద్వారా ఒసంగబడు “పండిత బిరుదుకై సర్వులును ప్రయత్నశీలురు కావలసియున్నది.

ప్రః- పండితుడనగా ఎవరు?

ఉ:- (1) ఎవనియొక్క సమస్తకార్యములు కామసంకల్పవర్ణితములైయుండునో, (2) ఎవనికర్మలన్నియు జ్ఞానాగ్నిచే దగ్ధములై పోయినవో అతడే పండితుడు.

ప్ర:- కర్మను ఎట్లాచరించవలయును?

ఉ:- కోరికలేకుండగను, దానినిగూర్చినకర్తత్వముతో గూడిన _(అహంభావయుక్తమగు) సంకల్పంలేకుండగను ఆచరించవలయును.

'ప్ర:- కర్మరాశియంతయు దేనిచే నశించును? ఉ:- జ్ఞానాగ్నిచే. 20. త్యక్త్వా కర్మఫలాసజ్ఞం నిత్యతృప్తో నిరాశయః కర్మణ్యభిప్రవృతోఇ_పి నైవ కించిత్కరోతి సః. టీక:- కర్మఫలానబ్లమ్‌ = కర్మఫలమునందాసక్తిని, త్యక్త్వా = విడిచి, నిత్యత్నప్తః = నిరంతరము సంతృప్తి కలవాడును, నిరాశ్రయః = దేనిని ఆశ్రయించనివాడును (అగుచు), కర్మణ్‌ = కర్మమునందు,

అభి(ప్రన్నత్తః అవీ = ప్రవర్తించినవాడైనను, సః = అతడు, కించిత్‌ = కొంచెమైనను (కర్మను), కరోతి పన = చేయుటయే లేదు.

తా;- ఎవడు కర్మఫలములందాసక్తిని విడనాడి నిరంతరము _ సంతృష్తిగలవాడై దేనిని ఆశ్రయించకనుండునో, అట్టివాడు కర్మలందు ప్రవర్తించినను ఒకింతైనను చేయనివాడే యగును.

23

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 355

వ్యాఖ్య:- (1) కర్మఫలమందాసక్తిలేనివాడు (2) నిరంతరము తృషప్తిగలవాడు (3) దృశ్యవస్తువులను ఆశ్రయింపనివాడు (ఆత్మయే ఆశ్రయముగగలవాడు) - ఇట్టి లక్షణములు గల మనుజుడు ఎన్ని కర్మలనాచరించినను ఏమియు నాచరింపనివాడే యగునని యిట చెప్పబడినది. జీవన్ముక్తులగు మహనీయులు ఇట్టి స్థితిని సంపాదించియే లోకసం గ్రహార్థము పెక్కు కార్యముల నాచరించుదురు.

(1) వారు కర్మలనుజేయుదురుగాని కర్మఫలమునందు వారికి ఆసక్తియుండదు. ఫలాభిసంధిరహితముగ ఈశ్వరార్చణబుద్ధితో వారు కార్యముల నాచరించుచుందురు. (2) మతీయు వారు నిత్యతృప్తులై యుందురు. పొందవలసినదియంతయు వారు ఆత్మయందే పొందియున్నారు. కావున మహాసంతృప్తులై యుందురు. *నిత్య' అను పదముచే వారితృప్తి యేదియో ఒక సమయమునకు పరిమితమై యుండునదికాదనియు, సర్వకాలము లందును వారు తృప్పులై యుందురనియు తెలియుచున్నది. (3) ఇక మూడవది నిరాశ్రయత్వము. మహాత్ములు నశ్వరములగు _ దృశ్యపదార్థముల _ నెన్నడును ఆశ్రయించియుండరు. శాశ్వతమగు ఆత్మనే సదా ఆశ్రయించుకొనియుందురు. ప్రకారముగ కర్మఫలాసక్తి రాహిత్యము, నిత్యతృష్తి, నిరాశ్రయత్వమను మూడు సుగుణములుగల మహనీయుడు కర్మలను విరివిగ ఆచరించినను, మాత్రము నాచరించనివాడే యగును. ఇదియే కర్మయందలి అకర్మత్వము. “ప్రవృత్తోజ.పి అని చెప్పక 'అభిప్రవృత్తోజ_పి' అని చెప్పినందువలన జ్ఞాని పెక్కు కార్యములనుగూడ చక్కగ నాచరింపగల్గునని స్పష్టమగుచున్నది.

ప్ర:- అనేక కార్యముల నాచరించినను ఏమియు నాచరించనివా డెవడు?

ఉః- (1) కర్మఫలాసక్తిని వదలినవాడు (2) నిరంతరము తృషప్తిగలవాడు (3) దేనిని ఆశ్రయింపనివాడు (దృక్‌ - వస్తువగు ఆత్మనే ఆశ్రయించువాడు).

అ॥ ఎట్టి సద్గుణములను గలిగియుండినచో కర్మనాచరించినను పాపము సంభవింపకుండునో వచించుచున్నాడు -

21. నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరి[గ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్పోతి కిల్పిషమ్‌.

టీకః- నిరాశ = ఆశలేనివాడును, యతచిత్తాత్మా = నిగ్రహింపబడిన ఇంద్రియమనంబులు కలవాడును, త్యక్షసర్వవరి(గహః = సమస్తవస్తుస్వీకారమును విడిచినవాడును (అయి), శారీరంకేవలం కర్మ = శరీరమాత్రముచేత (దేహధారణా, లోకసంగ్రహాది) కర్మను, కుర్వన్‌ = చేయుచు (ఉండినను), కిల్చిషమ్‌ = పాపమును, ఆప్పోతి = పొందడు.

తా ఆశలేనివాడును, ఇం(ద్రియమనంబులను నిగ్రహాంచినవాడును, ఏవస్తువును పరిగ్రహింపనివాడునగు మనుజుడు శరీరమాత్రముచేత (దేహధారణాది) కర్మను చేసినను పాపము నొందడు.

వ్యాఖ్య:- కర్మను చేయవలసినరీతిగ చేసినచో అది బంధమునుగాని, పాపమునుగాని ఎన్నటికిని కలుగజేయదు. శ్లోకమునందు మూడు మహత్తరసద్గుణములు వచింపబడినవి - (1) ఆశ లేకుండుట (2)

356 గీతామకరందము [4వ అధ్యాయము

ఇంద్రియమనంబులు వశమందుండుట (3) వస్తువును పరిగ్రహింపకుండుట (వస్తువులందు మమత్వము లేకుండుట). మూడు సల్లక్షణములు గలవాడు కేవలము ఉపాధితో ఎంత కర్మచేసినప్పటికిని పాపమునుబొందనేరడు. ఏలయనగా, ఆశలేనివానికి మనస్సు బహిర్ముఖములగు విషయాదులవైపుపోక, అంతర్ముఖమై, _అత్మోన్ముఖమై యుండుటవలన అతడు కర్మలనుజేసినను ఫలాభిలాషారహితుడై యుండును. అట్లే ఇంద్రియమనంబులు స్వాధీనమందుగలవాని చిత్తము కర్మలందు కర్త్పృత్వభావన, సంగము లేకుండును. ఇక మూడవదియగు అపరి[గ్రహము గలవానిమనస్సు దేనియందును మమత్వమును, ఆసక్తిని జెందకయుండును. కాబట్టి సద్గుణములుకలవాని క్రియలన్నియు ఫలాభిలాషారహితములై, అసక్తములైయుండుటవలన కర్తకు పాపమేమియు అంటకుండును. రహస్యమే శ్లోకమునందు తెలుపబడినది.

“త్యక్తసర్వపరిగ్రహఃి జా “సర్వ అని ప్రయోగించుటవలన ఒకటి రెండు వస్తువులనో కాదనియు సమస్తపదార్థములయొక్కయు పరిగ్రహణమును త్యజించిన వాడనియు చెప్పబడినది. ఏలయనగా, వస్తుపరి గ్రహణముచే, వస్తువులతోబాటు ఒరులకర్మనుగూడ తాను స్వీకరింపవలసివచ్చును. కర్మను తన జ్ఞానాగ్నిచే భస్మీభూ తముచేయ గలశక్తి తనకులేనిచో, అయ్యది సాధకునకు అశాంతిని కలుగజేయగలదు. కనుకనే ముముక్షువగు వానికి పరులవస్తువులను గ్రహింపరాదను “అపరి[గ్రహొ నియమము శాస్త్రములందు విధింపబడినది.

ప్రః- కర్మచేసినను పాపము నెవడు పొందకుండును?

ఉ:- (1) ఆశలేనివాడు (2) ఇంద్రియమనంబులను స్వాధీనపరచుకొనినవాడు, (3) ఒరులనుండి వస్తువును పరిగ్రహింపనివాడు.

అ॥ కర్మలను జేసినను ఎవడు బంధింపబడకుండునో తెలుపుచున్నాడు -

22. యదృచ్చాలాభసన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్దౌ కృత్వాపి నిబధ్యతే.

టీకః- యదృచ్భాలాభ సన్తుష్టః = అప్రయత్నముగ దొరకినదానితో సంతోషమును బొందినవాడును, ద్వన్ద్వాతీతః = శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వములను అతిక్రమించినవాడును (లక్ష్యపెట్టనివాడును), విమత్సరః = మాత్సర్యములేనివాడును, నిద్గౌ = (ఫలముయొక్క) ప్రాప్తియందును (లేక కార్యముయొక్క సిద్ధియందును), అనిద్ధౌభ = ఫలముయొక్క అప్రాప్తియందును, సమః = సమబుద్ధి కలవాడును, కృత్వా అవి = కర్మ చేసినను, నిబధ్యతే = బంధింపబడడు.

తౌ:- అప్రయత్నముగ లభించినదానితో సంతుష్టిని బొందువాడును, సుఖదుఃఖాది ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యము లేనివాడును, ఫలముయొక్క 'ప్రాప్తాప్రాప్తములందు సమబుద్ధిగలవాడు (లేక కార్యము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమభావముతో నుండువాడు) నగు మనుజుడు కర్మనుచేసినను బంధింపబడడు.

* యమము = అహింస, సత్యము, అస్తేయము (దొంగిలింపకుండుట), బ్రహ్మచర్యము, అపరిగ్రహము.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 357

వ్యాఖ్య:- క్రిందటి శ్లోకమునందువలెనే కర్మనాచరించుచుగూడ బంధింపబడని వానియొక్క లక్షణములను మజికొన్నిటి నిచట పేర్కొనిరి. దొరకినదానితో సంతుష్టినొందుట, ద్వంద్వములను లక్ష్యపెట్టకుండుట, మాత్సర్యము లేకుండుట, కార్యము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమభావముతో నుండుట యను నీనాలుగు గుణములున్ను, పై శ్లోకమునందుతెలుపబడిన మూడు గుణములున్ను, జ్ఞానగుణములని, జీవన్ముక్తుని లక్షణములని స్పష్టముగ తెలియుచుండుటబట్టి జ్ఞానమందు బాగుగ ఆరితేరినగాని కర్మను శుద్ధముగ బంధరహితముగ ఆచరించుటకు వీలుపడదని తేలుచున్నది. జ్ఞానము, కర్మ అను నీరెండును ఒకదానికి మజియొకటి పరస్పరము సహాయభూతములుగ నున్నవి. నిష్కామకర్మ ద్వారా (చిత్తశుద్ధి, తద్ద్వారా) జ్ఞానము కలుగుచున్నది. జ్ఞానము కలిగిననే నిష్కామకర్మ చక్కగ ఆచరించుటకు వీలుపడుచున్నది. అందువలననే కాబోలు కర్మయోగము (3వ అధ్యాయము) చివర అఖండజ్ఞానమును గూర్చియు “జ్ఞానయోగము” (4వ అధ్యాయము) మధ్య కర్మాచరణమును గూర్చియు బోధింపబడినది. 'పైనదెల్సిన జ్ఞానగుణములు కలవాడు నిరంతరము సంస్థితియందే యుండును. గావున శరీరాదులచే నతడు కర్మలను చేసినప్పటికిని వానియందు తగుల్కొనక అసక్తుడై యుండును. కనుకనే యాత డాకర్మములచే నెన్నటికిని బంధింపబడనేరడని భగవానుడిచట తెలియజేయుచున్నాడు.

ప్ర;- కార్యమును జేసినప్పటికిని వానిచే నెవడు బంధింపబడకుండును?

ఉం (1) అప్రయత్నముగ లభించినదానితో సంతుష్టినొందువాడు (2) సుఖదుఃఖాది ద్వంద్వములను దాటినవాడు (3) మాత్సర్యములేనివాడు (4) కార్యముయొక్క సిద్ధి అసిద్భులందు సమభావము కలవాడు.

అ॥ కర్మలను జేసినప్పటికిని కర్మరాహిత్య మెవనికి సిద్ధించునో వచించుచున్నాడు - 23. గత సజ్ఞస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః. యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే.

టీక:- గతసబ్గస్య = దేనియందును సంగము ( ఆసక్తి) లేనివాడును, ముక్తన్య = (రాగద్వాష కామ క్రోధాదిరూప) సంసారబంధములనుండి విడువబడినవాడును, జ్ఞానావస్థీత చేతనః = ఆత్మజ్ఞానమందు నిలిచియున్న మనస్సుగలవాడును, యజ్ఞాయ = భగవత్రీత్యర్థము, లేక పరప్రాణి యొక్క హితముకొణక్కు లేక ధర్మంకొఅకు, ఆచరతః = కర్మము నాచరించువాడగు మనుజుని యొక్క, కర్మ = కర్మ, నమ(్రమ్‌ = సంపూర్ణముగ, ప్రవిలీయతే = విలీనమై పోవుచున్నది, (బంధాదులను గలిగింపక నశించిపోవుచున్నది)...

తొా;- దేనియందును సంగము (ఆసక్తి) లేనివాడును, రాగద్వేషకామ క్రో ధాది రూపసంసారబంధములనుండి విముక్తుడును, ఆత్మజ్ఞానమందే మనస్సు నిలుకడకలవాడును, భగవ త్రీ త్యర్థము (లేక పరప్రాణిహితార్థము లేక, ధర్మము నిమిత్తము) కర్మ నాచరించువాడునగు మనుజునియొక్క కర్మ యావత్తు విలీనమైపోవుచున్నది. ( జన్మ బంధాదులను గలిగింపక నశించుచున్నది.)

వ్యాఖ్య:- “గతసబ్గస్య” - సంగము (Attachment) తో, ఫలాసక్తితో నాచరింపబడునపుడు కర్మ బంధమును గలిగించును. జన్మకు హేతువగును. సంగరహితముగ ఫలాభిలాషావర్జితముగ నాచరింపబడునపుడు కర్మయే జీవుని విముక్తికి దారితీయును.

358 గీతామకరందము [4వ అధ్యాయము

ప్రపంచములో అనేక కోట్ల జీవరాసులున్నప్పటికిని శ్లోకమునందు చెప్పబడిన నాలుగు ల్లక్షణములుగలవానియొక్క కర్మయే విలయమగునుగాని తదితరులది కాదు. వారే కర్మరాహిత్యమును, ర్మ్యస్థితిని బొందగలరు.

అవి యేవి యనిన - (1) సంగము (విషయాసక్తి, ఫలాసక్తి) లేకుండుట (2) రాగద్వేష్క కామక్రోధాదిరూపములగు సంసారబంధములనుండి విడుదలను బొందుట (3) ఆత్మజ్ఞానమందే యెల్లప్పుడు చిత్తము నిలుకడనుబొందుట (4) భగవ త్రీ త్యర్థము, పరహితార్థము కర్మను జేయుట!

“జ్ఞానావస్థితచేతసఃి జ్ఞానమందు సదా నిలుకడనుబొందిన చిత్తము గలవానియొక్క కర్మలు నశించునని చెప్పబడినది. అట్టివా రెన్ని కర్మల నాచరించినను అవి యన్నియు జ్ఞానసాగరమున విలీనములై పోవునని భావము. కాబట్టి కర్మరాహిత్యమునకు జ్ఞానమత్యావశ్యకమని శ్లోకముద్వారా తేలుచున్నది. అట్టి జ్ఞానములేనివారి చిత్తము దృశ్యమును సత్యమని నమ్మి, దానియందే మునుంగుచు, సంగముకలదై, కర్శృత్వాదులు కలిగియుండును గనుక వారి కర్మ నశింపక బంధమునే కలిగించును.

“యాజ్ఞాయాచరతఖి - “యజ్ఞార్ధాత్కర్మణోఇ-న్యత్ర లోకో జయం కర్మబన్గనణ అనగా యజ్ఞము (దైవము, ధర్మము, పరహితము) కొజకు తప్ప ఇతర విధముగ జేయబడుకర్మబంధమును గలుగజేయునని భగవాను డిదివజకే (3వ అధ్యాయమున) చెప్పియుండిరి.

“ప్రవిలీయతే” - *లీయతే' అనిగాని “విలియతే' అనిగాని చెప్పక *ప్రవిలీయతే అని చెప్పుటవలన వారికర్మము ఒకింతైనను శేషింపక పూర్తిగ నశింపపోవునని యర్థము. మజీయు “సమగ్రం అని ప్రయోగించుటవలన, సంచితాదికర్మ లెవ్వియు మిగలక మొత్తము కర్మయంతయు జ్ఞానకుండములో ఆహుతి అయిపోవునని భావము.

సాధకులకు, భక్తులకు, ముముక్షువులకు ఇట్టి వాక్యములచే పరమధైర్యము చేకూరగలదు. ఏలయనగా ప్రతివారు వాంఛించునది కర్మరాహిత్యము, బంధరాహిత్యమేకదా! అట్టి మహోన్నతస్థితి యేప్రకారము కలుగగలదో శ్లోకమున నిరూపింపబడినది. కర్మ యేమియుచేయక ఊరకకూర్చుండుట కాదు ఇచట నుపదేశింపబడినది. గీతయొక్క ఆశయ మదికాదు. కర్మ యెంతచేసినను అది బంధకరముగ గాకుండు పద్ధతియే ఇట నేర్చబడినది. కావున నాలుగు సల్లక్షణములను ప్రతివారును అనుష్టించి కర్మబంధవిముక్తులు కావలసియున్నారు.

అ॥ పైన దెల్చిన “యజ్ఞము” అను విషయమునుగూర్చి యేడు శ్లోకముల ద్వారా వివరించి చెప్పుచున్నాడు -

నె

24. బ్రహ్మార్పణం బహ్మహవిర్పహ్మాగ్నా బ్రహ్మణా హుతమ్‌ బ్రహ్మైవ తేన గన్తవ్యం బహ్మకర్మసమాధినా.

టీకః- (యజ్ఞమునందు) అర్పణము = (సృక్కు, స్రువము మున్నగు) హోమసాధనములు, (బవ్మా = (బ్రహ్మమే, వావిః = (అన్నము, నేయి మొదలగు) హోమద్రవ్యములు, (బహ్మ = బ్రహ్మమే, (బ్రహ్మాగ్నౌ = (బ్రహ్మమనెడి అగ్నియందు, బ్రహ్మణా = బ్రహ్మస్వరూపుడగు యజమాని చేత, వుతమ్‌ = హోమముచేయబడినది, ((బహ్మాన = (బ్రహ్మమే), (బ్రహ్మకర్మ సమాధినా = సర్వము (బ్రహ్మస్వరూపమే యనెడి ఏకాగ్రభావముతో యజ్ఞాదికర్మలనుజేయు, తేన = అతనిచేత (ఆ (బ్రహ్మనిష్టునిచేత), గన్తవ్యమ్‌ = పాందదగినఫలమున్ను, (బ్రహ్మ ఏవ = బ్రహ్మమేయగును.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 359

తొ; యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది - అన్నియును (బహ్మస్వరూపము లే యనెడి ఏకాగ్ర భావముతో యజ్ఞాది కర్మలను జేయు మనుజుడు (బ్రహ్మమునే పొందగలడు.

వ్యాఖ్య:- ప్రపంచమున సమస్తము (బ్రహ్మస్వరూపమేకాని అన్యముకాదు. విషయమును సదా జ్ఞప్తియందుంచుకొని కర్మచేయవలెను. అనగా చిత్తమందు ట్రహ్మభావన, దైవభావనగలిగి కర్మముచేయవలెను. అత్తజీ కర్మము యజ్ఞముగా మారిపోవును.

సమస్తము బ్రహ్మస్వరూప మెట్లగుననిన, నామరూపాత్మక జగత్తంతయు (బ్రహ్మమందు మిథ్యగ ఆరోపింపబడినది. ఆరోపితవస్తువు అధిష్థానముకంటె 'వేజుగ నుండదు. భ్రాంతిచే రజ్ఞువునందు సర్పము కల్పింపబడినది. కావున కల్పితసర్పము రజ్ఞువుకంటె భిన్నముగా నుండదు. రజ్ఞస్వరూపమే యగును. అట్లే అజ్ఞానముచే ఈజగత్తు (బ్రహ్మమునందు అరోపింపబడినది. ఆరోపితవస్తువు అధిష్థానముకంటె వేజుగ నెన్నడును ఉండనేరదు, కనుక జగత్తున్ను బ్రహ్మస్వరూపమే. జగత్తునందలి ప్రతివస్తువు, ప్రతికార్యము (బహ్మస్వరూపమే. ఈసత్యమే ఈశ్లోకమందు నిరూపింపబడినది.

ఇచట యజ్ఞమందలి హోమమనుశక్రియ దృష్టాంతముగ గ్రైకొనబడినది. పూర్వ కాలము, అందును ముఖ్యముగ ద్వాపరయుగమున యజ్ఞయాగాదులు విరివిగ జరుపబడు చుండటవలన “హోమకార్యము అందథికి తెలిసినవిషయమై యుండుటచే దానినే యిచట భగవానుడు దృష్టాంతరముగ తీసికొనెను. దీనినిబట్టి ఒక్క హోమమును గూర్చి చెప్పబడినప్పటికిని సమస్తకార్యములను ప్రకారమే

ఊహించుకొనవచ్చును. ఇచట హోమముచేయు యజమాని, హవిస్సు, అగ్ని - అన్నియు 'బ్రహ్మస్వరూపములే అయినట్లు, ప్రతికార్యమందును చేయువాడు, చేయబడునది - అనునవి బ్రహ్మస్వరూపములే యగును. వెయ్యేల 'సర్వంఖల్విదంబ్రహ్మ (ఛాందోగ్య. 1 - 141) అని

ఛాందోగ్యోపనిషత్తు తెలిపినవిధమున ఈసమస్తము (బ్రహ్మమే యను భావము గల్లి జగత్తునందు మెలగువాడు ధన్యుడు.

“సమాధినా - అని చెప్పుటచేత ఏకాగ్రచిత్తముతో, అనగా (బ్రహ్మభావము తొలగక యా కర్మ నాచరించవలెనని ఉద్బోధింపబడినది. అత్తి కర్మ కర్మగా నుండక ధ్యానముగను, సమాధిగను మారిపోవును. కర్మ ఏప్రకారము జ్ఞానరూపముగ పరిణతి జెందగలదో ఆపద్ధతి యిచట తెలియజేయ బడినది. (బహ్మభావముతో, ఏకాగ్ర దైవభావనతో కర్మచేసినచో కర్మ తనకర్మత్వమును గోల్పోయి జ్ఞానరూపమును, సమాధిరూపమును బొందగలదు.

ప్రకారముగ సమస్తము (బ్రహ్మమే యను నిశ్చయముగల్లి అట్టి బ్రహ్మభావనతో కర్మముచేయువాడు పొందు ఫలితమేమి? “బ్రహ్మైవ తేన గన్తవ్యమ్‌ అని చెప్పుట వలన అట్టివాడు (బ్రహ్మమునే పొందునని స్పష్టముగా తేల్చివేయబడినది. మనుజుడు నిరంతరము దేనినిగూర్చి చింతించుచుండునో, స్వరూపమే యగును. కార్యములందు నిరంతర (బ్రహ్మభావన గల్గియుండుటచే మనుజుడు (బ్రహ్మమే యగుచున్నాడు. సామాన్యమగు కర్మ జీవున కేప్రకారముగ బ్రహ్మప్రాప్తికి హేతుభూత మగుచున్నదో ఈశ్లోకము స్పష్టీకరించుచున్నది.

కాబట్టి ఏకార్యమైనను చేయుటకు ముందుగా శ్లోకమును పఠించి శ్లోకార్థమును బాగుగ మననము

360 గీతామకరందము [4వ అధ్యాయము

చేసినచో (బ్రహ్మభావనచే సతృలితములు తప్పక కలుగగలవు. కొందజు భోజనముచేయునపు డీ శ్లోకమును పఠించు ఆచారము కలదు.

అ॥ వివిధయజ్ఞములను తెలుపుచున్నాడు -

25. దెవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే

బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్షేనెవోపజుహ్వతి.

టీక:- అవరే = కొందటు, యోగినః = యోగులు. దైవమ్‌ = దేవతలనుద్దేశించినట్టి (దేవతారాధనరూపమైన), యజ్ఞమ్‌ ఏవ = యజ్ఞమునే, వర్యుపాసతే = అనుష్టించుచున్నారు, అపరే = మరికొందజు, యజ్లోనెవ = జీవబ్రహ్మైక్యభావనచేతనే, యజ్ఞమ్‌ = జీవుని, (బహ్మాగ్మా = బ్రహ్మమును అగ్నియందు, ఉవజువ్వాతి = హోమము చేయుచున్నారు.

తౌ:- కొందబు యోగులు దేవతారాధనరూపమైన యజ్ఞమునే అనుష్టించు చున్నారు. మతికొందటు జీవబ్రహ్మైక్యభావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయుచున్నారు. (ఆహుతి నొనర్చుచున్నారు).

వ్యాఖ్య:- యజ్ఞముకొఅకు కర్మనాచరించువానియొక్క కర్మ యావత్తు - విలీనమై పోవునని 23వ శ్లోకమున తెలుపబడినది. ఇకనిపుడు యజ్ఞముయొక్క పెక్కువిధములు సేర్కొనబడుచున్నవి - కొందజు (1) దైవయజ్ఞము నాచరించుదురు. అనగా దేవతారాధన, దేవతోపాసన, దేవతాధ్యానము, దేవతాకెంకర్యము, దేవతా ప్రార్థన ఇత్యాదికార్యముల నొనర్చుచుందురు. వీరు కర్మయోగులు, లేక భక్త్సియోగులు అని చెప్పవచ్చును.

(2) మటికొందటు (బ్రహ్మాత్మెకత్వభావనచే చిత్తమును (జీవుని) బ్రహ్మమును అగ్నియందు అహుతిచేయుచున్నారు. అగ్ని సమస్తమును భక్షించి తనయందు లీన మొనర్చుకొనును. అట్లే బ్రహ్మమందు దృశ్యజాతమంతయు లీనమైపోవును. చిత్తము (జీవుడు) కూడ దృశ్యమునం దంతర్భాగమే కనుక, జీవబ్రహ్మైక్యభావనచే మహనీయు _ లద్దానిని (బ్రహ్మమను _ ఆగ్నియందు ( ఆత్మయందు) హోమముచేసివైచుచున్నారు. అనగా లయింపజేయుచున్నారు:-- ఇదియే బ్రహ్మయజ్ఞము. దీని నాచరించువారు జ్ఞానయోగులనబడుదురు. ఇట్టియజ్ఞముచే వారు ((్రమరకీటన్యాయము ననుసరించి) (బహ్మముతో నైక్యమొందుచున్నారు. వస్తువు అగ్నియందు వేయబడినను అది అగ్నిరూపమునే పొందును. అట్లే బ్రహ్మమునందు ద్రేల్బబడిన మనస్సు (జీవుడు) బ్రహ్మస్వరూపమేయగును. అదియే మోక్షస్థితి. ఆత్మవిచారణ చేతను, విషయవిరక్తిచేతను తనయందలి వాసనలు, దృశ్యసంస్కారములు నిర్మూలనముకాగా, అట్టి శుద్ధసాత్త్వికచిత్తము (బ్రహ్మమునందు విలీనమైపోవును. అదియే (బ్రహ్మయజ్ఞము,

ప్ర: యజ్ఞములలో కొన్నిటిని పేర్కొనుము?

ఉః- (1) దైవయజ్ఞము (దేవతారాధన, దేవతోపాసన ఇత్యాదిరూప యజ్ఞము). (2) బ్రహ్మయజ్జము (విచారణచేతను, పవిత్రతచేతను చిత్తమును (బ్రహ్మమందు (ఆత్మయందు) విలీనమొనర్చుట).

4వ అధ్యాయము] శాన యోగము 361 26. శ్రోత్రాదీనీన్టియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్విషయానన్య ఇన్లియాగ్నిషు జుహ్వతి.

టీక:- అన్యే = కొందజు, ్రోత్రాదీని = శ్రోత్రము (చెవి) మొదలగు, ఇద్రియాణి = ఇంద్రియములను, సంయమాగ్శిషు = నిగ్రహమనెడి అగ్నులందు, జుహ్వతి = హోమము చేయుచున్నారు, అన్యే = మటీకొందటు, శబ్బాదీన్‌ = శబ్దము మొదలైన, విషయాన్‌ = విషయములను, ఇగ్రియాగ్సిషు = ఇంద్రియములను అగ్నులందు, జుహ్వాతి = హోమముచేయుచున్నారు.

తౌ:- కొందటు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనెడి అగ్నులందును, మజికొందజు శబ్దాదివిషయములను ఇంద్రియములనెడి అగ్నులందును హోమము చేయుచున్నారు.

వ్యాఖ్య:- (1) ఇంద్రియని([గ్రహము (2) శబ్బాదివిషయత్యాగము - అను రెండు విధములగు యజ్ఞము లిచట తెలుపబడినవి.

ఇంద్రియని[గ్రహము అధ్యాత్మశాస్త్రమున కీలకస్థానమా క్రమించియున్నది. మోక్షసౌధము నెక్కుట కది నిచ్చెనవంటిది. కాబట్టియే దీనినిగూర్చి 2వ, 3వ అధ్యాయములందు భగవానుడు విపులముగ బోధించియున్నారు. * తస్మాత్త్వమి న్దియాణ్యాదౌ నియమ్య భరతర్షభ * - అని చెప్పుచు ఇం(ద్రియనిగ్రహమునే ప్రథమసాధనగా శ్రీకృష్ణమూర్తి సూచించిరి. ఇంద్రియములను నిరోధింపక పలుకు వేదాంతవచనములు నిర్వీర్యములును, నిస్తేజములు నగును. అది “వాచావేదాంతమే' కాగలదు. ఇంద్రియములను జయించి, ఏమియు పలుకకున్నను అట్టి సంయమశీలునినుండి వేదాంతబోధ దిగంతముల ప్రసరించుచుండును. మహోన్నతమగు అట్టి ఇంద్రియని[గ్రహరూపసాధన ఒకానొక యజ్ఞముగ నిచట వర్ణించబడినది. మోక్షమును పొందవలెననిన మనస్సును నిగ్రహించవలెను. మనస్సును నిగ్రహించవలెననిన ఇంద్రియములను నిరోధించవలెను. కాబట్టి ముముక్షువునకు ఇంద్రియని[గ్రహ మత్యావశ్యకమై యున్నది. పెక్కువ్రతముల ద్వారా, సంయమములద్వారా, నియములద్వారా ఇంద్రియములన్నిటిని స్వాధీనపజిచుకొనవలెను. సంయమమను అగ్నులందు ఇంద్రియములను హోమముచేయుట యనగా నిదియే. అనేక ఇం(ద్రియములుండుటవలన, ఒక్కొక్కదానిని విడివిడిగ బాగుగా సంయమ మొనర్చవలెనని తెలుపుటకై “అగ్నులు” అను బహువచనప్రయోగము చేయబడినది.

ఇక _ రెండవయజ్ఞమగు శబ్బాదివిషయనిరో ధమున్ను దాదాపు పైయజ్ఞమునకు సంబంధించినదే యగును. ఇంద్రియములు శబ్దాదివిషయము లను క్షేతములందు సంచరించుచుండును. యా విషయములందలి దోషములను చక్కగ విచారించి, వానిపై ప్రీతిని విడనాడవలెను. ఇదియే విషయములను హవిస్సును, ఇంద్రియములను అగ్నులందు హోమముచేయుట. విషయములందలి ఇట్టి దోషదృష్టిచే ఇంద్రియములు యా విషయములపైకి పరుగిడకుండును. ఇంద్రియములెపుడు నిశ్చలములుగ నుండునో, అపుడు చిత్తవృత్తులు నిరోధింపబడినవి యగును. ఎపుడు చిత్తవృత్తులు నిరోధింపబడునో అపుడు ద్రష్టయగు జీవుడు స్వస్వరూపమగు ఆత్మయందు నిలుకడను బొందును. అదియే మోక్షము.

'ప్ర:- మజథికొన్ని యజ్ఞముల నుదహరింపుము?

ఉ:- (1) ఇన్దియనిగ్రహము (2) విషయత్యాగము.

362 గీతామకరందము [4వ అధ్యాయము

27. సర్వాణీన్లియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే.

టీకః:- అపరే = మజీకొందరు, సర్వాణి = సమస్తములైన, - ఇంద్రెియకర్మాణ్‌ = ఇంద్రియ వ్యాపారములను, ప్రాణకర్మాణ్‌ = పంచప్రాణములయొక్క వ్యాపారములను, జ్ఞానదీవితే = జ్ఞానముచే ప్రకాశింపజేయ బడిన, ఆత్మసంయమవుయోగాగ్నౌ = మనోనిగ్రహూ యోగమను (సమాధియోగమను) అగ్నియందు, జువ్వాతి = హోమము చేయుచున్నారు.

తౌ:- మజిీకొందజు ఇంద్రియములయొక్క వ్యాపారము లన్నిటిని, ప్రాణములయొక్క వ్యాపారములన్నిటిని జ్ఞానముచే ప్రకాశింపజేయబడిన “మనోనిగ్రహో' యోగమును (సమాధియోగమను) అగ్నియందు హోమము చేయుచున్నారు.

వ్యాఖ్య:- మోక్షప్రాప్తికి మనస్సు అనునది అడ్డుగానున్నది. _అది అనేక జన్మాంతర దుస్సంస్కారములతో గూడి మహాప్రబలమై యుండుచున్నది.. _ దానిని _ నిగ్రహింపవలెననిన, ఇంద్రియనిరోధము, ప్రాణాయామము మున్నగునవి అవసరములై _యున్నని. _ఏలయనిన ఇంద్రియవేగమును, ప్రాణవేగమును అరికట్టనిచో మనస్సును. ఎవరును - జయించలేరు. కాబట్టి మనస్సంయమనమునకు సహాయముగ ఇంద్రియనిగ్రహము, ప్రాణాయామము శీలించవలసియుండును. విషయమే అలంకారికభాషలో ఆత్మసంయమయోగమను అగ్నియందు ఇంద్రియకర్మలు, ప్రాణకర్మలు ట్రేల్బబడుచున్నవి” అని యిచట తెలుపబడినది.

“జ్ఞానదీపి! _ అను పదము బాగుగ గమనింపదగియున్నది. మనస్సంయమనము, మనోని[గ్రహము అత్మజ్ఞానముచే లెస్సగ ప్రకాశింపజేయబడగలదు, వర్ధిల్లగలదు. తత్త్వజ్ఞానము యొక్క సహాయములేనిచో వాసనాక్షయము(మనోనిగ్రహము) సిద్ధించుట కష్టతరము. కనుకనే “జ్ఞానదీపితే చై “జ్ఞానముచే వృద్ధినొందింపబడిన మనోనిగ్రహ' మని యిచట పేర్కొనబడినది. మనస్సంయమనమను అగ్నికి తత్త్వజ్ఞానము (విచారణ) _విసనకజ్జవంటిది. దానిచే సంయమాగ్ని దేదీష్యమానముగ ప్రజ్వలించును. కావున ఆత్మసంయమనమును అనగా మనోనిగ్రహమును శీలింపదలంచువారు తత్త్వ జ్ఞానముయొక్క సహాయము తప్పక గైకొనవలసియుండును. “ఈ జగత్తు ఏమి? విషయములు శాశ్వతములా? శాశ్వతమగు పదార్థమెద్ది?” - అనునట్టి విచారణచే (జ్ఞానముచే) మనస్సు నశ్వరములగు విషయములపై పరుగిడక శాశ్వతమగు ఆత్మవైపునకే పయనించును. మజీయు “జ్ఞానదీపితే” అని చెప్పినందువలన సమాధిస్థితి, మనస్సంయమనస్థితి ఒకానొక శూన్యావస్థ కాదనియు, కేవలము ప్రజ్ఞామయమగు జ్ఞానవంతమగు చిన్మయస్థితయేయనియు స్పష్టమగుచున్నది.

ప్ర:- మనస్సంయమనము దేనిచే వర్ధిల్లును? ఉ:- జ్ఞానముచే, తత్త్వవిచారణచే.

28. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాఇ_పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 363

టీక:- అసరే = కొందటు, (దవృ్యయజ్డాః = ద్రవ్యమును సద్విషయములందు వినియోగించుటయే యజ్ఞముగ గలవారును, (అసరే = కొందరు) తపోయజ్ఞా = తపస్సే యజ్ఞముగ గలవారును, (అవరే = మటిీకొందరు) యోగయజ్ఞాః = ప్రాణాయామాది అష్టాంగయోగమే యజ్ఞముగగలవారును, తథా= ప్రకారముగనే, (అవరే = _ఇంకకొందబు) స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాళ్ళ = వేదాధ్యయనము, వేదార్థజ్ఞానసముపార్టనము యజ్ఞముగ గలవారును (అయియున్నారు). (వారందటును), యతయః = ప్రయత్నశీలురును, సంశిత బ్రతాః = దృఢవ్రతములుగలవారునయి యొప్పుచున్నారు.

తౌ:- కొందజు ద్రవ్యమును దానధర్మాది సద్విషయములందు వినియోగించుటయే యజ్ఞముగ గలవారును, కొందటు తపస్సే యజ్ఞముగ గలవారును, కొందజు (ప్రాణాయామాద్యష్టాంగ) యోగమే యజ్ఞముగ గలవారు నయియున్నారు. వారందటున్ను ప్రయత్నశీలురును, దృఢవ్రతములు కలవారునయి యొప్పుచున్నారు.

వ్యాఖ్య:- మటీకొన్ని విధములగు యజ్ఞముల నిచట చెప్పుచున్నారు -

(1) ర్రవ్యయజ్ఞము:- వారివారి ధనమును, వస్తువులను సత్పాత్రులకు దానముచేయుట, సద్విషయములకు వినియోగపఅచుట. ఇట్టి దానధర్మములుకూడ ఒకనొక యజ్ఞమేయని యిట వచింపబడినది.

(2) తపోయజ్ఞము:- వ్రతోపవాసాదులచే దేహేంద్రియమనంబులను తపింపజేసి క్రమముగ వానిని స్వాధీనపజిచుకొనుట. ఇదియును ఒకవిధమగు యజ్ఞమే.

(3) యోగయజ్ఞము:- యమనియమాదిరూపమగు అప్టాంగయోగము. ఇదియు యజ్ఞమే.

(4) స్వాధ్యాయ జ్ఞానయజ్ఞము:- వేదాధ్యయనము, శాస్త్రపఠనముచేయుట, అందలి అర్థమును బాగుగ తెలిసికొని అనుష్టించుట. ఇదియు ఒకానొక యజ్ఞమే యగును.

ప్రకారముగ జనులు వారివారి సంస్కారము, అభిరుచిననుసరించి భిన్నబిన్నములగు మార్గములను జేబట్టి వివిధములగు యజ్ఞముల నాచరించుచు చిత్తశుద్ధినిబడసి కట్టకడకు పరమాత్మను జేరుచున్నారు. వీరందటున్ను యతులే యగుదురు. అనగా ప్రయత్నశీలురని భావము. మోక్షముకొ అకు, భగవత్సాక్షాత్కారముకొ అకు యత్నించువారందజున్ను యతులే.

“సంశితవ్రతాఖి - అని చెప్పినందువలన వీరందజున్ను దృఢతరములగు ట్రతనిష్టలనుబూని, కఠోరనియమములను శీలించుచు మనస్సునందు జన్మజన్మాంతరములనుండి ఘనీభవించియున్న వాసనలను, దృశ్యసంస్కారములను పారద్రోలుచున్నారని యర్థము. సోమరియగువాడు మోక్షమార్గమున ఒక్క _అడుగైనను ముందుకుపోలేడు. అంగడిలోని వస్తువులకు మూల్యమును చెల్లించువిధమున మోక్షమునకున్ను గొప్పమూల్యమును చెల్లించవలెను. అదియే త్యాగము. అల్పవిషయసుఖత్యాగము. (బ్రహ్మానందమను వస్తువు లభించవలెనన్న ఈమా త్రపు మూల్యమును తప్పక చెల్లించవలెను. ప్రారంభమున కొంత కష్టపడవలెను. శ్రమకు ఓర్వవలెను. యతులై (ప్రయత్నవంతులై), సంశితవ్రతులై ఇక్కార్యమును ఎట్లెనను సాధించివేయవలెను. ఇచట యతులనగా సన్నాసులని అర్థముకాదు, ప్రయత్నశీలురనియే భోవము. మటియు “సంశితవ్రతాః అనిచెప్పినందువలన సామాన్యవ్రతములచే, నియమములచే మాయ

364 గీతామకరందము [4వ అధ్యాయము

లొంగదనియు, _ దృఢద్రతములు, _ కఠిననియమములు ఆచరించిననే అది దారికివచ్చుననియు ముముక్షువులకు హెచ్చరిక చేయబడినది. దృఢముగ నాటుకొనిన మట్టిచెట్టును నజకుటకు రేకుకత్తులుకాక ఉక్కుతో చేయబడిన గండ్రగొడ్డళ్లు కావలెను గదా!

29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేణ_ పానం తథా౭_పరే ప్రాణాపానగతీ రుద్దా ప్రాణాయామపరాయణాః.

టీకః- పాణాయామవరాయణా:ః = ప్రాణాయామతత్పరులగు, అవరే = కొందటు, ప్రాణాపానగతీ

= ప్రాణాపానముల మార్గములను, రుద్దా = నిరోధించి (కుంభకమొనర్చి), అపానే = అపానవాయువునందు, ప్రాణం = ప్రాణవాయువును (పూరకమును), తథా = అటులనే, ప్రాణే = ప్రాణవాయువునందు, అపానమ్‌ = అపానవాయువును (రేచకమును), జుహ్వాతి = హోమముచేయుచున్నారు.

తౌ:- ప్రాణాయామతత్పరులగు కొందజు ప్రాణాపానములయొక్క గతులను (మార్గములను) నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమముచేయుచున్నారు. (పూరక, కుంభక, రేచకముల నొనర్చుచున్నారని భావము).

వ్యాఖ్య;- ప్రాణాయామముకూడ ఒకానొక యజ్ఞమేనని యిచట _ వర్ణించుచున్నారు. ప్రాణాయామము అష్టాంగయోగమునందుగల యమనిమాదులలో నాల్గవది.: శరీరము యొక్క ఆరోగ్యము కాపాడుటకొఅకును, మనస్సుయొక్క చంచలత్వమును _రూపుమాపుటకును ప్రాణాయామము ఆవశ్యకమైనది. ఇది పూరక, కుంభక, రేచకములను మూడువిభాగములతో గూడియున్నది. ్లోకమునందు అపానమందు ప్రాణమును హోమముచేయుట' యనగా పూరకము. ప్రాణమం దపానమును వ్రేల్చ్దుటయనగా రేచకము. ప్రాణాపానములగతులను నిరోధించుటయనగా కుంభకము. పూరక, కుంభక్క రేచకముల నాచరించునపు డేదైన (ప్రణవాది).. దివ్యమంత్రమును మానసికముగ చింతన జేయుదురు, లేక దైవభావనగల్గియుందురు. ప్రాణాయామమువలన మనస్సు బహిర్ముఖత్వమును వీడి నిశ్చలముగ నుండును. ఏలయనిన ప్రాణమునకును, మనస్సునకును, చాల సన్నిహితసంబంధము కలదు. మనోనిరోధముచే ప్రాణనిరోధము, ప్రాణనిరోధముచే _ మనోనిరోధము సంభవించుచుండును. కాబట్టి మనస్సుయొక్క చపలత్వ ముడుగుట్టకె సాధకుడు ప్రారంభములో ఒకింత ప్రాణాయామమును శీలించుట మంచిది. అయితే, దీనిని అనుభవముకలవారియొద్ద చక్కగ నేర్చుకొనవలెను. ఇట్టి ప్రాణాయామము ఒక యజ్ఞముగా నిచట వర్ణించబడినది.

30. అపరే నియతాహారాః ప్రాణాన్‌ ప్రాణేషు జుహ్వతి సర్వేఇ_ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. టీక:- అపరే = మటీకొందటు, నియతావోరాః = ఆహారమునందు కట్టుబాటుగలవారలై, ప్రాణాన్‌

= ప్రాణాదివాయువులను, (లేక ఇంద్రియవ్యాపారములను), (్రాణేషు = ప్రాణాది వాయువులందే (వశీకృతేంద్రియములందు), జువ్వాతి = హోమముచేయుచున్నారు, ఏతే సర్వే౭.వి = వీరందణునుగూడ,

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 365

యజ్ఞవిదః = యజ్ఞమునెజిగినవారును, యజ్ఞక్షవీతకల్మషాః = యజ్ఞముచేత నశింపబడిన పాపము గలవారును (అగుచున్నారు).

ml మటీికొందబు ఆహారవిషయమున కట్టుబాటుగలవారై ప్రాణాదివాయువులను ప్రాణాదివాయువులందే హోమము చేయుచున్నారు. (లేక, ఇంద్రియవ్యాపారములను వశీకృతేంద్రియములందు వ్రేల్చుచున్నారు). వీరందజున్ను యజ్ఞము నెజిగినవారును, యజ్ఞముచే పాపము నశించినవారును అయియున్నారు.

వ్యాఖ్య:- శ్రీకృష్ణపరమాత్మ శ్లోకముతో వివిధయజ్ఞములయొక్క వర్ణనను పూర్తిచేయుచున్నారు. మొత్తము పండ్రెండు రకముల యజ్ఞముల నిచట భగవానుడు పేర్కొనిరి. అందులో చివరిది ఆహారసంయమము. ఆహారనియమముకూడ ఒకానొక యజ్ఞమేయని యిట వచింపబడినది. ఆహారమనునది సామాన్యవిషయమేయని కొందజు తలంచవచ్చును. కాని గీతాచార్యులు దానికి భగవధ్గీతయందు సముచితస్థానమొసంగిగౌరవించిరి. అనేకచోట్ల దానిని గుణించి ప్రస్తావించుచుపోయిరి. దానిని చులకనగ చూడలేదు. మోక్షమునకు వలసిన ప్రధానసాధనలలో దానినిగూడ జేర్నివైచిరి. ఏలయనగా, ఆహారముచేతనే మనస్సు యేర్పడుచున్నది. అహారముయొక్క స్ఫూలాంశముచే శరీరమున్ను, సూక్ష్మాంశముచే మనస్సున్ను గలుగుచున్నవి. ఆహారముయొక్క శుద్ధత్వము వలన మనస్సున్ను శుద్ధపడుచున్నది. ఆహారము సాత్త్వికమైనచో సాత్త్వికాణువులచే నేర్పడు మనస్సున్ను సాత్త్వికముగ నుండును. రజోగుణాత్మకములైన మాంసాద్యాహారములను స్వీకరించు మానవులందును, జంతువులందును క్రూరత్వాదులు ప్రత్యక్షముగ గన్పట్టుచున్నవి గదా.

పెద్ద ఫాక్టరీలో ఒక చిన్నమేకు సరిగా లేనిచో ఫాక్టరీయంతయు నెట్టాగిపోవునో, రైలుపట్టాలపై ఒక చిన్నశీల ఊడినచో రైలుబండికి ఘోరప్రమాద మెట్లు వాటిల్లునో, అట్లే ఆహారనియమమను ఒక చిన్న విషయము సరిగాలేనిచో మోక్ష ప్రయతరూపయం త్రాంగమంతయు స్తబ్ధమైపోగలదు. ఆహారము శుద్ధముగా నుండిన, మనస్సున్ను శుద్ధముగా నుండును. మనస్సు శుద్ధముగానుండిననే మోక్షప్రాప్తి చేకూరును. కాబట్టియే ఆహారసంయమనమును భగవాను డొక యజ్ఞముగా నిచట వర్ణించి చెప్పిరి. ఆహార మేవిధముగ నుండవలెననగా - (1) మితముగను (2) సాత్తికముగను (3) న్యాయార్జితముగను (4) భగవదర్చితముగను (5) నియమితకాలసేవితముగను నుండవలెను. యైదు విధములగు శుద్ధిని ఆహారవిషయమున గమనించుచుండవలెను.

ప్రకారముగ అనేక మోక్ష సాధనములనుగూర్చి యింతదనుక భగవాను డిచట తెలియజేసిరి. సాధన లన్నింటికిని 'యజ్ఞము"లను పవిత్రనామకరణమున్ను గావించిరి. యజ్ఞమనగా ఏమియో అసాధ్యమగు కర్మకాండయని భయపడువారికందటీకిని అభయమొసంగి _వాస్తవయజ్ఞతత్త్వమును బాహాటముగ చాటిరి. మజియు నిచట పశుహింసతో గూడిన యజ్ఞ మొకటియైనను తెలుపబడలేదు. పైసాధనలనుగూర్చి తెలిసినవారందటు, వానిని అనుష్టించువారందజు యజ్ఞవేత్తలే (యజ్ఞవిదః) అని భగవానుడు నుడివిరి. అనగా యజ్ఞముయొక్క తత్త వము (Science) తెలిసినవారని భావము.

యజ్ఞమువలన కలుగు ఫలితమేమి? వానిచే పాపము నశించును (క్షపితకల్మషా:). అనేక జన్మలనుండియు మనస్సునకు పట్టియున్నకుళ్ళు, పాచి తొలగిపోవును. పాపమును తొలగించుకొనుటకు యజ్ఞరూప పుణ్యాచరణమే శరణ్యము. “నా పాప మెట్లుపోవును?” అని చాలమంది ప్రశ్నించుచుందురు.

366 గీతామకరందము [4వ అధ్యాయము

అందులకుపాయమును భగవానుడే యిచట సెలవిచ్చియున్నారు. యజ్ఞములనంబడు పుణ్యకార్యములయొక్క అనుష్థానమే పాపహరణమున క్షేకెక ఉపాయమని యిచట స్పష్టముగ తెలుపబడినది. పాపము నశించనిచో చిత్తము శుద్ధము కాదు. చిత్తము శుద్ధముకానిచో ఆత్మజ్ఞాన ముదయించదు. ఆత్మజ్ఞాన ముదయించనిచో మోక్షరూప పరమశాంతి లభించదు. కాబట్టి మొట్టమొదట పాప మంతరించవలెను. అందులై పైన దెల్పిన పండ్రెండు యజ్ఞములలో అన్నిటినిగాని, లేక కొన్నిటినిగాని, లేక కనీసము ఒక్కదానినైనగాని ముముక్షువు తప్పక ఆచరించవలయును. బంధవిముక్తికి వేజుమార్గములేదు.

ప్ర:- యజ్ఞముల నాచరించుటవలన కలుగు ఫలితమేమి? ఉ:- పాపము నశించును.

'ప్ర:- కావున పాపము నశించుట కుపాయమేమి?

ఉ:- యజ్ఞాచరణము, సత్కర్మానుష్టానము.

అ॥ యజ్ఞముల నాచరించుటవలన కలుగు సతృలితమును, ఆచరింపకపోవుట వలన కలుగు దుష్ఫలితమును వివరించుచున్నాడు-

31. యజ్ఞశిష్ణామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్‌ నాయం లోకోఇ_స్త్యయజస్య కుతోఇ_న్యః కురుసత్తమ.

టీక కురుసత్తమ = కురువంశ గ్రేష్ణుడవగు అర్జునా, యజశిష్టామృతభుజః = (పైనదెల్సిన) యజ్ఞములందు శేషించిన అమృతరూపమైన అన్నమును భుజించువారు, సనాతనమ్‌ = శాశ్వతమైన, (బ్రహ్మ = (బ్రహ్మమును, యాన్తి = పొందుచున్నారు, అయజ్ఞన్య = యజ్ఞమొక దానినైనను చేయనివానికి, అయమ్‌ = లోకః = లోకము, నాన్తి = లేదు (అట్టిచో), అన్యః = పరలోకము, కుతః = ఎక్కడిది?

తౌ:- కురువంశశ్రేష్ణుడవగు అర్జునా! (వైనదెల్పిన) = యజ్ఞములాచరింపగా శేషించిన అమృతరూపమైన అన్నమును భుజించువారు. శాశ్వతపర(బ్రహ్మమును పొందుదురు. అట్టియజ్ఞ మొకదానినైనను చేయనివానికి ఇహలోకసుఖములేదు. అట్టిచో నిక పరలోకసుఖ మెక్కడిది?

వ్యాఖ్య:- ఇంతదనుక అనేక యజ్ఞములను పేర్కొని యిపుడు వాని మాహాత్మ్యమును భగవానుడు వర్ణించుచున్నాడు. పైనదెల్పిన యజ్ఞములలో అన్ని కాని, కొన్ని కాని, లేక ఒకటైనను గాని చేసి లేక, ఏదైన దైవకార్యముగాని, పరమార్థసాధనగాని చేసి పిదప భుజించునట్టి అన్నము అమృతముగా మారిపోవును. కనుకనే దానిని భుజించువారు “యాన్తి బ్రహ్మసనాతనమ్‌' - జననమరణరహితనుగు శాశ్వతపర (బ్రహ్మమును బొందుదురని యిచట వచింపబడినది. క్రిందటిళ్లోకమునందు యజ్ఞక్షపిత కల్మషాః? - యజ్ఞముచే (దైవకార్యముచే) పాపము నశించునని చెప్పబడినది. పాపక్షయముచే చిత్తము నిష్కల్మషమై యలరారును. శుద్ధచిత్తమున అధిష్టానాత్మ దేదీప్యమానముగ ప్రకాశించును. అనగా చిత్తము ఆత్మయందు లయింప ఆత్మమాత్రము శేషించును. అదియే సనాతన బ్రహ్మపదవి. కావుననే యజ్ఞశేషమును భుజించువారు పరబ్రహ్మమును బొందుదురని చెప్పుటకు కారణము. అహా! ఎట్టి అద్భుతఫలితము!

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 367

కార్యముయొక్క మహిమ ఫలితముయొక్క గొప్పతనముపై ఆధారపడి యుండును. ఇవట యజ్ఞమను కార్యముయొక్క ఫలితమో సాక్షాత్‌ (బ్రహ్మమే. కావున యజ్ఞము యొక్క మహత్తు ఎట్టిదో యూహించుకొనవచ్చును. ప్రపంచములో ఎంతయో శ్రమపడినచో ఒకింత ధనమో, క్షేత్రమో, యశస్సో లభించుచున్నది. కాని అవి క్షణికములైనవి. శరీరముతోబాటు నశించునవి. కాని బ్రహ్మమో, సనాతనమైనది. అమరస్వరూపము. ప్రతివానియొక్క గమ్యస్థానము ఎట్టకేలకు అదియే అయియున్నది. అట్టిచో జన్మమందే దానినేల సాధించరాదు? సాధించుట కుపాయమును భగవానుడే యిచట తెలియజేసిరిగదా! యజ్ఞమే దానికి ఉపాయము. అనగా భగవత్కార్యము, అధ్యాత్మసాధన, పరహితవర్తనము, యజ్ఞములయొక్క స్వరూపము, వాని వివిధరీతులన్నియు నిదివజకే చెప్పబడియున్నవి. వాని నాచరించిన చాలును,

అట్లు ఏదేని యజ్ఞము, సత్కార్యము చేయకుండ అన్నము భుజించరాదను శపథము, దృఢవ్రతము గైకొనవలెను. ఏలయనిన, నియమమే క్రమముగ ముక్తికి దారితీయును. అట్లు యజ్ఞము నాచరింపక భుజించువాడు పాపమును భుజించినట్లే యగునని ఇదివజకే భగవానుడు తెలిపియున్నాడు. అట్టివానికి ఇహము లేదు. పరములేదు. చూచితిరా! యజ్ఞము లాచరింపనివానికి, దైవకార్యమును చేయని వానికి కలుగు ఘోరపతనము! భయంకర దుష్ఫలితము! ఉత్తమమగు మానవజన్మను బొందియు దైవవిచారణచేయక నశ్వరములగు దృశ్యవస్తువులనే పట్టి ప్రేలాడువా డెట్టిఅవివేకి? కనుకనే భగవానుడిచట సత్కర్మవిముఖుల కీప్రకారముగ తీవ్రమగు హెచ్చరిక చేయుచున్నారు - “ఓ జీవులారా! ఉత్తమజన్మనుబడసియు, సత్కార్యములనాచరింపక, పరమార్థసాధన నొకింతైనను చేయకనున్నచో మీకు ఇహలోకసుఖము దక్కదు. పరలోక సుఖము అంతకంటెను దక్కదు.” కాబట్టి భగవద్వాక్యములందు విశ్వాసముంచి, ప్రతివారును యజ్ఞములను తప్పక ఆచరించవలయును.

“యజ్ఞశిష్టాశిన - “యజ్ఞమునందు శేషించిన అన్నమును భుజించువార 'ని యిచట చెప్పబడినది గదా! మజీ భగవానుడు తెలిపిన “జ్ఞానము, ఇంద్రియని[గ్రహము, తపస్సు, ప్రాణాయామము” మున్నగు యజ్ఞములందు అన్నమనునదియే సంభవించదు గదా! కనుక పదమున కిట్లు అర్థము చెప్పుకొనవలసివచ్చును - యజ్ఞములాచరించిన పిదప భుజింపబడు ఆహారము అమృతతుల్యమగును గాన, దానిని భుజించువారు పాపరహితులగుదురు. లేక యజ్ఞాచరణమువలన గలుగు అమృతతుల్యమగు మనశ్శాంతిని, సాత్త్వికసుఖమును వీరనుభవించుదురనియు చెప్పవచ్చును.

ప్ర: బ్రహ్మమెట్టిది?

ఉ:- శాశ్వతమైనది, నాశరహితమైనది.

ప్ర:- దాని నెవరు పొందుదురు?

ఉం యజ్ఞములను (సత్కార్యములను) ఆచరించి శేషించిన యన్నమును భుజించువారు. ప్ర;ః- యజ్ఞముల నాచరింపనివారి కెట్టి దుర్గతి కలుగును?

ఉ:-- వారికి ఇహలోకసుఖముగాని పరలోకసుఖముగాని లభించదు.

అ॥ ఇక యజ్ఞసంబంధమగు చర్చను విరమించుచున్నాడు-

368 గీతామకరందము [4వ అధ్యాయము

32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్‌ విద్ధి తాన్‌ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే.

టీక:- ఏవమ్‌ = ప్రకారముగ, బవాువిధాః = అనేక విధములైన, యజ్ఞాః = యజ్ఞములు, (బ్రహ్మణః ముఖో = వేదమందు, వితతాః = సవిస్తరముగ జెప్పబడియున్నవి, తాన్‌ సర్వాన్‌ = వాని నన్నిటిని, కర్మజాన్‌ = కర్మములవలన పుట్టినవానినిగ విద్ధి = ఎజుగుము, ఏవమ్‌ = ఇట్లు, జ్ఞాత్వా = తెలిసికొని, విమోక్ష్యసే = విముక్తుడవు కాగలవు.

తౌ:- ప్రకారముగ అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగ తెలుపబడియున్నవి. అవియన్నియు కర్మలవలన పుట్టినవానినిగ (కర్మమునకు సంబంధించినవేయని) నీవెటుంగుము. ఇట్లెటీంగిన నీవు విముక్తుడవు కాగలవు.

వ్యాఖ్య:- పైన తెలుపబడిన యజ్ఞములే కాక ఇంకను నెన్నియో యజ్ఞములు వేదమునందు విస్తారముగ చెప్పబడినవని యిట పేర్కొనుచున్నారు. కావున కొన్నిటి చేతనే యజ్ఞములవరుస పూర్తి అయినదని యెవరును తలంపరాదు. వేదము పర(బ్రహ్మమునుండి కలిగినదనుటవలన “బ్రహ్మము యొక్క ముఖమ” ని చెప్పబడినది.

“కర్మజానొ' - మనోవాక్కాయములయొక్క, ఇంద్రియాదులయొక్క ప్రయత్నాతిశయమువలననే యజ్ఞములు సంభవించుచున్నవి. ఇవి పురుషప్రయత్నము వలననే సాధింపబడుచున్నవి. కాని సోమరితనముచేగాదు! వట్టిమాటలచే గాదు. అధ్యాత్మవిద్య అనుభవైకవేద్యమగు శాస్త్రమే (Practical Sci- ence) కాని “వాచా” విద్యకాదు. కావున జనులద్దానిని వారి వారి ఇంద్రియ మనోవాక్కాయముల ప్రయత్నాదులచే సాధించవలసియున్నారు. “యజ్ఞముకాని, మోక్షముకాని అకస్మాత్తుగ లభించునవికావు. అవి కర్మవలననే, స్వప్రయత్నము చేతనే సిద్ధించును" అని భగవాను డిచట పేర్కొనుచున్నారు. “ఈ రహస్యమును తెలిసికొనినచో నీవు విముక్తుడవు కాగలవు అని వాక్యముయొక్క భావము - రీతిగా దేహేంద్రియమనంబుల వ్యాపారముచేతనే, (ప్రయత్నముచేతనే) యజ్ఞములు సాధింపబడుననియు, సోమరితనముచే ఊరకనుండినచో కాదనియు నెజింగినవాడు తప్పక ప్రయత్నమున కుపక్రమించి యజ్ఞాదికార్యములను నిర్వర్తించి తద్ద్వారా “సనాతన(బ్రహ్మమును జేరగలడ 'నియే యగును.

ఇచట “కర్మజాన్‌' అను పదముయొక్క ప్రయోగముచే భగవానుడు సోమరితనముపై దెబ్బతీసెను. “వాచా” వేదాంతమును ఖండించెను.

“విమోక్ష్యసే” - “మోక్ష్యసే అని చెప్పక “విమోక్ష్యసే అని చెప్పుటవలన యజ్ఞాచరణముచే లెస్సగ విముక్తుడుకాగలడని తెలిపినట్లెనది.

ప్రః- యజ్ఞములన్నియు నెచట తెలుపబడినవి? 'ఉ:- వేదమునందు విస్తారముగ వర్ణింపబడియున్నవి.

ప్ర:- అవి దేనిచే సిద్ధించును?

4వ అధ్యాయము] జ్ఞాన యోగము

369

ఉ:- దేహేంద్రియమనంబుల వ్యాపారముచే. అంతియేకాని సోమరితనముచేగాదు. ప్ర:- సత్య మెజుగుటవలన కలుగు ఫలితమేమి? ఉ:- మనుజుడు ప్రయత్నపరుడై, యజ్ఞములను సాధించి లెస్సగ విముక్తుడగును.

ప్ర;- ఇంతదనుక పేర్కొనబడిన యజ్ఞములన్నియును జేరి మొత్తమెన్ని? అవి యేని?

ఉ:-- మొత్తము పండ్రెండు - అవి క్రమముగ -

(1) దైవయజ్ఞము

ళ్లో-25 (2 (బ్రహ్మయజ్జ్ఞము

(3) ఇంద్రియ సంయమయజ్ఞము 2 (| శబ్బాది విషయనిరో ధయజ్ఞము ళ్లో-27 (5) మనోనిగ్రహ యజ్ఞము

(6) ద్రవ్యయజ్ఞము

(7) తపోయజ్ఞము ళ్ల-28 (9 యోగయజ్ఞము

(9) స్వాధ్యాయయజ్ఞము

(10) జ్ఞానయజ్ఞము శ్లో-29 (11) ప్రాణాయామయజ్ఞము. ళ్ల-30 (12) ఆహారనియమయజ్ఞము.

యజ్ఞములన్నియు జీవుని పాపమును బోగొట్టి, చిత్తశుద్ధిని గలిగించి, తద్ద్వారా మోక్షమును బొందింపజేయును. కావున ముముక్షువు లెల్లరు వీనిని చక్కగ నాచరింపవలయునని భగవానుడు

తెలియజేయుచున్నాడు. అ॥ యజ్ఞములన్నిటిలోను ఏది సర్వశ్రేష్టమైనదో వచించుచున్నాడు-

33. శ్రేయాన్‌ ద్రవ్యమయాద్యజ్ఞాజ్ఞా నయజ్ఞః పరన్తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే.

టీక:- పరప = అర్జునా!, (ద్రవ్యయయాల్‌ = (ద్రవ్యమువలన సాధ్యమైన, యజ్ఞాత్‌

యజ్ఞముకంటె, జ్ఞానయజైః = జ్ఞానయజ్ఞము, శ్రేయాన్‌ = గొప్పది, పార్ధ = అర్జునా!, సర్వంకర్మ =

370 గీతామకరందము [4వ అధ్యాయము

కర్మమంతయును, అఖిలమ్‌ (సత్‌) = నాశముకానిదగుచు, (ఫలముతో గూడ) జ్ఞానే = జ్ఞానమునందు, వరినమాప్పుతే = పరిసామాప్తినొందుచున్నది. (పర్యవసించుచున్నది లేక అంతర్భూతమగుచున్నది).

తౌ:- అర్జునా! ద్రవ్యమువలన సాధింపబడు యజ్ఞముకంటె జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఏలయనిన, సమస్త కర్మయున్ను నాశముకానిదగుచు (ఫలసహితముగ) జ్ఞానమునందే పర్యవసించుచున్నది (అంతర్భూతమగుచున్నది).

వ్యాఖ్య:- జ్ఞానయజ్ఞమనగా తత్త్వవిచారణ, తత్త్వంపదార్థశోధన, ఆత్మానాత్మవివేకము, దృగ్భృశ్యవివేచనము, శ్రవణమనననిదిధ్యాసనములు, ఇంద్రియమనోని గ్రహము, వాసనాక్షయము మున్నగునవి. ద్రవ్యయజ్ఞములనగా ధన్క ధాన్య వస్తువులచే సాధింపబడు సత్కార్యములు మున్నగునవి. ద్రవ్యయజ్ఞములకంటె జ్ఞానయజ్ఞము ఉత్కృష్టమైనదని యిచట చెప్పబడెను. ఏలయనగా, ప్రతిజీవియొక్క చరమలక్ష్యము మజచిపోయిన తన నిజస్వరూపమును తిరిగి జ్ఞాపకము పెట్టుకొనుటయేయగును. అనగా ఆత్మజ్ఞానమని యర్థము. తక్కిన అన్ని సాధనలున్ను, అన్ని పరమార్థ కర్మలున్ను తుట్టతుదకు జ్ఞానరూప లక్ష్యమునే పొందింపజేయును. వాని ఫలితములున్ను జ్ఞానముయొక్క మహాఫలమగు (బ్రహ్మానందమునందే యిమిడియుండును. కాబట్టియే జ్ఞానయజ్ఞము సమస్త ఇతర యజ్ఞములకంటెను, ఇతర (పరమార్థ) కర్మలకంటెను సర్వశ్రేష్టమని వచింపబడినది.

జ్ఞానమే అన్ని కర్మలయొక్క పరాకాష. అయితే తక్కిన సాధనలు, కర్మాదులు వ్యర్థములు కానేరవు. అవి జీవునకు చిత్తశుద్ధిని గలిగించి జ్ఞాన ప్రాప్తికి దోహదమును కలుగజేయును. కర్మమంతయు జీవుని జ్ఞానముయొద్దకుచేర్చి తదుపరి “నది సముద్రము నందు లయించినట్లు జ్ఞానమందు లయించిపోవును. “జ్ఞానే పరిసమాప్యతే” అను వాక్యము యొక్క అర్థ మిదియే, దీనినిబట్టి సముద్రమునందు నది అంతర్భూతమై యున్నట్లు జ్ఞానమందు సమస్తకర్మలు, కర్మఫలములు అంతర్భూతములైయే యుండునే కాని నశింపవనిభావము. చేసిన సత్కర్మ యెన్నటికి వ్యర్థముకాదు. కనుకనే కర్మ “అఖిలం (సత్‌) = “నాశనముకానిదగుచు, న్యోషముగ, ఫలసహితముగ జ్ఞానమందు పర్యవసించుచున్నదని యిట చెప్పబడినది.

కాబట్టి ప్రతివారున్ను జ్ఞానమును పొందుటయను లక్ష్యముగల్గి, శ్రాప్లికై కర్మాదులను సహాయముగ గైకొనవలెను. సౌధనయైనను, మార్గమైనను, సంప్రదాయమైనను కడకు జ్ఞానోదయమే చరమస్థితిగా గల్గియుండును. ఏదియో యొక సమయమున ప్రతివారును అట్టి జ్ఞానమును పొందియే మోక్షమొందవలసియుందురు. (జ్ఞానాదేవతుుకైవల్యమ్‌). శ్లోకమందు కర్మ సాధనగను, జ్ఞానము సాధ్యముగను నిరూపింపబడినది. కర్మ జీవుని జ్ఞానసొధమువఅకు తీసికొనిపోయి అచట వదలును. అటుపిమ్మట జ్ఞానమే వానిని సౌధాగ్రమగు మోక్షస్థానమునకు చేర్చును. దీనినిబట్టి జ్ఞానమనునది అకస్మాత్తుగ లభించు వస్తువు కాదనియు, పరమార్ధకర్మలుచేయుచు రాగా రాగా చిత్తశుద్ధి జనింప, తదుపరి ఉదయించు స్థితి యనియు తేలుచున్నది. కావున సత్కర్మలు జీవునకు మోక్ష ప్రాప్తికై అత్యవసరములని స్పష్టమగుచున్నది. నిరంతర దైవచింతనచే, సత్కార్యాచరణముచే, భగవదారాధనచే భగవానుడు కరుణించి జీవునకు జ్ఞానమును (బుద్ధియోగమును) ప్రసాదించును. దానిచే నతడు ముక్తినొందును. కాబట్టి జ్ఞానమును లక్ష్యముగపెట్టుకొని, తల్లక్ష్యసాధనకై కర్మనాచరించుచు రావలెను. ఒకవేళ సాధ్యవస్తువును పొందినను లోకసంగ్రహార్థము పెక్కురు మహాత్ములు కర్మను వదలక అచరించుచునేయుందురు. శ్లోకమునందు జ్ఞానముయొక్క శ్రేష్టత్వము, కర్మయొక్క ఆవశ్యకత - రెండును ప్రతిపాదింపబడినవి.

24

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 371

“సర్వమ్‌” అను పదము సమస్తకర్మలను, సాధనలను, పైనదెల్సిన యజ్ఞము లన్నిటిని సూచించును. ప్ర:- యజ్ఞములన్నిటిలో యజ్ఞము శ్రేష్టమైనది?

ఉ:- జ్ఞానయజ్ఞము.

ప్ర:- అయితే తక్కిన యజ్ఞములు, కర్మలు వ్యర్థములగునా?

ఉ:- కావు, అవి జ్ఞానోత్సాదనమును జేసి తుదకు జ్ఞానమందు లయించిపోవును. కర్మము జీవుని జ్ఞానమువఅకు గొనిపోయి అట వదలును. అటనుండి జ్ఞానము మోక్షము వణకు జీవుని తీసికొనిపోయి అట చేర్నివైచును.

అ॥ అట్టి జ్ఞానమును పొందుటకు ఉపాయమును తెలియ జేయుచున్నాడు - 34. తద్విద్ధిప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః.

టీక:- తత్‌ జ్ఞానం = అజ్ఞానమును, గ్రణీపాలేన = సాష్టాంగనమస్కారముచేతను, వరివ్రక్సేన = సమయముచూచి వినయముతో ప్రశ్నించుటచేతనూ, 'సేవయా = సేవచేతను, విద్ధి = తెలిసికొనుము, తల్త్వదర్శినః = తత్త్వవేత్తలగు ((బ్రహ్మానుభవముగల), జ్ఞానినః = జ్ఞానులు, తే = నీకు ఉసదేక్ష్యన్లి = ఉపదేశింపగలరు.

తా:- (ఓ అర్జునా!) అట్టి జ్ఞానమును నీవు తత్త్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారముచేసియు, సమయముచూచి వినయముగ ప్రశ్నించియు, సేవచేసియు, వారి వలననెజుంగుము. వారు తప్పక నీకుపదేశింపగలరు.

వ్యాఖ్య:- జ్ఞానము శ్రేష్టమైనదని క్రిందటి శ్లోకమున వచింపబడెను. అయితే జ్ఞానమెట్లు లభించును? ఎవరివలన లభించును? అను ప్రశ్నల కిచట సమాధాన మొసంగబడినది.

“తత్త్వదర్శినఃి - తత్త్వవేత్తలగు జ్ఞానపుంగవులవలన జ్ఞానము లభించగలదు. “తత్త్వ్యదర్శినఃో అని చెప్పుటవలన “వాచా” వేదాంతులవలన కాదనియు, పరమాత్మతత్త్వమును ప్రత్యక్షముగ గాంచినవారివలన (అనుభూతమొనర్చుకొనినవారివలన) అనియు స్పష్టమగుచున్నది. వేదాంతమును బోధించువారు శాస్త్రపాండిత్యముకలవారు ప్రపంచములో చాలమంది యుండవచ్చును గాని, ప్రత్యక్షముగ అనుభవించి బోధించువారు చాలఅరుదు. అట్టి అనుభవజ్ఞులవాక్యమునకే లోకమున విలువయుండును. “దర్శిని అనుపదముచే పరమాత్మ గ్రంథస్థమగు ఒకానొకపదార్థము కాదనియు, 'ప్రతివారును తగుప్రయత్నమాచరించిన, కళ్ళార వారిని గాంచవచ్చుననియు (అనుభూతమొనర్చుకొనవచ్చుననియు) విదితమగుచున్నది. అయితే గోవు, గోడ మున్నగు వస్తువులవలె తనకంటె వేలుగా నతడు కన్చించరు. తన స్వరూపముగనే అనుభూతుడగుదురు. ('తత్త్వదర్శిన అను పదముచే ముముక్షువులకు ఆత్మతత్త్వమునుగూర్చి పరమధైెర్యము లభించుచున్నది. ఎందుకనగా ఆత్మనున్ను ప్రయత్నముచే ప్రతివారున్ను దర్శించవచ్చునని పదముచే వ్యక్తమగుచున్నది.) తత్త్వదర్శులగు అట్టి మహాత్ములు

372 గీతామకరందము [4వ అధ్యాయము

జనులకు జ్ఞానమును బోధించెదరు. అయితే అందజిీకిని బోధించెదరా? కాదు. అందులకు మూడుషరతులు విధింపబడినవి. వానిని పాలించినవారికి మాత్రమే వారుబోధించెదరు.

అవి యేవి యనిన -

(1) “ప్రణిపాతేనొ - (పాతము = పడుట, నిపాతము = బాగుగా పడుట, ప్రణిపాతము = పూర్తిగా లెస్సగాపడుట) సాధకుడు మహాత్ముడగు జ్ఞానికి భక్తిపూర్వకముగ, వినయవిధేయతలతో సాష్టాంగనమస్కార

ఎందుకనగా దేహాభిమానమను విశాచము లోన నున్నంతవణకు గురుబోధహృదయమున ప్రవేశింపదు (మురికిగుడ్డకు రంగు అంటనట్టు). సాష్టాంగనమస్కారముచే అభిమానము. చచ్చిపోవును. సాధకున కీ నిరభిమానత్వము ప్రప్రథమ ఆవశ్యకతయై యున్నది. నిలబడి దండముపెట్టిన చాలదా? వంగి దండము పెట్టిన చాలదా? యనిన చాలదు. అష్టాంగములు నేలను స్పృషించునట్లు సాష్టాంగవందనమాచరించవలసినదే

అధికారములు చెల్లవు, పరమార్థదృష్టిలో వ్యావహారికపదవులకు విలువలేదు. భౌతికబలసంపత్తులు ఆధ్యాత్మిక సంపదకడ తలవంచవలసినదే. (బ్రహ్మబలమే నిజమైనబలము. విశ్వామిత్రుడు గొప్ప భౌతికబలము కలిగియున్నను, “ధిక్‌ బలం, క్షత్రియబలం (ట్రహ్మతేజోబలం బలమ్‌” అని వచించి వసిష్టమహర్షియొద్ధ

కనుకనే పూర్వకాలమున, ఇక్కాలమునగూడ రాజాధిరాజులు, శ్రీమంతులు ఎక్కడనో ఏకాంతమున కౌపీనధారియున్న _ జ్ఞానియొద్దకు చేతులుకట్టుకొనివచ్చి, సాష్టాంగవందనముచేసీ, ఉపదేశమును శికొనుచున్నారు. ఒకవేళ గర్వముతో పెద్దలయొద్దకేగినచో ఠీవి అభిమానమును చూచి వారుపదేశింపనిచో

(2) “పరిహానో - పైన దెల్పినవిధముగ పెద్దలకు సాష్టాంగవందన మాచరించి పిమ్మట తన సందేహములనుగూర్చి వినయముతో, సమయాసమయములు చూచి 'ప్రలించవలెను. కనుకనే ' ప్రశ్న అని చెప్పక “పరిప్రశ్న అని చెప్పబడినది, సౌమ్య వాక్యములతో, భక్తిభావముతో ప్రశ్నించవలెననిభావము,

(3) “సేవయా” - ఇకమూడది సేవ. పెద్దలకు సేవచేసి వారి యను గ్రహమును సంపాదించవలెను, గురుసేవచే గురువుల హృదయమును చూరగొనవచ్చును. వారి యనుగ్రహము, కటాక్షము, లేనిచో పరమార్థరంగమున సాధకుడు ఒక్క అడ్నూనను మందునకు వేయజాలడు. కనుకనే గురుసేవ, దైవసేవ అత్యవసరములని శాస్త్రములందు వచింపబడినది. మాయను దాటవలెననిన మాయను జయించిన మహనీయుల అండదండ లుండవలెను. గురుసేవయందు గొప్పప్రయోజనము కలదు.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 373

ప్రకారముగ (1) సాష్టాంగవందనము (2) పరిప్రశ్న (3) సేవ - అను మూడింటిని ఆచరణయందుంచినచో మహనీయులు తమ కృపాదృష్టిని ముముక్షువుపై ప్రసరింపజేసి “తప్పక ఉపదేశింపగలరు” (ఉపదేక్ష్యన్తి) అని అసందిగ్ధముగ నిచట చెప్పివేయ బడెను. శిష్యుడు తాను చేయవలసిన పద్ధతిలో చేసినచో, గురువు తాను చెప్పవలసిన పద్ధతిలో చెప్పును. శిష్యుడు తన కర్తవ్యమును విస్మరించినచో గురువునుండి బోధ నెన్నటికిని ఆశింపలేడు.

అయితే, గురువులు దేని నుపదేశించెదరు! జ్ఞానమును. అజ్ఞానములో పడి యున్నవారికి ఇంకేమికావలయును? ఏది సత్యమో, నిత్యమో దానినే వారు యుపదేశించెదరు. ఇక శిష్యుడు ధన్యుడైపోవును.

అధ్యాత్మక్షేత్రమున పురోగమించుటకు గురువుయొక్క సహాయము తప్పక అవసరమని శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. మజియు గురుసన్నిధియందు, గురుకులవాసమునందు శిష్యు డెట్లు ప్రవరించవలయునో, పద్ధతియు నిచట చక్కగ తెలుపబడినది. కావున ముముక్షువులు వీనిని బాగుగ గమనించవలెను.

శ్రీకృష్ణపరమాత్మ తానర్జునునకు ఆత్మజ్ఞాన ముపదేశించినను మరల తత్త్వజ్ఞులయొద్దకేగి దానిని తెలిసికొనవలసినదిగ యేల బోధించిరి? (1) తానుపదేశించిన జ్ఞానము బాగుగ దృఢపడుటకొ జక మహనీయుల యొద్దకు కూడ యేగి తెలిసికొనవలసినదిగా చెప్పియుండవచ్చును. (2) లేక గురుశిష్య సంబంధమైన సర్వసామాన్యపద్ధతిని దీని ద్వారా లోకమునకు సూచించియుండవచ్చును.

'ప్ర:- జ్ఞానము ఎవరివలన లభించును? ఉ:- అనుభవజ్ఞులగు తత్త ్వవేత్తలవలన. ప్రః- అట్టి సదుర్గువులయొద్ద ముముక్షు వెట్లు ప్రవర్తించవలెను?

ఉ:- (1) సాష్టాంగవందన మాచరించవలెను. (2) వినయముతో సమయాసమయములుచూచి 'ప్రల్నించవలెను. (3) సేవ యొనర్చవలెను.

అ॥ అట్టి జ్ఞానమును పొందుటవలన కలుగు ఫలితమును తెలియజేయుచున్నారు - 35. యజ్ఞాత్వా పునర్మోహమేవం యాస్యసి పాణ్ణవ

యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి.

టీక:- పాజ్ఞవ= అర్జునా, యత్‌= దేనిని (ఏజ్ఞానమును), జ్ఞాత్వా = తెలిసికొని, వునః= మరల, ఏవమ్‌ =, ఇట్టి, మోహమ్‌ = మోహమును (అజ్ఞానమును), యాస్యని = పొందవో, యేన = దేనిచేత,

భూతాని అశేషేణ = సమస్తములైన ప్రాణులను, ఆత్మని = నీయందును, అథో = ఆలాగుననే, మయి = నాయందును, (దక్ష్యని = చూడగలవో, (తత్‌ = అట్టి, జ్ఞానం = జ్ఞానమును, విద్ధి = తెలిసికొనుము).

తౌ: అర్జునా! దేనిని తెలిసికొనినచో మరల నిట్టిమోహమును నీవు పొందకుందువో మజియు దేనిచే సమస్తప్రాణులను నీయందును, నాయందునుగూడ చూడగలవో (అట్టి జ్ఞానమును తత్త్వవేత్తలవలన తెలిసికొనుము).

374 గీతామకరందము [4వ అధ్యాయము

వ్యాఖ్య:- జ్ఞానమును పొందుటవలన రెండు ఫలితములు కలుగగలవు. (1) అంత వకు నున్నట్టి మోహము (అజ్ఞానము) నశించును (2) సమస్త ప్రాణికోట్లను తనయందును, భగవంతునియందును వీక్షింపగల్గును. రెండిటినిగూర్చి ఒకింత విచారించెదము.

(1) కండ్లుఉన్నదానికి గుఖుతు గోతిలోపడకుండుటయే. ఎవరైన గోతిలోపడినచో నాతనికి కండ్లులేవని యర్థము. అట్లే జ్ఞానము పొందినదానికి గుజుతు మరల పూర్వమువలె మోహమును పొందకుండుటయే. దృక్స్వరూపమగు ఆత్మయొకటియే సత్యము, తక్కిన దృశ్యపదార్థములన్నియు అసత్యములు అనునదియే జ్ఞానము. అట్టి జ్ఞానముకలవాడిక మరల దృశ్యవస్తువులనుగూర్చి ఏల శోకమును, మోహమును బొందును?* మామిడికాయ పచ్చిగనున్నపుడు వగరుగ, పులుపుగ నుండును. పక్వమైనపిదప ఎచట రుచిచూచినను తీపిగనే యుండును. పూర్వపు పులుపుదనము, వగరుదనము అత్తజీఏమా త్రమునుండవు. ఒకవేళ నున్నచో అది యింకను పక్వముకాలేదని యర్థము. అట్లే యింతదనుక అర్జునుడు బంధ్వాదులనుజూచి “వీరు నావారు' వీరి నెట్లు వధింపగలను? అని 'మోహమందు పడియుండెను. జ్ఞాన ప్రాప్త్యనంతర మా ప్రకారముగ మోహమును జెందనేరదని భగవాను డర్జునునకు బోధించిరి.

ఇపుడు జనులలో కొందు తమకు జ్ఞానము కలిగియున్నదని వచించినను, వారి ఆచరణలో, అనుష్టానములో విషయ ప్రవృత్తి, మజికొన్నిలోపములు వ్యక్షమగుచున్నవి. అట్టివారింకను జ్ఞానమును పాందలేదనియే భగవద్వాక్యములవలన స్పష్టమగుచున్నది. మరల మోహమును, విషయవాంఛను పాందకుండుటయే జ్ఞానమునకు చిహ్నము. భగవానుని వాక్యములచే ఆచరణశూన్యులగు శుష్కవేదాంతులకు పెద్దదెబ్బతగిలినది. కావున, వారు తమ యాచరణను శుద్ధపజచుకొని లోకమునకు ఆదర్శవంతులు కావలయును. భగవర్గీత అనుష్టానము నెక్కువగ ప్రోత్సహించుచున్నదని వాక్యములచే బాగుగ తెలియుచున్నది. కాబట్టి సాధకుడు ఒక్కొక్క సాధనను అనుష్టించుచు, అది పూర్తిగ సిద్దించెనా, లేదా యని తనజీవితమున పరీక్షించుకొనుచుండవలెను. కామము పూర్తిగ తొలగినద్యా (క్రోధము అంతరించినదా, అసూయ తగ్గినదా, దైవగుణము అబ్బినదా యని తరచు పరీక్షించుకొనవలెను. హృదయశో ధనము కావింపవలెను. లోనదాగియున్న వాసనలను వెతకి పారద్రోలవలెను. ఆత్మజ్ఞానము లెస్సగ గలిగినచో నిట్టి కామాదిదుర్గుణము లుండుట కవకాశమే లేదు.

(2) ఇక రెండవ విషయము - జ్ఞానమును బొందినవారు సమస్త ప్రాణికోట్లను తన యందును, పరమాత్మయందును చూడగలరనుట. (బ్రహ్మాండమంతయు, చరాచరజగత్తంతయు ఆత్మయందు కల్పింపబడినది. సర్పము ఎచటనున్నది? రజ్జువునందే. స్వప్న మెచటగలదు? మేలుకొనినవానియందే. “ఆరోపితవస్తువు అధిష్ణానమందే యుండును” గాని అన్యత్రకాదు. కావున అధిష్టానమగు ఆత్మస్వరూపము ననుభూతమొనర్చుకొనిన జ్ఞానికి ఆరోపితమగు సమస్తజగత్తు తనయందే గోచరించును. లేక, మజీయొకవిధముగ నాలోచించిచూచిన, సమస్త బ్రహ్మాండము మనస్సుయొక్క కల్పనయే అయియున్నది. మనస్ఫో, ఆత్మయందు (మిథ్యారూపమున) స్థితగల్గియున్నది. కాబట్టి సమస్తజగత్తును, ప్రాణికోట్లను ఆత్మయందు (తనయందు) జ్ఞాని కాంచగలడు. ఈసత్యమే యిచట తెలుపబడినది.

“అథోమయి అనుటవలన తనయందువలై, భగవంతునియందును ప్రకారముగ సమస్తభూతములను గాంచగలడని యర్థము. అయితే భగవంతుడు తనకంటె వేజిని కాదు. జ్ఞాన మెపుడుకలుగునో అపుడు తానే భగవంతుడగును (జ్ఞానీత్వాత్మైవమేమతమ్‌). కనుక తనయం దెపుడు

* యస్మిన్‌ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానత: తత్ర కో మోహ: కః శోక ఏకత్వమనుపశ్యత: (ఈశావాస్యోపనిషత్తు)

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 375

జగత్తంతటినిజూచునో, అపుడు భగవంతునియందును ప్రకారము చూచినట్లేయగును. అయితే స్థితి అజ్ఞానకాలమున కలుగదు. జ్ఞానప్రాప్తిచే ద్వైతభావనతొలగి, అద్వైతభావమేర్చడునపుడు సిద్ధించును. అత్తజి గురువునకు శిష్యునకు గాని భగవంతునకు భక్తునకుగాని ఈషత్తెనను భేదములేక, అంతయు ఏకస్వరూపముగ యలరుచుండును. fF:

ఇచట అర్జునుడు = ౫, శ్రీకృష్ణుడు = ౪, సమస్తప్రాణికోట్టు = 2, అని అనుకొనినచో-

“ద్రక్షస్యాత్మన్యతోమయి' - అను వాక్యముద్వారా ఆత్మని = తనయందు ( అర్జునునియందు) సమస్తప్రాణికోట్లను చూడగలడు కావున, = 2 అగుచున్నది. అట్లే మయి = శ్రీకృష్ణమూర్తియందు సమస్తప్రాణికోట్లను చూడగలడు కావున Y = 2 అగుచున్నది.

కాబట్టి = 2 (అర్జునుడు = సమస్తప్రాణికోట్టు) Y = 2 (కృష్ణుడు = సమస్తప్రాణికోట్లు) అందుచేత X= Y (అర్జునుడు = కృష్ణుడు) అని తేలుచున్నది.

సమస్త ప్రాణికోట్లు రెండువస్తువులందు వేర్వేరుగనుండుట సంభవించదు. గనుక గణిత శాస్త్ర దృష్ట్యా (Mathematical గా) చూచిన రెండును ఒకటియే కావలసియున్నది. కావున జ్ఞానానంతరము జీవుడు సాక్షాత్‌ శ్రీకృష్ణపరమాత్మయే యగుచున్నాడని యర్థము.

దీనినిబట్టి చూచినచో జ్ఞాన మెంతటి మహత్తరవస్తువో బోధపడగలదు. ప్రపంచములో నెంతయో కష్టపడినచో కొంతధనము, క్షేత్రము, అధికారము మాత్రము లభించుచున్నవి. కాని ఒకింత పరిశ్రమచే, సాధనచే, _ఇంద్రియనిగ్రహముచే, _ఆత్మవిచారణముచే, _ భక్తిచే (బ్రహ్మాండమునంతటిని జీవుడు పాందగల్గుచున్నాడు. వెయ్యేల సాక్షాత్‌ భగవంతుడే తానగుచున్నాడు. ఎట్టి ఉత్కృష్టపదవి! కాబట్టి శ్రీకృష్ణమూర్తియొక్క వాక్యము లందు అకుంఠిత విశ్వాసముంచి అట్టి మహోన్నతపదవిని బడయుటకై మహనీయులను సేవించి జన్మయందే ఆత్మజ్ఞానమును సముపార్టించవలెను.

ప్ర:- జ్ఞానమును పొందినచో కలుగు ఫలితమేమి?

ఉ:- (1) మరల జీవుడు మోహమందు (అజ్ఞానమందు) పడకుండును (2) అత్తజీ సమస్త ప్రాణికోట్లను తనయందును, భగవంతునియందును వీక్షింపగల్లును.

అ॥ జ్ఞానప్రభావము నింకను చెప్పుచున్నాడు - 36. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్టవేనెవ వృజినం సంతరిష్యసి.

టీక:- సర్వేభ్యః పాపేభ్యః = పాపాత్ములందటికంటెను, (త్వమ్‌ = నీవు) పావకృత్తమః = మిగుల పాపము చేసినవాడవు, అనీబేత్‌ అని = అయితివేనియు, సర్వమ్‌ = సమస్తమైన, వృజినమ్‌ = పాపమును, జ్ఞానవ్లవేన ఏవ = జ్ఞానమను తెప్పచేతనే, సంతరివ్యని = లెస్సగ దాటగలవు.

తౌ:-. (ఒకవేళ) పాపాత్ములందజికంటెను నీవు మిగుల పాపము చేసినవాడవైతివేని, సమస్త పాపసముద్రమును జ్ఞానమను తెప్పచేతనే లెస్సగ దాటివేయగలవు.

376 గీతామకరందము [4వ అధ్యాయము

వ్యాఖ్య: =) మహాపాపాత్ముడైనను జ్ఞానముచే పాపరహితుడై తరించిపోగలడని ఇచట వచింపబడినది. జ్ఞానముయొక్క మహాత్తరశక్తి దీనిచే వెల్లడియగుచున్నది. అల్పపాపమునే కాదు; కొండంతపాపమునుగూడ భస్మీభూత మొనర్చగలశక్తి జ్ఞానమునకు కలదు. కనుకనే భగవాను డిచట ప్రపంచములోని పాపాత్ములందజికంటెను గొప్ప పాపము చేసినవానిని దృష్టాంతముగ తీసికొని అట్టివాడుకూడ జ్ఞానముచే తరించగలడని సెలవిచ్చిరి. (“పాపకృత్‌ ', “పాపకృత్తరః, “పాపకృత్తమః) - “తమి ప్రత్యయ ముపయోగింపబడుటద్వారా పాపముయొక్క తీవ్రత యిచట వ్యక్తముచేయ బడెను. అట్టి ఘోరపాపికూడ జ్ఞానప్రభావముచే పాపరహితుడై ముక్తినందుచుండ, ఇక అల్పపాపములను చేసినవారినిగూర్చి చెప్పవలెనా? కావున పాపాత్ములిక భయపడనవసరములేదు. వారు గతించిన తమ పాపములనుగూర్చి పశ్చాత్తాపపడి ఇకమీదట పాపముచేయక జ్ఞానోపార్టనమునకు వలసిన సాధనములను గావించిన చాలును. తరించిపోగలరు.

మహాపాపికూడ జ్ఞానముచే తరించిపోగలడని చెప్పుటచే పాపమును ప్రోత్సహించిన ట్లెన్నడును ఊహింపరాదు. అది భగవానుని యభిమతముకాదు. ఇదివరలో అజ్ఞానవశమున పాపములను చేసియున్నను, ఇకమీదట అట్లుచేయక జ్ఞానసంపాదనముగావించినచో ముక్తుడగుననియే చెప్పబడినది. జ్ఞానోత్కర్షత్వమును చాటుటయే శ్లోకముయొక్క ఆంతర్యము. కావున ఇక పాపాత్ములు దిగులునొందవలసినపనిలేదు. వారు ధైర్యముతో సన్మార్గ మవలంబించినచో శ్రేయమును పొందగలరు. సముద్రమెంత విశాలముగ నున్నప్పటికిని, ఒకచిన్న తెప్పచే దానినంతను దాటివేయవచ్చును. అట్లే పాపసము[ద్ర మెంత అగాధముగ నున్నప్పటికిని జ్ఞానమను తెప్పచే నది లెస్సగ దాటివేయబడగలదని యిచట వచింపబడినది. “తరిష్యసి అనిచెప్పక “సంతరిష్యసి” అని చెప్పుటచే జ్ఞాన ప్రాప్తివలన పాపాత్ముడు సంసారసముద్రమును లెస్సగ దాటగలడని స్పష్టమగుచున్నది. వాల్మీకియే ఇందులకు ప్రబలదృష్టాంతము.

“పాపియగువాడు శాస్త్రమును చదువరాదు; వేదాంతమును తాకరాదు; ఓంకారము నుచ్చరించరాదు; గీతను పఠింపరాదు” అనునిట్టి వాక్యములకు అర్థమే లేదని శ్లోకము వలన తెలియుచున్నది. రోగికే బెషధము కావలసియున్న చందమున పాపాత్మునకే, బద్దునకే విముక్తి సాధనమగు జ్ఞానము ముఖ్యముగ అవసరము. కాబట్టి దుఃఖసాగరమును దాట నుంకించువారు పాపాత్ములైనను పుణ్యాత్ములైనను నిర్భయముగ జ్ఞానసంపాదన మొనర్చి ముక్తినాందవచ్చునని భగవాను డిచట సర్వులకును అభయమొసంగిరి.

“చేత్‌” “అపి అను రెండు ప్రత్యయములవలన అర్జునుడు పాపికాదని స్పష్టీకరించబడినది. ఆతడు దైవగుణములు కలవాడనియే మున్ముందు చెప్పబడును. (మాశుచ స్పంపదం దైవీమభిజాతోఇ-ని (16-5)

ప్ర:- పాపమును పోగొట్టుకొనుటకు ఉపాయమేమి? ఉ:- జ్ఞానమును సముపార్టించుటయే. ప్ర:- జ్ఞానముయొక్క ప్రభావమెట్టిది? ఉ:- మహాపాపాత్ముడైనను జ్ఞానమను తెప్పచే పాపసము(ద్రమును దాటివేయగలడు. అ॥ ఇక, అగ్నిదృష్టాంతముచే జ్ఞానముయొక్క మహిమను వర్ణించుచున్నాడు-

37. యృథైెధాంసి సమిడ్దోఇ_గ్నిర్భస్మసాత్కురుతేఇ_ర్హున జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా.

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 377

టీక:- అర్జున = అర్జునా, సమిద్ధః = బాగుగ ప్రజ్వలింపజేయబడిన, అగ్సిః = అగ్ని, ఏధాంని = కట్టెలను, యథా = ప్రకారముగ, భస్మసాత్‌= భస్మీభూ తమొనర్చుచున్నదో, తథా = ప్రకారముగనే, జ్ఞానాగ్మిః = జ్ఞానమనెడి అగ్ని, సర్వకర్మాణీ = సమస్తకర్మలను, భస్మసాతకురుతే = భస్మముచేసి వైచుచున్నది (నశింపజేయుచున్నది).

తౌ:- అర్జునా! బాగుగ ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెల నేప్రకారము బూడిదగా జేయునో ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్తకర్మలను భస్మమొనర్నివెచుచున్నది.

వ్యాఖ్య:- జ్ఞానమును అగ్నితో పోల్చి దానిమహిమ నిచట వర్ణించుచున్నారు = దుఃఖరాహిత్యము జన్మరాహిత్యముచే గలుగును. జన్మరాహిత్యము కర్మరాహిత్యమువలన సిద్ధించును. కర్మరాహిత్యము జ్ఞాన ప్రాప్తివలన చేకూరును. కొండంత కట్టెలరాళినైనను అగ్ని బూడిదగా చేసివేయగలదు. అట్లే సంచితకర్మ లనేకములుండినను, వానినన్నింటిని జ్ఞానమను అగ్ని వినాశమొనర్పగలదు, అయితే బాగుగా జ్వలించుచున్న అగ్నిమాత్రమే అక్కార్యమును సాధింపగలదు; మందాగ్ని కాదు. కనుకనే “సమిద్దోల_గ్నికి అను పదము ప్రయోగింపబడినది. కాబట్టి జ్ఞానము పరిపూర్ణముగ సంప్రాస్తించనిచో కర్మసంచయము రహితము కానేరదు. స్వప్నమనుజుని కర్మ మేలుకొనిన పిదప ఎట్లు నశించునోో అట్లే జ్ఞానప్రాప్తిరూప జాగృతిచే సంసారస్వప్పసంబంధ కర్మయంతయు, జీవునకు తొలగిపోవును. “సర్వకర్మాణి అని చెప్పినందువలన సమస్తకర్మలను, _కర్మబంధములను జ్ఞానముచే మనుజుడుదాటివేయగలడని స్పష్టముచేయబడినది. (జ్ఞానమనగా ఆత్మానాత్మ విచారణచే దృశ్యమును మిథ్యగ భావించి త్రోసివైచి దృగ్రూప ఆత్మను - అవలంబించుట). కాబట్టి జననమరణరూప కర్మఫలమును తప్పించుకొనదలచువాడు జ్ఞానమును తప్పక సంపాదించవలెనని శ్లోకముద్వారా స్పష్టమగుచున్నది “క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్దృష్టే పరావరే (పరమాత్మను గాంచినవాని కర్మలన్నియు నశించిపోవుచున్నవి). అను ముండకోపనిషద్వాక్య మీసత్యమునే బుజువుచేయుచున్నది.

ప్ర:- కర్మసంచయ మెట్టు తొలగును?

ఉః- జ్ఞానముచే (మండుచున్న అగ్ని కట్టెలను దహించునట్టు జ్ఞానము కర్మలన్నిటిని భస్మీభూ తమొనర్చగలదు).

(ప్రా జ్ఞానముయొక్క మహిమను నిరూపింపుము? ఉం- అది కర్మరాసులను నిర్మూల మొనర్చి జీవుని బంధవిముక్తునిగ జేయగలదు. అ॥ జ్ఞాన మెట్లు చేకూరగలదో వివరించుచున్నాడు -

38. హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని వినతి.

టీక:- ఇవా = ప్రపంచమున, జ్ఞానేన = జ్ఞానముతో, సద్భశమ్‌ = సమానముగ, వవిత్రమ్‌ = జ్జ క్ల పవిత్రమైనది, విద్యతే పా = (ఏదియు) లేనేలేదుకదా!, తత్‌= అట్టి జ్ఞానమును, యోగసంనిద్ధః = (కర్మ)

378 గీతామకరందము [4వ అధ్యాయము

యోగసిద్ధినిబొందినవాడు, కాలేన = కాలక్రమమున, ఆత్మని = తనయందు, స్వయమ్‌ = స్వయముగనే, విన్హతి = పొందుచున్నాడు (అనుభవించుచున్నాడు).

తౌ:- ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది ఏదియును లేదు. అట్టి జ్ఞానమును (కర్మ) యోగసిద్ధిని బొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగ పొందుచున్నాడు.

వ్యాఖ్య:- ప్రపంచమున పవిత్రమైనవస్తువు లెన్నియో కలవు. కాని వాని యన్నింటికంటెను పరమపవిత్రమైనది జ్ఞానమేయని యిట వచింపబడినది. మనుజుని పునీతమొనర్చుటలో జ్ఞానమునకు మించినది మజియొకటి లేదు. అయ్యది జీవుని అజ్ఞానరూపమాలిన్యమును బోగొట్టి ఆత్మానుభూతిని గలుగుజేయును. జీవుని స్థూలదేహమునకు సంబంధించిన కల్మషమును బోగొట్టుటకు సబ్బు, సీకాయ, కుంకుడుకాయ, నీరు మొదలైనవస్తువు లెన్నియోకలవు. అట్లే సూక్ష్మదేహమగు చిత్తమునకు పట్టిన మాలిన్యమును నిర్మూలించుటకు, కర్మ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము మున్నగు సాధనము లనేకములు కలవు. వానియన్నిటిలో జ్ఞానమే సర్వ శ్రేష్టమని భగవానుడు వచించుచున్నారు.

“స్వయమ్‌” - అయితే జ్ఞాన మెట్లు లభించును? స్వకీయ ప్రయత్నముచేతనే. తన్నుతానే యుద్ధరించుకొనవలెను. తనయాకలిని తానే తీర్చుకొనవలెను. గురువులు, దైవము, పెద్దలు సహాయముమా త్రము చేయుదురు. నడువవలసినది తానే. అనుభవించవలసినది తానే. స్వప్రయత్నముచేతనే జ్ఞానమును సముపార్టించవలెను. కనుకనే “స్వయమ్‌” అను పదము ప్రయోగింపబడినది.

“యోగసంసిద్ధలొ - జ్ఞానమును పొందుటకు ముందుగా యోగసంసిద్భుడు కావలెను. అనగా కర్మయోగమందు ఆరితేరవలెను. నిష్కామకర్మమును బాగుగా అనుష్టించుచువచ్చి చిత్తశుద్ధిని బడయవలెను. వస్త్రమునకు మురికిపోయిననే రంగు అంటునట్లు నిష్కామకర్మ సాధనచతుష్టయసంపత్తి మున్నగు చిత్తశుద్ధికర యత్నములచే హృదయము నిర్మలమైనపుడే జ్ఞానముదయించును.

“ఆత్మని” - అయితే జ్ఞాన మెచట నుదయించును? తనయందే. తనహృదయమందే జ్ఞానము వ్యక్తమగునుగాని అన్యత్రకాదు. అది యింకొకడు అనుభవించువస్తువు కాదు. తనకుతానే యనుభవించును. కనుకనే “ఆత్మని అని ప్రయోగింపబడినది. జ్ఞాన మెపుడు కలుగును?

“కాలేన” - కాలక్రమమున (కర్మయోగమందు సిద్ధినిబడసినవెనుక) జీవునియందది యుదయుంచును. 'మోక్ష మెపుడు సిద్ధించును? జ్ఞాన మెపుడు కలుగును?” అను ప్రశ్నలకు భగవాను డిచట చక్కని సమాధానమొసంగిరి. మోక్షమునకు కాలనియమము లేదు. చిత్త మెపుడు పరిక్వమగునో అపుడే అది లభించును. వారివారి సాధనలయొక్క తీవ్రతనుబట్టి కొందటికి శ్రీఘ్రముగను, మటికొందరికి చిరకాలమునకును అది చేకూరును. కావున మోక్షవిషయమై, జ్ఞానవిషయమై ఎవరును నిరుత్సాహపడవలసిన పనిలేదు. వారివారి ప్రయత్నాతిశయమును బట్టి కాలక్రమమున సర్వులకును అది లభింపగలదు. అయితే ప్రయత్నమును మాత్రము విడనాడరాదు. పచ్చికాయ పండవలెనన్న కొంత కాలము పట్టును. క్రమపరిణామమునొంది అది పక్వము కావలెను. లోపల చెట్టు మొదలుకు నీరు మాత్రము తప్పక పోయుచుండవలెను. శిశువు జన్మించవలయుననిన తల్లి తొమ్మిదినెలలు ఓపికపట్టవలెనుగదా! కాబట్టి సహనము గల్గి నిశ్చలమనస్సుతో నిష్కామకర్మయోగాది సాధనల నవలంబించి హృదయనైర్మల్యమును సంపాదించినచో జ్ఞానము దానంతటనదియే భగవదను గ్రహముచే జీవునియందు వ్యక్తమగును. .కాలేన. అను పదముయొక్క వివరణమిదియే.

4వ అధ్యాయము] కిన యోగము 379

ప్రకారముగ జ్ఞానముయొక్క సర్వశ్రేషత్వమున్ను అది ఎపుడు ప్రకారముగ ఎచ్చోట సంభవించునను విషయమున్ను సంక్షేపముగ శ్లోకమునందు తెలుపబడినది. కావున ముముక్షువు లిద్దానిని బాగుగ జ్ఞాపకమునందుంచుకొని తదనురీతిగ యాచరించి జ్ఞానవంతులై తరించవలయును.

ప్ర:- ప్రపంచములో అన్నిటికంటెను మిగుల పవిత్రమైన వస్తువేది?

ఉ:- ఆత్మజ్ఞానము.

ప్ర;- అది (1) ఎట్టు (2) ఎచట (3) ఎప్పుడు జీవునకు లభించును?

ఉ;- (1) కర్మయోగసిద్ధిచే (2) తనయందే (3) కాలక్రమమున లభించును.

అ॥ అట్టి జ్ఞానము నెవరు పొందగలరో, పొందిన పిదప కలుగు ఫలితమేమియో వచించుచున్నాడు -

39. శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్చియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణా ధిగచ్చతి.

టీక:- శ్రద్ధావాన్‌ = శ్రద్ధగలవాడును, తత్సరః = తదేకనిష్టతో గూడినవాడును, సంయతేగ్రియః = ఇంద్రియములను లెస్సగ జయించినవాడును, జ్ఞానమ్‌ = (ఆత్మ) జ్ఞానమును, లభతే = పొందుచున్నాడు, జ్ఞానమ్‌ = జ్ఞానమును, లబ్బా = పొంది, వరామ్‌ = గొప్పదైన, శాంతిమ్‌ = శాంతిని, అచిరేణ = శ్రీఘ్రముగ, అధిగచ్చతి = పొందుచున్నాడు

తా;- (గురు, శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, ( ఆధ్యాత్మికసాధనలందు) తదేకనిష్టతో గూడినవాడును, ఇంద్రియములను లెస్సగ జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు పరమశాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.

వ్యాఖ్య:- జ్ఞానమును ఎవడు పొందగల్లునో ఇట వచింపబడినది. జ్ఞానమును పొందవలెననిన మూడు సుగుణములుగల్గియుండవలెను. అవి యేవియనిన - (1) శ్రద్ధ (2) తదేకనిష్ట (3) ఇంద్రియని[గ్రహము. ఇవి లేనివారు జ్ఞానమును పొందజాలరు.

(1) శ్రద్ధ - కార్యమందైనను శ్రద్ధ అధికముగ నున్నపుడే సతృ్ఫలితములు చేకూరును. గురువునందుగాని, దైవమునందుగాని, శాస్త్రమందుగాని జీవున కెంతెంత శ్రద్ధ అధికముగనుండునో, అంతంత ఉత్తమ ఫలములను వారివలన నతడు బడయగల్లుచుండును. “ఇది తప్పక మేలు కలిగించును” అను అచంచల .విశ్వాసముతో సాధన నుపక్రమించవలెనే కాని “ఇది సిద్ధించునో లేదో, దీనివలన మేలు ఉండునో లేదో అను సందిగ్ధస్థితి యుండరాదు. కనుకనే భగవాను డీ “శ్రద్ధ” యను సుగుణమును గూర్చి గీతయందు పలుతావుల నుద్ధాటించియున్నారు.

“తత్పరః - ఇక రెండవ సుగుణము తత్పరత్వము “తదేకనిష్టి, పట్టుదలతో, ఏకాగ్రతతో తదేకచింతనతో జ్ఞానమును సాధించవలెను. శరిరము, వాక్కు, మనస్సు అనుత్రికరణములు అక్కార్యమునందే సంలగ్నములు కావలెను. ఇతరకార్యములను తగ్గించుకొని జ్ఞానప్రాప్తిరూప

380 గీతామకరందము [4వ అధ్యాయము

పౌకకార్యమందే చిత్తమును కేంద్రీకరింపవలెను. చిత్తముయొక్క శక్తులన్నియు ఛిన్నాభిన్నములు కాక ఒకేవస్తువునందు ప్రసరించినచో అత్తజి అఖండశక్తి ప్రాదుర్భవింప లక్ష్యము నది కరతలామలకము గావించుకొనగలదు. కావున మనస్సును దృశ్యవిషయము లనుండి మరల్చి పరమార్థవిచారణవైపునకు తిప్పి తదేకనిష్టతో దానిని సాధించవలెను. అపుడే యా జ్ఞానము శీఘ్రముగ సిద్ధించును.

“సంయతేద్దియ౯” - జ్ఞానప్రాప్తీకి మూడవ ఆవశ్యకత ఇంద్రియని[గ్రహము. ఇంద్రియములద్వారా మనస్సు బహిః ప్రపంచమువైపునకు పరుగిడి విషయములపై ట్రాలుచుండినచో, హృదయాంతర్వర్తియగు ఆత్మ నది యేకాలమందును తెలిసికొనజాలదు. మజియు నత్తటీ జ్ఞాననిష్టయం దేకాగ్రత సంభవించదు. కావున అంతర్ముఖత్వమవలంబించవలెను. అదియో; ఇంద్రియని(గ్రహములేనిదే ఎన్నటికిని సిద్ధింపదు. కాబట్టి జ్ఞాన ప్రాప్తికి, ఆత్మసాక్షాత్కారమునకు ఇంద్రియని[గ్రహము అత్యావశ్యకమైనది. “యతేస్దియఃి అని చెప్పక “సంయతేన్దియఃి అని చెప్పుటవలన ఇంద్రియములను లెస్సగ నిగ్రహింపవలయుననియు, సామాన్యనిగ్రవాము చాలదనియు సూచితమగుచున్నది. సాధకునకు ఇంద్రియములు ప్రబలశత్రువులు. నిత్యవెరులు. శత్రువులను నిరోధింపనిదే (ఆత్మ) సామ్రాజ్యము లభింపదు. కావుననే జ్ఞాన ప్రాప్తికి ఇంద్రియసంయనుము అత్యావశ్యకమని యిచట తెలుపబడుటకు కారణము.

ప్రకారము శ్రద్ధ తదేకనిష్ట ఇంద్రియని(గ్రహముల నవలంబించి జ్ఞానమును బొందినచో కలుగు ఫలితమేమి? “పరమశాంతి (సామాన్యశాంతికాదు). జ్ఞానమును బొందిన వెనువెంటనే పరమశాంతి జీవునకు లభించును. అదియే మోక్షస్థితి, “అచిరేణి అని చెప్పుటవలన అట్టి ఫలితము జ్ఞానానంతరము శీఘ్రాతి శీఘ్రముగ కలుగునని భావము. సూర్యోదయముచే అంధకారము నశించి పరమ ప్రకాశము తత్‌క్షణమే నలుదెసల వ్యాపించునట్లు జ్ఞానోదయముచే సంసారదుఃఖ మంతరించి మోక్షరూప పరమశాంతి వెంటనే లభ్యమగును. శాంతికి మార్గమేదియని ప్రపంచములో పెక్కురు ప్రల్నించుచున్నారు. దానికి సమాధానము నీ శ్లోకములో భగవానుడు తెలియజేసిరి. “ఓ జీవులారా! మీరు పరమశాంతిని కాంక్షింతురేని ఆత్మజ్ఞానమును బడయుడు!” అని వారు హెచ్చరించుచున్నారు. ప్రపంచములో దృశ్యవస్తువులచే లభించునది అల్పశాంతియేకాని పరమశాంతికాదని మజువరాదు. కావున దానికై అజ్జులుచాచక జ్ఞానజన్యమగు పరమశాంతికొజకే యత్నించుదురుగాక! శాంతికి రాజబాటను భగవాను డిచట చూపిరి. కావున అశాంతిచే పరితపించు జీవులు దానికై యేల కృషిసలుపరాదు?

'ప్ర:- జ్ఞానము నెవడు పొందగల్సును?

ఉ:- (1) శ్రద్ధగలవాడు (2) తదేకనిష్టతోగూడినవాడు (3) ఇంద్రియని[గ్రహము లెస్పగ గలవాడు, ప్రః- జ్ఞానప్రాప్తివలన కలుగు ఫలితమేమి?

ఉ:- పరమశాంతి.

ప్రః- శాంతికి మార్గమేది?

ఉ:- జ్ఞానప్రాప్తి.

అ॥ శద్ధలేనివారికి కలుగు దుర్గతిని వివరించుచున్నాడు -

4వ అధ్యాయము] జ్ఞాన యోగము 381

40. అజ్జశ్చాశద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో౭_స్తి పరో సుఖం సంశయాత్మనః.

టీక:- అజ్ఞళ్ళ = జ్ఞానములేనివాడును, అశ్రద్దధానళ్ళ = శ్రద్ధలేనివాడును, సంశయాత్మా = (శాస్త్ర, గురు వాక్యములను) సందేహించు మనస్సుగలవాడును, వినళ్ళతి = పూర్తిగ నశించుచున్నాడు, సంళయాత్మనః = సంశయచిత్తునకు, అయమ్‌ = ఈ, లోకః = లోకము, నాన్హీ = లేదు, వరః = పరలోకమున్ను, = లేదు, సుఖమ్‌ = సుఖమున్నులేదు.

తౌ;- జ్ఞానములేనివాడు, _ శ్రద్ధారహితుడు, _ సంశయచిత్తుడు _ వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకముగాని, పరలోకముగాని, సౌఖ్యముగాని లేవు.

వ్యాఖ్య:- గురువాక్యమునందు, శాస్త్రవాక్యమునందు, - పరమార్ధసత్యములందు విశ్వాసము, శ్రద్ధకలవాడు జ్ఞానప్రాప్తిచే పరమశాంతిని బొందునని (క్రిందటి శ్లోకమున చెప్పబడినది. అట్టి శ్రద్ధలేనివాడు జ్ఞానహీనుడై సంసారకూపమునబడి నశించునని శ్లోకమునతెలియజేయబడినది. (1) అజ్ఞాని (2) ఢ్రద్ధలేనివాడు (3) సంశయచిత్తుడు అను నీమువ్వురును కడతేరరనియు, వినాశమునే పొందుదురనియు చెప్పబడినది. ఇందు అజ్ఞాని పరమార్థవిషయములను తెలియక, తెలిసికొనుటక్రైనను యత్నింపక, దృశ్యమును సత్యమనినమ్మి జననమరణములంబాల్పడి నశించును. శ్రద్ధలేనివాడు శాస్త్రాదులందు అవిశ్వాసముగల్లి వానియందు ప్రవర్తింపక తతృలితముగ ధర్మచ్యుతుడై నశించును. ఇక మూడవవాడగు సంశయచిత్తుడు ప్రతిదానిని సందేహించుచు, కింకర్తవ్యవిమూఢుడై పరమార్థసాధనచేయక ఊరకయుండి నశించును. “నశ్యతి” అని చెప్పక “వినశ్యతి అని చెప్పుటచే మువ్వురును ఘోరవినాశమును బడయుదురని స్పష్టమగుచున్నది.

ప్రకారముగ పైముగ్గురినిగూర్చి చెప్పి మరల రెండవపాదములో సంశయాత్ముని గూర్చి ప్రస్తావించి అతనికి ఇహపరసౌఖ్యములుగాని మనశ్శాంతిగాని యుండనేరవని భగవానుడు తెలియజేసిరి. సంశయము మనస్సును పీల్చిపిప్పిచేయును కావున ముముక్షువు శాస్త్ర గురువాక్యములందు విశ్వాసము, డ్రద్ధగలిగి, సంశయమును .పారద్రోలి అధ్యాత్మపథమున పురోగమించవలెను. అపుడే పూర్ణసుఖము (మోక్షస్థితి) చేకూరగలదు.

ప్ర:- ప్రపంచమున వినాశమును బొందువారెవరు?

ఉ:- (1) అజ్ఞాని (2) శ్రద్ధావిహీనుడు (3) సంశయచిత్తుడు.

ప్ర;- సంశయాత్ముని కెట్టి దుర్గతి కలుగును?

ఉ:-- అతనికి ఇహలోకసుఖముగాని, పరలోకసుఖముగాని, మనశ్శాంతిగాని యుండనేరవు. ప్రా కాబట్టి ముముక్షువుయొక్క కర్తవ్యమేమి?

ఉ- (1) అజ్ఞానమునువీడి జ్ఞానమును సముపార్టించవలెను. (2) శాస్త్ర, గురువాక్యములందు అశ్రద్ధగలిగి యుండరాదు. (3) పరమార్ధసత్యములందు సంశయము కలిగియుండరాదు.

అ॥ జ్ఞానిని కర్మలు బంధింపనేరవని వచించుచున్నాడు -

382 గితామకరందము [4వ అధ్యాయము

41. యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్‌ ఆత్మవన్తం కర్మాణ్‌ నిబధ్నన్తి ధనజ్ఞాయ.

టీక; భధనజ్ఞాయ = అర్జునా, యోగసన్న్యస్తకర్మాణమ్‌ = నిష్కామకర్మయోగముచే కర్మఫలములను త్యజించినవాడును, లేక ఈశ్వరార్చణ మొనర్భినవాడును, జ్ఞాననంభిన్సనంశయమ్‌ జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు, అత్మవన్హమ్‌ = అత్మనిష్ముని, కర్మాణి = కర్మములు, నిబద్దున్లి = బంధింపవు.

తా;- అర్జునా! నిష్కామకర్మయోగముచే కర్మఫలములను త్యజించినవాడును, లేక ఈశ్వరార్పణమొనర్చిన వాడును, జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడు నగు ఆత్మనిష్టుని ((బహ్మజ్ఞానిని) కర్మములు బంధింపనేరవు.

వ్యాఖ్య:- కర్మ లెవనిని బంధింపకుండునను ప్రశ్నకిచట సమాధానము చెప్పబడినది. కర్మఫలములను త్యజించి, జ్ఞానముచే సమస్తసంశయములను బోగొట్టుకొని, ఆత్మయందు నిలుకడను బొందినట్టి జ్ఞానిని కర్మలు బంధిపనేరవు. కర్మఫలములను ఈశ్వరార్చణముచేసిి సంగరహితుడై, ఆత్మయందు స్థితి గలిగి యుండువానికి, దృశ్యమగు . దేహమునందు . అహంభావ, ముండదుగనుక్క కర్శృత్వభావములేనివాడై యుండుటవలన కర్మ లతనిని. బంధింపనేరవు. అట్టివాడు నిరంతరము కర్మలాచరించినను, వానియందు తగుల్కొనడు. బంధమున్ను గలుగదు. . ఏలయనగా. బంధమనునది కర్మలు చేయుటయందుగాని, చేయకుండుటయందుగాని లేదు. ఫలాభిలాషయందు, కర్తృత్వబుద్ధి యందు, సంగమునందు మాత్రమే బంధముకలదు. మజియు ఆకత్మనిష్ణుడగు వానికి సమస్తకర్మలున్ను జ్ఞానాగ్నిచే దగ్ధములై పోవుటవలన ఇక వాని నవి యెట్లు బంధింపగలవు?

“జ్ఞానసంఛిన్నసంశయమ్‌” - జ్ఞానము కలుగనంతవజకు జీవుని సంశయములు బాధించుచునేయుండును. ప్రత్యక్షజ్ఞానము కలిగినమీదట సందేహములన్నియు పటాపంచలైపోవును (ఛిద్యన్తే సర్వసంశయా$).

ఆత్మవన్తమ్‌” - ఆత్మనిష్ణని, (బహ్మజ్ఞానసంపన్నుని కర్మలెవ్వియు బంధింపనేరవు. ప్రపంచములో నొక ఆత్మజ్ఞానిని దప్ప తక్కినవారినందటిని (వారు ధనవంతులైనను, బలవంతులైనను, విద్యావంతులైనను, సౌందర్యవంతులైనను) కర్మలు బంధించి వైచును. కాబట్టి ఆత్మజ్ఞానమును బడసి ఆత్మవంతుడగుటకే సర్వులును యత్నశీలురు కావలెను.

ప్రః- కర్మ లెవనిని బంధింపవు?

ఉ:- (1) నిష్కామకర్మయోగముచే కర్మఫలమును త్యజించువానిని, లేక ఈశ్వరార్చణము చేయువానిని (2) జ్ఞానముచే సంశయములు నివర్తించినవానిని (3) ఆత్మనిష్టుని కర్మలు బంధించనేరవు.

ప్ర:- కావున కర్మలచే బంధింపబడకుండుటకుగాను సాధకు డేమి యొనర్పవలయును?

ఉ:- (1) కర్మఫలములను త్యజించివేయవలెను (2) జ్ఞానమును సంపాదించి సంశయనివృత్తి గలుగజేసికొనవలెను (3) ఆత్మయందు స్థితి గల్గియుండవలెను.

4వ అధ్యాయము] _్యంయోగము. 383

అ॥ జ్ఞానముచే అజ్ఞానమును ' బోగొట్టుకొని' లోకహితమున్లా (నిష్కామ) కర్మయోగము నాశ్రయించవలసినదిగా భగవాను డర్జునున' కుద్చోధించుచున్నాడు -

42. తస్మాదజ్ఞానసమ్ఫూతం హృజ్థ్సం జ్ఞానాసినాత్మనః ఛిత్వెనం సంశయం యోగమాతిమ్మోత్తిష్ణ భారత.

టీక:- భారత = అర్షునా!, తస్మాత్‌ = అందువలన, ఆత్మనః = నీయొక్క, హృత్ల్రమ్‌ = హృదయముననున్నదియు, అజ్ఞానసమ్ఫూతమ్‌ = అజ్ఞానమువలన బుట్టినదియు (అగు), ఏనం నంళయమ్‌ = సందేహమును, జ్ఞానానీనా = జ్ఞానమనుఖడ్గముచేత, భిత్వా = ఛేదించి, యోగమ్‌ = (జ్ఞానయోగ సాధనమైన) నిష్కామకర్మయోగమును, ఆతిష్ట = ఆచరింపుము, ఉత్తిష్ట = లెమ్ము.

తా:- అర్జునా! కాబట్టి నీయొక్క హృదయముననున్నదియు, అజ్ఞానమువలన బుట్టినదియునగు సంశయమును జ్ఞానమును ఖడ్గముచే ఛేదించివైచి నిష్కామకర్మ యోగము నాచరింపుము. లెమ్ము.

వ్యాఖ్య:- ప్రకారముగ అధ్యాయమున జ్ఞానమును, జ్ఞానమాహాత్మ్యమును, జ్ఞానయోగసహాయముచే సంభవమగు నిష్కామకర్మయోగమును బోధించి, తుట్టతుదకు భగవానుడు అర్జునుని కార్యాచరణకై పురికొల్చుచున్నాడు. కర్తవ్యనిష్టను బోధించుచున్నాడు. “లెమ్ము (ఉత్తిప్ణు కార్యరంగమున దుముకుము అని ఉత్సాహపరచుచున్నాడు.

“అజ్ఞానసమ్ఫూతమ్‌” - సంశయ, మోహాదులన్నియు అజ్ఞానమునుండియే ప్రాదుర్భవించుచున్నవి. వానియన్నింటికి అజ్ఞానము తల్లివంటిది. సమస్తదుర్గుణములు, దుర్వాసనలు దుస్సంకల్పములు, సంశయములు అచ్చోటనే పుట్టుచున్నవి.

“జ్ఞానాసినా” అజ్ఞానమును పారద్రోలుటయందు జ్ఞానమే సమర్థమగునుగాని తదితరములగు సాధనలున్నుగావు. కనుకనే అద్దానిని ఛేదించుటకు జ్ఞానమను ఖడ్గమును ప్రయోగించవలసినదిగా భగవానుడుద్చోధించిరి. అంధకారమును బోగొట్టుటకు ప్రకాశమొకటియే సమర్ధమగునుగదా! అట్లే అజ్ఞానాంధకారమును నిర్మూలించుటయందు జ్ఞానప్రకాశ ముపయోగపడుచున్నది.

“హృత్థ్సమ్‌” అని చెప్పుటవలన అనాదికాలమునుండి సంశయమోహాదులు హృదయముననే తిష్టవేసికొనియున్నవని స్పష్టమగుచున్నది. శత్రువు దూరమునలేడు. అతిసమీపముననున్న హృదయముననే కలడని యెజుంగవలెను.

“యోగమాతిష్టో జ్ఞానప్రాప్త్య్యనంతరము లోకహితమున్లై _ నిష్కామకర్మయోగాచరణము నవలంబించవలసినదిగా భగవాను డర్జునునకు బోధించుచున్నాడు. జ్ఞానికి కర్మను చేయుటయందుగాని, త్యజించుటయందుగాని పట్టుదల యేమియులేకున్నను, _ ధర్మసముద్ధరణముకొజకును లోకసంగ్రహార్థమున్ను సామాన్యముగ నతడు నిష్కామబుద్ధితో కర్మచేయుచునేయుండును. కనుకనే భగవానుడిచట అర్జునుని గూర్చి “ఓ అర్జునా! ముందు నీవు జ్ఞానమును సంపాదింపుము. అట్టి జ్ఞానఖడ్గముచే అవిద్యాహృదయ (గ్రంథిని ఛేదించివేయుము. తదుపరి లోకహితముకొజకై కర్మను శీలింపుము'. అని యుపదేశించుచున్నాడు.

384 గీతామకరందము x [4వ అధ్యాయము

“ఉత్తిష్ణ - “లెమ్ము!” అనిశ్రీకృష్ణుడు ధైర్యోద్బోధకమగు వాక్యమును పలికిరి. మహాత్ములగువారు నిద్రించుజనులను ఇట్టి వాక్యములచే మేలుకొలుపుదురు. కూర్చొని మూలుగుచున్నవారికి ధెర్యప్రదానముచేసి కార్యరంగమున దుముకునట్లు చేయుదురు. ఇచట అకర్మణ్యుడై రథమున చతికిలబడియున్న అర్జునునకు భగవానుడు ధైర్యమును నూరిపోసి 'ఉత్తిష్ట - (లెమ్ము) అనుచున్నారు! కావున భగవానుని వోక్యమును సంస్కరించి తక్కినవారును అర్జునునివలె తమతమ హృదయములందు జన్మజన్మాంతరములనుండి గాఢముగ నాటుకొనియున్న అవిద్యాగ్రంథిని జ్ఞానఖడ్గముచే నజక్షివైచి కర్తవ్యోన్ముఖులు కావలసియున్నారు. ఎన్ని సాధనలను అవలంబించినను తుట్టతుదకు ఆత్మజ్ఞానమొకటియే బంధవిముక్తికి శరణ్యము. అత్మజ్ఞానమును పొందిన పిదపయే నిష్కామకర్మయోగమును ఇంకను చక్కగ శీలించుటకు అవకాశముండునని యెటుంగవలయును.

ప్ర:- సంశయ, మోహాదు లెచట కాపురముండును?

ఉ:- హృదయమున.

'ప్ర:- అవి దేనినుండి ప్రాదుర్భవించును?

ఉ:- అజ్ఞానమునుండి.

ప్ర:- యజ్ఞాన మెటుల నశించును?

ఉః- జ్ఞానమను ఖడ్గముచే.

ప్రః- అట్లు అజ్ఞానమును నశింపజేసికొనినపిదప మహనీయులు సామాన్యముగ ఏమి చేయుదురు? ఉః- లోకోపకారార్థము నిష్కామకర్మయోగమును శీలించుదురు.

ఓమ్‌ ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశా స్తే శ్రీకృష్ణార్ణునసంవాదే జ్ఞానయోగోనామ

చతుర్థోజ_ధ్యాయః

ఇది ఉపనిషత్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్ణునసంవాదమునగు శ్రీ భగవధ్గీతలందు జ్ఞానయోగమను నాల్గవ అధ్యాయము

ఓమ్‌ తత్‌ సత్‌